YS Jagan Master paln : ప్రతి బూత్ లో 60 శాతం ఓట్లు….పార్టీ నేతలకు వై.యస్ జగన్ దిశా నిర్దేశం…

Advertisement
Published by
Advertisement

YS Jagan Master paln : ఆంధ్ర రాష్ట్రంలోని ఎలక్షన్స్ సమీపిస్తున్న వేళ చంద్రబాబు కానీ జగన్మోహన్ రెడ్డి కానీ తమదైన శైలిలో చాలా స్ట్రాంగ్ గా ముందుకు వెళ్లాలని తమ క్యాడర్ ను సిద్ధం చేసుకుంటూ వస్తున్నారు. ఒకవైపు సిద్ధం సభల ద్వారా జగన్ మోహన్ రెడ్డి ప్రజలలోకి వెళ్తుంటే “రా కదలిరా” అనే నినాదంతో మరోవైపు చంద్రబాబు నాయుడు తన క్యాడర్ ను యాక్టివ్ చేసుకుంటూ వస్తున్నారు. ఇక ఇప్పుడు కొత్తగా తమ క్యాడర్ ను యాక్టివ్ చేసుకునేందుకు జగన్ మోహన్ రెడ్డి ముందడుగు వేశారని చెప్పాలి. ఈ క్రమంలోనే చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ కూడా వారి యొక్క క్యాడర్లను సిద్ధం చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వారు ఇటీవలే వారి పార్టీ యొక్క అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు కాబట్టి వారి క్యాడర్ ను ఎలా సమయుక్తం చేసుకుంటారనేది చర్చించదగ్గ విషయం. దానికంటే ముందు అసంతృప్తులను బుజ్జగించిన తర్వాత తర్వాత బాబు తన క్యాడర్ ను సిద్ధం చేసుకోవడం మనం చూడబోయే అంశం.

Advertisement

అయితే తాజాగా జగన్ మోహన్ రెడ్డి 60 శాతం ఓట్లు ప్రతి పోలింగ్ బూత్ లో కూడా వైసీపీ పార్టీకి పడాలంటే ఏం చేయాలి అనేటువంటి టాప్ సీక్రెట్ ని వారి యొక్క అధినాయకత్వంతో అలాగే వారి పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలతో, అలాగే పోలింగ్ బూత్ లో ఉండేటువంటి కార్యకర్తలతో సంభాషణలు జరిపినట్లుగా తెలుస్తోంది. మరి ఈ విషయాలు గురించి పూర్తిగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

Advertisement

ఇక పూర్తి వివరాల్లోకి వెళితే….జగన్మోహన్ రెడ్డి తాజాగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి దాదాపు 3,000 మంది కీలక నేతలతో మరో సిద్ధం మీటింగ్ నిర్వహించినట్లు సమాచారం. ఇక దీనిలో వచ్చే ఎన్నికల్లో తిరిగి ఎలా గెలవాలి అనే అంశాల గురించి వారందరికీ దిశా నిర్దేశం చేసినట్లు తెలుస్తోంది.ఆంధ్ర రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో 175 అసెంబ్లీ సీట్లకు 175 , అలాగే 25 ఎంపీ సీట్లకు 25 రావాలి అనే అంశంపై మరోసారి ప్రధానంగా చర్చలు జరిపినట్లు తెలుస్తోంది. ఇక దీనికోసం చేయాల్సినటువంటి పనులేంటో కూడా వారికి స్పష్టంగా తెలియజేసినట్లు సమాచారం. అలాగే పార్టీ నేతలు అందరూ కూడా ఓటర్లకు ప్రతి నిమిషం అందుబాటులో ఉండాలనిజగన్ సూచించారట.. మరి ముఖ్యంగా పోలింగ్ బూత్ ప్లాన్ పై దృష్టి పెట్టాలని తెలియజేశారట. అంతేకాక రాబోయే 45 రోజులు చాలా కీలకమని వారందరికీ తెలియజేశారు. అదేవిధంగా రాష్ట్రంలో క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందో పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి తాము అన్ని పర్యవేక్షిస్తున్నట్లు జగన్ చెప్పుకొచ్చారు. మేము సిద్ధం మా బూత్ సిద్ధం అనుకుంటూ అందరూ దీనిపై దృష్టి పెట్టాలని తెలియజేశారు. వచ్చే ఎన్నికల్లో ప్రతి ఎన్నికల బూత్ లో కూడా 60% కంటే ఎక్కువ ఓట్లు వచ్చే లక్ష్యంగా పనిచేయాలని నేతలకు జగన్ సూచించినట్లు తెలుస్తోంది.

దీనికోసం అవసరమైనటువంటి అన్ని తీసుకోవాల్సిందిగా, పార్టీ నుంచి కూడా వారికి సహాయ సహకారాలు కూడా అందుతాయని తెలియజేశారు. అదేవిధంగా చంద్రబాబు లాగా తాము హామీ ఇచ్చి ఎప్పుడు విస్మరించలేదని, హామీలను ఇచ్చి వాటిని కచ్చితంగా అమలు చేశామని జగన్ నేతలకు సూచించారు. ఇక ఇప్పుడు ఇదే అంశాన్ని ప్రతి ఇంటికి వెళ్లి చెప్పాల్సిందిగా నేతలకు సూచించారు. ఇక ఈ ఎన్నికలు కులపోరు కాదని వర్గ పోరని గుర్తు చేశారు. జగన్ ప్రభుత్వం ఉంటేనే సంక్షేమ పథకాలు కొనసాగుతాయా అనే విషయాన్ని ప్రతి ఇంటింటికి చెప్పాలని తెలియజేశారు. వైసీపీ పార్టీకి ఓటు వేయకపోతే సంక్షేమం సన్నగిల్లుతుందని హెచ్చరించమని తెలియజేశారు. ప్రతి గ్రామ వార్డు సచివాలయాన్ని యూనిట్ గా తీసుకొని ఒక విశ్లేషణీయమైన వ్యక్తిని ఎంచుకోవాలని అన్నారు . అలాగే ఎల్లప్పుడూ జనాలకు అందుబాటులో ఉండాలని అర్ధరాత్రి ఫోన్ చేసినా కూడా సమాధానం చెప్పాలని తెలియజేసినట్లు సమాచారం. నేనేం చేయగలనో అంతవరకు చేశా ఇక ఇప్పుడు చేయాల్సిందంతా మీ చేతుల్లోనే ఉందంటూ నేతలకు జగన్ తెలియజేసినట్లుగా సమాచారం. ఈ విధంగా వచ్చే ఎన్నికల్లో జగన్ తన క్యాడర్ ను బలంగా సిద్ధం చేసుకుంటూ వస్తున్నారు.

Advertisement

Recent Posts

Bottle Gourd Juice : సొరకాయ జ్యూస్‌తో నిజంగానే పొట్ట కొవ్వు తగ్గుతుందా..? నిపుణులు చెప్పిన నిజాలు ఇవే!

Bottle Gourd Juice : ప్రస్తుతం బరువు తగ్గడం, ముఖ్యంగా పొట్ట చుట్టూ పేరుకుపోయే కొవ్వును తగ్గించుకోవడం కోసం చాలామంది…

1 day ago

Petrol : భారత్‌లో అత్యధికంగా పెట్రోల్ వాడేది ఏ రాష్ట్రం..? షాకింగ్ గణాంకాలు వైరల్!

Petrol  : భారత్‌లో పెట్రోల్ వినియోగంపై తాజాగా వెలువడిన గణాంకాలు ఆసక్తికర చర్చకు దారితీశాయి. దేశంలో ఒక్కో వ్యక్తి ప్రాతిపదికన…

3 days ago

PM Modi : ఖర్చు ఆపమని కాదు.. తెలివిగా ఖర్చు చేయమన్న మోదీ.. కేంద్రం క్లారిటీ!

PM Modi : ప్రధానమంత్రి Narendra Modi ఇటీవల చేసిన “స్మార్ట్ స్పెండింగ్” పిలుపు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారం…

3 days ago

Farmers Good News : రైతులకు గుడ్ న్యూస్.. కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం.. !

Farmers Good News : కేంద్ర ప్రభుత్వం రైతులు మరియు మౌలిక సదుపాయాల అభివృద్ధిపై కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా…

3 days ago

Donald Trump : చైనాలో ట్రంప్ కి అవ‌మానం.. ప్రపంచ రాజకీయాల్లో కొత్త చర్చ!

Donald Trump : అమెరికా మాజీ అధ్యక్షుడు Donald Trump చైనా పర్యటనకు సంబంధించిన వార్తలు ప్రస్తుతం అంతర్జాతీయ రాజకీయాల్లో…

3 days ago

Heart Health : హార్ట్ స్ట్రాంగ్‌గా ఉండాలంటే ఇవి చేయండి.. గుండె ఆరోగ్యానికి సింపుల్ ఫిట్‌నెస్ టిప్స్!

Heart Health : ప్రస్తుతం గుండె జబ్బులు ప్రపంచవ్యాప్తంగా ప్రధాన ఆరోగ్య సమస్యగా మారుతున్నాయి. వయస్సుతో సంబంధం లేకుండా యువతలో…

3 days ago

Working Hours : ఎక్కువసేపు కూర్చునే పని చేస్తున్నారా..? అయితే మీరు డేంజ‌ర్‌లో ప‌డ్డ‌ట్టే..?

Working Hours : ప్రస్తుతం చాలా మంది ఉద్యోగులు రోజుకు 8 నుంచి 12 గంటల వరకు కంప్యూటర్ ముందు…

3 days ago

AP Rajya Sabha : ఏపీ రాజ్యసభ రేసులో కొత్త ట్విస్ట్.. టీడీపీ-జనసేన అభ్యర్థులపై కీలక నిర్ణయం!

AP Rajya Sabha : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మరోసారి రాజ్యసభ ఎన్నికల హడావిడి మొదలైంది. రాష్ట్రంలో ఖాళీ కానున్న రాజ్యసభ…

3 days ago

Anushka Shetty : ఫస్ట్ లవ్‌పై మనసు విప్పిన అనుష్క.. అత‌ని గురించి చెప్పిన మాటలు వైరల్

Anushka Shetty : దక్షిణాది సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్‌గా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న Anushka Shetty మరోసారి వార్తల్లో…

3 days ago

Vijay and Trisha Marriage : ఫ్యామిలీ గ్రీన్ సిగ్నల్.. విజయ్-త్రిష పెళ్లి గాసిప్స్‌కు ఫుల్ స్టాప్ పడిందా..?

Vijay and Trisha Marriage  : తమిళ సినీ పరిశ్రమలో గత కొన్ని నెలలుగా హీరో Vijay, హీరోయిన్ Trisha…

3 days ago

Hair : జుట్టు పెరగడం లేదా..? రోజూ ఈ జ్యూసులు తాగితే అద్భుత ఫలితాలు!

Hair  : జుట్టు రాలిపోవడం ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న ప్రధాన సమస్యల్లో ఒకటి. ఒత్తిడి, కాలుష్యం, పోషకాహార లోపం, హార్మోన్ల…

4 days ago

Rice Water : హెయిర్ గ్రోత్‌కు బియ్యం నీటితో అద్భుత ప్రయోజనాలు.. మీరు ట్రై చేండి..!

Rice Water : ఇటీవల కాలంలో జుట్టు సంరక్షణ కోసం సహజ పద్ధతులపై ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా బియ్యం నీటిని…

4 days ago