rajashyamala yagam : 41 రోజులుగా రాజశ్యామల యాగం.. మరోసారి జగనే సీఎం..?

Rajashyamala Yagam : మన తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలకు యాగాలకు విడదీయలేని బంధం ఉంది. అందులోనూ రాజశ్యామల యాగానికి చాలా పవర్ ఉంటుందని నమ్ముతారు. ఆ యాగం చేస్తే అధికారం దక్కుతుందనే ప్రచారం ఉంది. గతంలో రాజులు కూడా ఈ యాగం చేసి రాజ్యాలను దక్కించుకున్నారు. ఇక ఇప్పటి కాలంలో రాజకీయ నేతలు ఈ యాగాలను చేస్తున్నారు. అయితే తెలంగాణలో కూడా కేసీఆర్ పలుమార్లు ఈ యాగాన్ని చేసి పదేండ్లు సీఎంగా పరిపాలించారు. అటు ఏపీలో కూడా ఈ యాగానికి ఓ ప్రత్యేకత ఉందని చెప్పుకోవాలి. 2019లో జగన్ ను ఇదే సీఎం చేసిందని అంటుంటారు.

Rajashyamala Yagam : జగన్ సీఎం హోదాలో..

ఆ ఎన్నికల సమయంలో జగన్ పేరు మీద విశాఖలోని శారదాపీఠం వారు ఈ యాగాన్ని నిర్వహించారు. దాంతో అప్పుడు జగన్ సీఎం అయ్యారు. ఇక జగన్ సీఎం అయిన తర్వాత ప్రతి ఏడాది శారదాపీఠం వారు ఈ యాగాన్ని నిర్వహిస్తున్నారు. అష్టలక్ష్మీ యాగంతో పాటు ఈ యాగం నిర్వహిస్తున్నారు. అయితే చివరి రోజున యాగంలో జగన్ సీఎం హోదాలో పాల్గొంటున్నారు. అంతే కాకుండా అటు దేవాదాఖ శాఖ కూడా గతేడాది నిర్విరామంగా ఈ యాగాన్ని పలు ఆలయాల్లో నిర్వహించింది. దానికి పెద్ద ఎత్తున జనాలు కూడా వచ్చారు. ఇక ఈ నెల మొదటి వారంలో కూడా శారదా పీఠం నిర్వహించింది.

ఈ నెల మొదటి వారంలో శారదా పీఠంలో రాజశ్యామల యాగాన్ని నిర్వహించారు. దానికి వైసీపీ ముఖ్య నేతలు హాజరయ్యారు. జగన్ మరోసారి సీఎం కావాలని ఈ యాగం నిర్వహించినట్టు తెలిపారు. అటు ఆ యాగంతో పాటు తాడేపల్లిలో 41 రోజులుగా 45 మంది వేడ పండితులతో శ్రీ మహా రుద్ర నహిత రాజశ్యామల సహస్ర చండీయాగం నిర్వహిస్తున్నారు. ఈ విషయం కూడా పెద్దగా ప్రచారంలోకి రాలేదు. అయితే సరిగ్గా పోలింగ్ పూర్తి అయిన రెండవ రోజున ఈ యాగం కూడా పూర్తి అయింది. దాంతో వేద పండితులు జగన్ నివాసానికి వెళ్లి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

rajashyamala yagam : 41 రోజులుగా రాజశ్యామల యాగం.. మరోసారి జగనే సీఎం..?

ఈ యాగంతో జగన్ మరోసారి సీఎం అవడానికి దోహదపడుతుందని తెలిపారు. జగన్ పాలనలో ప్రజలు బాగుంటారని వేదపండితులు చెప్పుకొచ్చారు. మరి ఈ రాజశ్యామల యాగం మరోసారి జగన్ ను సీఎం చేస్తుందా లేదా అనేది చూడాలి.

Recent Posts

Arattai app | వాట్సాప్‌కి పోటీగా వ‌చ్చిన ఇండియా యాప్.. స్వదేశీ యాప్‌పై జోహో ఫోకస్

Arattai app |ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారులు ఉపయోగిస్తున్న వాట్సాప్‌కి భారత్‌ నుండి గట్టి పోటీగా ఓ స్వదేశీ మెసేజింగ్…

3 hours ago

RRB | భారతీయ రైల్వేలో 8,875 ఉద్యోగాలు.. NTPC నోటిఫికేషన్ విడుదల, సెప్టెంబర్ 23 నుంచి దరఖాస్తులు

RRB | సర్కారు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు శుభవార్త! భారతీయ రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) తాజాగా పెద్ద…

4 hours ago

Farmers | రైతులకు విజ్ఞప్తి .. సెప్టెంబర్ 30 చివరి తేది… తక్షణమే ఈ-క్రాప్ నమోదు చేయండి!

Farmers | ఆంధ్రప్రదేశ్ రైతులకు ఒక కీలకమైన హెచ్చరిక. ఈ-క్రాప్ బుకింగ్‌కు సెప్టెంబర్ 30 (రేపు) చివరి తేదీగా వ్యవసాయ…

6 hours ago

Modi | శ్రీశైలం సందర్శించనున్న ప్రధాని మోదీ .. ఇన్నాళ్ల‌కి వాటిని బ‌య‌ట‌కు తీసారు..!

Modi | ప్రధాని నరేంద్ర మోదీ తన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 16న ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్నారు. ఈ సందర్భంగా…

8 hours ago

Telangana | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఐదు దశల్లో ఓటింగ్

Telangana | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (SEC)…

10 hours ago

Prize Money | క‌ప్ గెలిచిన టీమిండియా ప్రైజ్ మ‌నీ ఎంత‌.. ర‌న్న‌ర‌ప్ పాకిస్తాన్ ప్రైజ్ మ‌నీ ఎంత‌?

Prize Money | ఆసియా కప్ 2025 ఫైనల్‌లో ప్రతిష్టాత్మక భారత్ vs పాకిస్తాన్ తలపడడం క్రికెట్ ప్రపంచాన్నే ఉత్కంఠకు…

12 hours ago

Chia Seeds | పేగు ఆరోగ్యానికి పవర్‌ఫుల్ కాంబినేషన్ .. పెరుగు, చియా సీడ్స్ మిశ్రమం ప్రయోజనాలు!

Chia Seeds | ఆధునిక జీవనశైలిలో జీర్ణవ్యవస్థ సంబంధిత సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఫైబర్ లేకపోవడం,…

13 hours ago

TEA | మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచే భారతీయ ఆయుర్వేద టీలు.. ఏంటో తెలుసా?

TEA | ఒత్తిడి, జ్ఞాపకశక్తి లోపం, మానసిక అలసట.. ఇవన్నీ ఆధునిక జీవితశైలిలో సాధారణమయ్యాయి. ఈ తరుణంలో మెదడు ఆరోగ్యాన్ని…

14 hours ago