Good News : ఏపీ విద్యార్థులకి తీపి క‌బురు..ఈ డాక్యుమెంట్స్ ఉంటే ఒక్కొక్క‌రికి రూ.15 వేలు | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Good News : ఏపీ విద్యార్థులకి తీపి క‌బురు..ఈ డాక్యుమెంట్స్ ఉంటే ఒక్కొక్క‌రికి రూ.15 వేలు

 Authored By ramu | The Telugu News | Updated on :13 December 2024,10:00 am

ప్రధానాంశాలు:

  •  Good News : ఏపీ విద్యార్థులకి తీపి క‌బురు..ఈ డాక్యుమెంట్స్ ఉంటే ఒక్కొక్క‌రికి రూ.15 వేలు

Good News : ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం సూపర్ సిక్స్ పేరిట హామీలు ఇచ్చింది. ఈ సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, నెలకు రూ.1500, ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు వంటి గ్యారంటీలని ఒక్కొక్క‌టిగా అమ‌లు చేస్తూ పోతుంది. అయితే బడికి వెళ్లే విద్యార్థులకు ఏడాదికి రూ.15000 చొప్పున అందిస్తామంటూ తల్లికి వందనం పేరిట మరో హామీ ఇచ్చింది టీడీపీ కూటమి. ఇంట్లో చదువుకునే పిల్లలు ఎంత మంది ఉంటే వారందరికీ ఏడాదికి 15 వేలు చొప్పున ఇస్తామని చంద్రబాబు సైతం హామీ ఇచ్చారు అయితే టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి వంద రోజులు గడుస్తున్నా సూపర్ సిక్స్ హామీలను ఎందుకు అమలు చేయడం లేదంటూ వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవల ప్రశ్నించారు.

Good News ఏపీ విద్యార్థులకి తీపి క‌బురుఈ డాక్యుమెంట్స్ ఉంటే ఒక్కొక్క‌రికి రూ15 వేలు

Good News : ఏపీ విద్యార్థులకి తీపి క‌బురు..ఈ డాక్యుమెంట్స్ ఉంటే ఒక్కొక్క‌రికి రూ.15 వేలు

Good News పిల్ల‌ల‌కి గుడ్ న్యూస్..

అయితే గ‌త నెల‌లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తల్లి కి వందనం పథకం 2024 ను ప్రారంభించింది, ఇది ఆర్థికంగా బలహీన కుటుంబాలకు విద్యా సహాయం అందించడానికి లక్ష్యంగా ఉన్న ముఖ్యమైన కార్యక్రమం. ఈ ప్రోగ్రామ్ ద్వారా విద్యార్థులు తమ చదువును ఆర్థిక ఇబ్బందుల లేకుండా కొనసాగించవచ్చు. 1 నుంచి 12 తరగతుల్లో చదువుతున్న విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని, నిరంతర పాఠశాల హాజరును ప్రోత్సహించడానికి ప్రయత్నిస్తుంది. , ఎంపిక చేసిన విద్యార్థులకు 15,000 రూపాయల ఆర్థిక సహాయం నేరుగా వారి బ్యాంకు ఖాతాలకు జమ చేయబడుతుంది. ఈ నిధులు పాఠశాల ఫీజులు మరియు ఇతర విద్యా ఖర్చులను భరించడానికి సహాయపడటమే కాకుండా, కుటుంబాలు తమ పిల్లల విద్యపై పెట్టుబడి చేయడానికి అవకాశం ఇస్తాయి.

ఈ ప‌థ‌కం పొందాలంటే విద్యార్థులు ప్రభుత్వ లేదా ఎయిడెడ్ పాఠశాలల్లో చదవాలి . విద్యార్థులు ప్రయోజనాలను పొందేందుకు 75% హాజరు తప్పనిసరి. ఇక విద్యార్థుల‌కి కిట్‌లు అందించబడతాయి, వీటిలో బ్యాగ్, పాఠ్యపుస్తకాలు, నోట్‌బుక్‌లు మరియు వర్క్‌బుక్‌లుఉన్నాయి. ఆంగ్ల నిఘంటువు, మూడు జతల యూనిఫారాలు, బెల్ట్, బూట్లు మరియు సాక్స్ కూడా ఉంటుంది. పథకం నుండి ప్రయోజనం పొందేందుకు ఆధార్ అవసరం. అది లేని యెడ‌ల ఓటరు గుర్తింపు కార్డు, రేషన్ కార్డు, పాస్ పోర్ట్‌, బ్యాంక్ లేదా పోస్టల్ పాస్‌బుక్, డ్రైవింగ్ లైసెన్స్, ఉపాధి పథకం కార్డు, రైతు పాస్ బుక్, గెజిటెడ్ అధికారి నుండి సంతకం పత్రం, తహసీల్దార్ జారీ చేసిన పత్రం ఉన్న స‌రిపోతుంది.

Tags :

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది