Vidadala Rajini : కేసుల‌తో న‌న్ను వేధించాల‌ని చూస్తున్నారు.. విడ‌ద‌ల ర‌జిని కామెంట్స్..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Vidadala Rajini : కేసుల‌తో న‌న్ను వేధించాల‌ని చూస్తున్నారు.. విడ‌ద‌ల ర‌జిని కామెంట్స్..!

 Authored By ramu | The Telugu News | Updated on :24 March 2025,9:00 am

ప్రధానాంశాలు:

  •  Vidadala Rajini : కేసుల‌తో న‌న్ను వేధించాల‌ని చూస్తున్నారు.. విడ‌ద‌ల ర‌జిని కామెంట్స్

Vidadala Rajini  : కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చాక వైసీపీ నాయ‌కుల గుండెల్లో రైళ్లు ప‌రుగెడుతున్నాయి. ఒక్కొక్క‌రిపై పంజా విసురుతుండ‌డంతో వారి గుండెల్లో రైళ్లు ప‌రుగెడుతున్నాయి. తాజాగా విడ‌ద‌ల ర‌జ‌నీకి షాక్ త‌గిలింది. గత ప్రభుత్వ హయాంలో ఓ స్టోన్‌క్రషన్ యజమానిని బెదిరించి.. రూ.2.02 కోట్లు వసూలు చేశారనే ఆరోపణలతో ఆమెపై ఏసీబీ కేసు నమోదయ్యింది.

Vidadala Rajini కేసుల‌తో న‌న్ను వేధించాల‌ని చూస్తున్నారు విడ‌ద‌ల ర‌జిని కామెంట్స్

Vidadala Rajini : కేసుల‌తో న‌న్ను వేధించాల‌ని చూస్తున్నారు.. విడ‌ద‌ల ర‌జిని కామెంట్స్

Vidadala Rajini  యాక్ష‌న్ రియాక్ష‌న్..

పల్నాడు జిల్లా యడ్లపాడులోని శ్రీ లక్ష్మీబాలాజీ స్టోన్‌క్రషర్‌ యజమానిని విజిలెన్స్‌ తనిఖీల పేరుతో విడదల రజిని బెదిరించారనేది ప్రధాన ఆరోపణ కాగా, ఆమెపై అవినీతి నిరోధక చట్టంలోని 7,7ఏ, ఐపీసీ 384, 120బీ సహ పలు సెక్షన్లను చేర్చింది. ఇందులో ఏ1గా విడదల రజిని, ఏ2గా ఐపీఎస్ పల్లె జాషువా, ఏ3గా విడదల రజిని మరిది గోపి, ఏ4గా రజిని పీఏ దొడ్డ రామకృష్ణలుగా పేర్కొంది.

అయితే ఈ కేసుతో నాకెలాంటి సంబంధం లేదు అని విడదల రజిని అన్నారు. కట్టుకథలు అల్లి నన్ను టార్గెట్ చేసి ఏసీబీ కేసు నమోదు చేశారు .కేసులతో నన్ను వేధించాలని చూస్తున్నారు . ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు డైరెక్షన్‌లో ఇదంతా జరుగుతోంది అని విడ‌ద‌ల ర‌జిని అన్నారు. ఇంకా ఇది ఎన్ని మలుపులు తిరుగుతుందో చూడాలి.

Advertisement
WhatsApp Group Join Now

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది