rajashyamala yagam : 41 రోజులుగా రాజశ్యామల యాగం.. మరోసారి జగనే సీఎం..?
Rajashyamala Yagam : మన తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలకు యాగాలకు విడదీయలేని బంధం ఉంది. అందులోనూ రాజశ్యామల యాగానికి చాలా పవర్ ఉంటుందని నమ్ముతారు. ఆ యాగం చేస్తే అధికారం దక్కుతుందనే ప్రచారం ఉంది. గతంలో రాజులు కూడా ఈ యాగం చేసి రాజ్యాలను దక్కించుకున్నారు. ఇక ఇప్పటి కాలంలో రాజకీయ నేతలు ఈ యాగాలను చేస్తున్నారు. అయితే తెలంగాణలో కూడా కేసీఆర్ పలుమార్లు ఈ యాగాన్ని చేసి పదేండ్లు సీఎంగా పరిపాలించారు. అటు ఏపీలో కూడా ఈ యాగానికి ఓ ప్రత్యేకత ఉందని చెప్పుకోవాలి. 2019లో జగన్ ను ఇదే సీఎం చేసిందని అంటుంటారు.
ఆ ఎన్నికల సమయంలో జగన్ పేరు మీద విశాఖలోని శారదాపీఠం వారు ఈ యాగాన్ని నిర్వహించారు. దాంతో అప్పుడు జగన్ సీఎం అయ్యారు. ఇక జగన్ సీఎం అయిన తర్వాత ప్రతి ఏడాది శారదాపీఠం వారు ఈ యాగాన్ని నిర్వహిస్తున్నారు. అష్టలక్ష్మీ యాగంతో పాటు ఈ యాగం నిర్వహిస్తున్నారు. అయితే చివరి రోజున యాగంలో జగన్ సీఎం హోదాలో పాల్గొంటున్నారు. అంతే కాకుండా అటు దేవాదాఖ శాఖ కూడా గతేడాది నిర్విరామంగా ఈ యాగాన్ని పలు ఆలయాల్లో నిర్వహించింది. దానికి పెద్ద ఎత్తున జనాలు కూడా వచ్చారు. ఇక ఈ నెల మొదటి వారంలో కూడా శారదా పీఠం నిర్వహించింది.
ఈ నెల మొదటి వారంలో శారదా పీఠంలో రాజశ్యామల యాగాన్ని నిర్వహించారు. దానికి వైసీపీ ముఖ్య నేతలు హాజరయ్యారు. జగన్ మరోసారి సీఎం కావాలని ఈ యాగం నిర్వహించినట్టు తెలిపారు. అటు ఆ యాగంతో పాటు తాడేపల్లిలో 41 రోజులుగా 45 మంది వేడ పండితులతో శ్రీ మహా రుద్ర నహిత రాజశ్యామల సహస్ర చండీయాగం నిర్వహిస్తున్నారు. ఈ విషయం కూడా పెద్దగా ప్రచారంలోకి రాలేదు. అయితే సరిగ్గా పోలింగ్ పూర్తి అయిన రెండవ రోజున ఈ యాగం కూడా పూర్తి అయింది. దాంతో వేద పండితులు జగన్ నివాసానికి వెళ్లి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
rajashyamala yagam : 41 రోజులుగా రాజశ్యామల యాగం.. మరోసారి జగనే సీఎం..?
ఈ యాగంతో జగన్ మరోసారి సీఎం అవడానికి దోహదపడుతుందని తెలిపారు. జగన్ పాలనలో ప్రజలు బాగుంటారని వేదపండితులు చెప్పుకొచ్చారు. మరి ఈ రాజశ్యామల యాగం మరోసారి జగన్ ను సీఎం చేస్తుందా లేదా అనేది చూడాలి.
Arattai app |ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారులు ఉపయోగిస్తున్న వాట్సాప్కి భారత్ నుండి గట్టి పోటీగా ఓ స్వదేశీ మెసేజింగ్…
RRB | సర్కారు ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న యువతకు శుభవార్త! భారతీయ రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు (RRB) తాజాగా పెద్ద…
Farmers | ఆంధ్రప్రదేశ్ రైతులకు ఒక కీలకమైన హెచ్చరిక. ఈ-క్రాప్ బుకింగ్కు సెప్టెంబర్ 30 (రేపు) చివరి తేదీగా వ్యవసాయ…
Modi | ప్రధాని నరేంద్ర మోదీ తన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 16న ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వస్తున్నారు. ఈ సందర్భంగా…
Telangana | తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ అధికారికంగా ప్రారంభమైంది. రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (SEC)…
Prize Money | ఆసియా కప్ 2025 ఫైనల్లో ప్రతిష్టాత్మక భారత్ vs పాకిస్తాన్ తలపడడం క్రికెట్ ప్రపంచాన్నే ఉత్కంఠకు…
Chia Seeds | ఆధునిక జీవనశైలిలో జీర్ణవ్యవస్థ సంబంధిత సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, ఫైబర్ లేకపోవడం,…
TEA | ఒత్తిడి, జ్ఞాపకశక్తి లోపం, మానసిక అలసట.. ఇవన్నీ ఆధునిక జీవితశైలిలో సాధారణమయ్యాయి. ఈ తరుణంలో మెదడు ఆరోగ్యాన్ని…
This website uses cookies.