అతికిరాతకంగా టమాట రైతు హత్య… నోట్లో గుడ్డలు..!! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

అతికిరాతకంగా టమాట రైతు హత్య… నోట్లో గుడ్డలు..!!

దేశవ్యాప్తంగా టమాట ధర ఆకాశాన్ని అంటిన్న సంగతి తెలిసిందే. దాదాపు కేజీ 150 రూపాయలు పలుకుతూ ఉండటంతో.. ప్రజలు టమాటో కొనటానికి భయపడే పరిస్థితి నెలకొంది. ఒక్కసారిగా టమాట ధరలు పెరగటంతో మధ్యతరగతి మరియు పేద ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారు. దీంతో దేశవ్యాప్తంగా టమాట డిమాండ్ పెరగడంతో కొన్నిచోట్ల అక్రమ రవాణా జరుగుతూ ఉంది. టమాటా వ్యానులను కూడా మాయం చేస్తున్నారు. ఇదిలా ఉంటే తిరుపతిలో ఏకంగా టమాట రైతుని నోట్లో గుడ్డలు కుక్కి అతి […]

 Authored By sekhar | The Telugu News | Updated on :14 July 2023,8:21 pm

దేశవ్యాప్తంగా టమాట ధర ఆకాశాన్ని అంటిన్న సంగతి తెలిసిందే. దాదాపు కేజీ 150 రూపాయలు పలుకుతూ ఉండటంతో.. ప్రజలు టమాటో కొనటానికి భయపడే పరిస్థితి నెలకొంది. ఒక్కసారిగా టమాట ధరలు పెరగటంతో మధ్యతరగతి మరియు పేద ప్రజలు అనేక అవస్థలు పడుతున్నారు. దీంతో దేశవ్యాప్తంగా టమాట డిమాండ్ పెరగడంతో కొన్నిచోట్ల అక్రమ రవాణా జరుగుతూ ఉంది. టమాటా వ్యానులను కూడా మాయం చేస్తున్నారు. ఇదిలా ఉంటే తిరుపతిలో ఏకంగా టమాట రైతుని నోట్లో గుడ్డలు కుక్కి అతి కిరాతకంగా చంపడం జరిగింది.

అది కూడా తన పంటను అమ్మిన కొద్ది గంటల్లోనే ఆ టమాటా రైతు హత్య చేయబడటం సంచలనంగా మారింది. తిరుపతి జిల్లాకి నార్రేం రాజశేఖర్ రెడ్డి టమాట వ్యాపారం చేస్తూ ఉంటాడు. కాగా మంగళవారం పంట చేతికి రావటంతో పెద్ద ఎత్తున ఆ పంటను మదనపల్లి మార్కెట్ లో విక్రయించడం జరిగింది. టమాటా కి డిమాండ్ బాగా ఉండటంతో రేటు బాగా పలకడంతో డబ్బులు కూడా బాగా వచ్చాయి. దీంతో ఆ డబ్బులు తీసుకుని నార్రేం రాజశేఖర్ రెడ్డి ఇంటికి రావడం జరిగింది.

tomato farmers murder in tirupati district

tomato farmers murder in tirupati district

ఆ తర్వాత బుధవారం రాజశేఖర్ రెడ్డి చెట్ల మధ్య శవమై కనిపించాడు. ఎవరో అతన్ని చాలా దారుణంగా అతికరాతకంగా హత్య చేశారు. అయితే ఈ హత్య రైతు దగ్గర డబ్బులు దోచుకునేందుకే జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. రాజశేఖర్ మెడకు టవల్ తో బిగించి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

sekhar

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది