Ys Jagan : మనం ఓడిపోవడానికి కారణం అదే… వైఎస్ జ‌గ‌న్‌.. వీడియో !

 Authored By ramu | The Telugu News | Updated on :25 June 2025,8:40 pm

ప్రధానాంశాలు:

  •  చంద్రబాబు మోసపూరిత హామీలే వైసీపీ ఓటమికి కారణాలు - జగన్

  •  వైసీపీ ఓటమికి అసలు కారణాలు ఇవే అంటూ తేల్చి చెప్పిన జగన్

Ys Jagan : అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓటమికి ప్రధాన కారణాలు ఇవే అని పలు వాటిని ప్రస్తావించారు జగన్. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు అయ్యి ఒక సంవత్సరం పూర్తయ్యింది. అయితే ఈ క్రమంలోనే చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందని జగన్ ఆరోపించారు. ఈ తక్కువ సమయంలోనే ఈ స్థాయిలో ప్రజా వ్యతిరేకత గతంలో ఏ ప్రభుత్వానికి ఎదురుకాలేదని విమర్శిస్తున్నారు. అధికారంలోకి వచ్చాక ప్రజలకు మంచి చేయాల్సిన బదులు, దారి తప్పించే ప్రయత్నాలు చేస్తున్నారని, ‘రెడ్ బుక్’ పాలన పేరుతో రాజకీయ విభజన, ప్రతీకారాలు, అణచివేత రాజ్యం కొనసాగుతోందని తెలిపారు.

Ys Jagan : మనం ఓడిపోవడానికి కారణం అదే... వైఎస్ జ‌గ‌న్‌.. వీడియో !

Ys Jagan : మనం ఓడిపోవడానికి కారణం అదే… వైఎస్ జ‌గ‌న్‌.. వీడియో !

Ys Jagan : వైసీపీ ఓటమికి ప్రధాన కారణాలు ఇవే అంటూ అసలు నిజాలు తెలిపిన జగన్

ఎన్నికల ముందు చంద్రబాబు ఇంటింటికీ నాయకులను పంపి, ఓటర్లకు హామీలతో కూడిన బాండ్లు ఇచ్చి ప్రజలను నమ్మించారు. తాను అధికారంలోకి వచ్చాక తాను చేసిన బాండ్లలో పేర్కొన్న ప్రతి పథకాన్ని అమలు చేస్తానని ప్రమాణం చేశారు. అయితే ఏడాది పూర్తైనా ఈ హామీలలో ఒక్కదాన్ని కూడా అమలు చేయకపోవడం ప్రజలను తీవ్రంగా నిరాశపరిచిందని జగన్ ఆరోపించారు. తల్లికి వందనం, ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి వంటి పథకాలను బాండ్లలో చూపించి ఇప్పటికీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని విమర్శించారు.

విద్య, వైద్యం, వ్యవసాయం రంగాల్లో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఆరోగ్యశ్రీ, వసతి దీవెన, చెయూత, నేతన్న నేస్తం వంటి పథకాలపై వేల కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. వ్యవసాయ రంగం పూర్తిగా తిరోగమనంలోకి వెళ్లిందని, పంటలకు గిట్టుబాటు ధరలు లేవని, ఉచిత బీమా, ఇన్‌పుట్‌ సబ్సిడీలు కూడా ఇవ్వడంలేదని అన్నారు. ప్రజలు ఇప్పుడు తమకు ఇవ్వాల్సిన హామీలను గుర్తు చేస్తూ చంద్రబాబును ప్రశ్నించాలని, బాధ్యత వహించేలా ఒత్తిడి తేవాలని పిలుపునిచ్చారు.

Advertisement

ramu

Author Bio Info : Ramu ( Tandu Ramalingaiah ) is experienced in Media field. He worked in various Telugu media houses for about 15 years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Chief Editor of thetelugunews.com website. Contact Details : thetelugunews1@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి