Pawan Kalyan : పవన్ రిక్వెస్ట్ చేస్తే.. పంపకుండా ఉంటారా..!!

 Authored By ramu | The Telugu News | Updated on :19 May 2025,11:00 am

Pawan Kalyan : ఆంధ్రప్రదేశ్‌లో అడవి ఏనుగుల బెడదను నియంత్రించేందుకు కర్ణాటక ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ విజ్ఞప్తి మేరకు ఈ నెల 21వ తేదీన బెంగళూరులో జరిగే ప్రత్యేక కార్యక్రమంలో ఆరు కుంకీ ఏనుగులను కర్ణాటక ప్రభుత్వం ఏపీకి అందించనుంది. ఈ కార్యక్రమంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే పాల్గొననున్నారు. ఏపీ తరఫున అటవీ శాఖను పర్యవేక్షిస్తున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ కార్యక్రమానికి హాజరుకానున్నారు.

రంజన్, దేవా, మాస్తి, కరుణ, కృష్ణ, అభిమన్యు అనే ఆరు కుంకీ ఏనుగులను కొడగు జిల్లాలోని దుబారె ఎలిఫెంట్ క్యాంప్ మరియు శివమొగ్గ జిల్లా సక్రెబైలు ప్రాంతాల నుంచి ఏపీకి తరలించనున్నారు. మొదట వీటిని చిత్తూరు జిల్లాకు తీసుకువెళతారు. ఈ కుంకీ ఏనుగులు అడవి ఏనుగుల గుంపులను నియంత్రించగలిగే సామర్థ్యం కలిగినవిగా గుర్తించబడ్డాయి. శ్రీకాకుళం, విజయనగరం, తిరుపతి, అల్లూరి, చిత్తూరు వంటి జిల్లాల్లో అడవి ఏనుగుల విరాళాలు పెరిగిన నేపథ్యంలో వీటిని నియంత్రించేందుకు ఈ ప్రత్యేక కుంకీ ఏనుగులు ఉపయోగపడనున్నాయి.

Pawan Kalyan : పవన్ రిక్వెస్ట్ చేస్తే.. పంపకుండా ఉంటారా..!!

Pawan Kalyan : పవన్ రిక్వెస్ట్ చేస్తే.. పంపకుండా ఉంటారా..!!

ఈ ఏనుగులతో పాటు వాటిని శిక్షణ ఇచ్చిన మావటులు కూడా ఏపీకి వస్తారు. కొద్ది రోజులు ఈ ప్రాంతంలో ఉండి, ఏనుగులు వాతావరణానికి అలవాటు పడేలా చేస్తారు. అదే సమయంలో అటవీ శాఖ సిబ్బందికి శిక్షణనిచ్చి, నియంత్రణా పద్ధతులపై అవగాహన కల్పిస్తారు. అనంతరం మావటులు తిరిగి కర్ణాటకకు వెళ్లనున్నారు. అయితే కర్ణాటకలోనే ఏనుగుల విరాళాల వల్ల ప్రజలు ఇబ్బంది పడుతుండగా, ఆ రాష్ట్రం కుంకీ ఏనుగులను ఏపీకి ఇవ్వడం పట్ల కొంత విమర్శలు వినిపిస్తున్నాయి. చూద్దాం మరి ఇవి ఏ మేరకు ఏనుగుల గుంపును అరికట్టగలవో..!!

ramu

Tandu Ramalingaiah ( Ramu ) is experienced in Media field. He worked in various Telugu media houses for about 15 years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Chief Editor of thetelugunews.com website. Contact Details : thetelugunews1@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి