Ys Jagan : వ్యూహం మార్చుకుంటున్న జగన్..!
ప్రధానాంశాలు:
Ys Jagan : వ్యూహం మార్చుకుంటున్న జగన్..!
Ys Jagan : సార్వత్రిక ఎన్నికల్లో ఘోర పరాజయం ఎదుర్కొన్న వైసీపీ, ఈ దెబ్బ నుంచి కోలుకునే ప్రయత్నాలు ముమ్మరం చేసింది. రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయిన తర్వాత, పార్టీని మళ్లీ బలోపేతం చేయడానికి నాయకత్వం ప్రణాళికాబద్ధంగా పనిచేస్తోంది. ముఖ్యంగా బూత్ స్థాయి నుంచి పార్టీని తిరిగి బలోపేతం చేయడానికి వైఎస్ జగన్ మొగ్గు చూపుతున్నారు. ఈ దిశగా కార్యకర్తలను సమీకరించడానికి, క్షేత్రస్థాయిలో మరింత శక్తివంతమైన నాయకత్వాన్ని నిలబెట్టడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నారు. తెలుగుదేశం-జనసేన-బీజేపీ కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై నిరసనలు తెలపడానికి సైతం వైసీపీ సిద్ధమవుతోంది.

Ys Jagan : వ్యూహం మార్చుకుంటున్న జగన్..!
Ys Jagan పోరాటానికి సిద్ధం అవుతున్న జగన్
ప్రస్తుత కూటమి ప్రభుత్వం తమ హామీలను నెరవేర్చడంలో విఫలమైందని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వైఎస్సార్ కాంగ్రెస్ వ్యూహాత్మకంగా ముందుకు వెళుతోంది. ముఖ్యంగా విద్యుత్ ఛార్జీల పెంపు, ధాన్యం సేకరణలో జాప్యం, కనీస మద్దతు ధర సమస్యలు, ఫీజు రీయింబర్స్మెంట్ విడుదలలో జాప్యం, ఆరోగ్యశ్రీ అమలులో వచ్చిన ఇబ్బందులను హైలైట్ చేస్తూ ఆందోళనలు చేపట్టేందుకు సిద్ధమవుతోంది. ప్రభుత్వం దాదాపు అన్ని రంగాల్లో విఫలమైందని నిరూపించడానికి గ్రౌండ్ లెవెల్ నుంచి ఉద్యమాలు నిర్వహించేందుకు పార్టీ సన్నద్ధమవుతోంది.
పార్టీ పునర్నిర్మాణంతో పాటు, ప్రజల సమస్యలు నేరుగా విని, వాటిని పరిష్కరించేందుకు వైఎస్ జగన్ ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. ఇంతకుముందు తన స్వస్థలమైన పులివెందులలో మాత్రమే నిర్వహించిన ప్రజా దర్బార్ను, ఇప్పుడు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి విస్తరించారు. ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల ప్రజలను కలుసుకుని, వారి సమస్యలను స్వయంగా తెలుసుకోవాలని జగన్ భావిస్తున్నారు. ముఖ్యంగా కూటమి ప్రభుత్వంపై ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి, ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. దీంతో వైసీపీ కొత్త దిశగా పునర్నిర్మాణం జరుపుకుంటోంది.