Rajashyamala Yagam : మన తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలకు యాగాలకు విడదీయలేని బంధం ఉంది. అందులోనూ రాజశ్యామల యాగానికి చాలా పవర్ ఉంటుందని నమ్ముతారు. ఆ యాగం చేస్తే అధికారం దక్కుతుందనే ప్రచారం ఉంది. గతంలో రాజులు కూడా ఈ యాగం చేసి రాజ్యాలను దక్కించుకున్నారు. ఇక ఇప్పటి కాలంలో రాజకీయ నేతలు ఈ యాగాలను చేస్తున్నారు. అయితే తెలంగాణలో కూడా కేసీఆర్ పలుమార్లు ఈ యాగాన్ని చేసి పదేండ్లు సీఎంగా పరిపాలించారు. అటు ఏపీలో కూడా ఈ యాగానికి ఓ ప్రత్యేకత ఉందని చెప్పుకోవాలి. 2019లో జగన్ ను ఇదే సీఎం చేసిందని అంటుంటారు.
ఆ ఎన్నికల సమయంలో జగన్ పేరు మీద విశాఖలోని శారదాపీఠం వారు ఈ యాగాన్ని నిర్వహించారు. దాంతో అప్పుడు జగన్ సీఎం అయ్యారు. ఇక జగన్ సీఎం అయిన తర్వాత ప్రతి ఏడాది శారదాపీఠం వారు ఈ యాగాన్ని నిర్వహిస్తున్నారు. అష్టలక్ష్మీ యాగంతో పాటు ఈ యాగం నిర్వహిస్తున్నారు. అయితే చివరి రోజున యాగంలో జగన్ సీఎం హోదాలో పాల్గొంటున్నారు. అంతే కాకుండా అటు దేవాదాఖ శాఖ కూడా గతేడాది నిర్విరామంగా ఈ యాగాన్ని పలు ఆలయాల్లో నిర్వహించింది. దానికి పెద్ద ఎత్తున జనాలు కూడా వచ్చారు. ఇక ఈ నెల మొదటి వారంలో కూడా శారదా పీఠం నిర్వహించింది.
ఈ నెల మొదటి వారంలో శారదా పీఠంలో రాజశ్యామల యాగాన్ని నిర్వహించారు. దానికి వైసీపీ ముఖ్య నేతలు హాజరయ్యారు. జగన్ మరోసారి సీఎం కావాలని ఈ యాగం నిర్వహించినట్టు తెలిపారు. అటు ఆ యాగంతో పాటు తాడేపల్లిలో 41 రోజులుగా 45 మంది వేడ పండితులతో శ్రీ మహా రుద్ర నహిత రాజశ్యామల సహస్ర చండీయాగం నిర్వహిస్తున్నారు. ఈ విషయం కూడా పెద్దగా ప్రచారంలోకి రాలేదు. అయితే సరిగ్గా పోలింగ్ పూర్తి అయిన రెండవ రోజున ఈ యాగం కూడా పూర్తి అయింది. దాంతో వేద పండితులు జగన్ నివాసానికి వెళ్లి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఈ యాగంతో జగన్ మరోసారి సీఎం అవడానికి దోహదపడుతుందని తెలిపారు. జగన్ పాలనలో ప్రజలు బాగుంటారని వేదపండితులు చెప్పుకొచ్చారు. మరి ఈ రాజశ్యామల యాగం మరోసారి జగన్ ను సీఎం చేస్తుందా లేదా అనేది చూడాలి.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.