Caste History : మాదిగల చరిత్ర తెలిస్తే చేతులెత్తి దండం పెట్టాల్సిందే… క్షత్రియ వంశస్థులు…! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Caste History : మాదిగల చరిత్ర తెలిస్తే చేతులెత్తి దండం పెట్టాల్సిందే… క్షత్రియ వంశస్థులు…!

Caste History : ప్రస్తుత కాలంలో హిందూ సమాజం అనేది వివిధ కులాలుగా విచ్ఛిన్నం అయిపోతుంది. అగ్రవర్ణ అట్టడుగు కులాల మధ్య నిత్యం ఏదో ఒక గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మతపరమైన కొందరు కాంట్రాక్టర్లు రాజకీయ నాయకులు కొందరు మతాల పేరుతో హిందువులను విడదీసే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో 2 కోట్ల కంటే ఎక్కువమంది దళిత కుటుంబాలకు చెందిన వారు ఉన్నట్లుగా తెలిసింది. ఇక ఈ దళిత […]

 Authored By ramu | The Telugu News | Updated on :11 April 2024,10:00 am

ప్రధానాంశాలు:

  •  Caste History : మాదిగల చరిత్ర తెలిస్తే చేతులెత్తి దండం పెట్టాల్సిందే... క్షత్రియ వంశస్థులు...!

Caste History : ప్రస్తుత కాలంలో హిందూ సమాజం అనేది వివిధ కులాలుగా విచ్ఛిన్నం అయిపోతుంది. అగ్రవర్ణ అట్టడుగు కులాల మధ్య నిత్యం ఏదో ఒక గొడవలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే మతపరమైన కొందరు కాంట్రాక్టర్లు రాజకీయ నాయకులు కొందరు మతాల పేరుతో హిందువులను విడదీసే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో 2 కోట్ల కంటే ఎక్కువమంది దళిత కుటుంబాలకు చెందిన వారు ఉన్నట్లుగా తెలిసింది. ఇక ఈ దళిత వర్గాలలో ప్రధాన వర్గం మాదిగ అని చెప్పాలి. వీరిలో చెప్పులు కుట్టుకునే వారు కూడా ఉన్నారు. అయితే ప్రస్తుత కాలంలో చాలామంది మాదిగ అనే పదాన్ని బూతు పదం గా వాడుతున్నారు. అయితే వాస్తవానికి చెప్పులు కుట్టేవారు క్షత్రియ కులానికి చెందినవారు. వీరి చరిత్ర చాలా విస్తృతమైంది. విదేశీయులను ఎదుర్కోవడంలో భారతదేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో వీరి పాత్ర చాలా ముఖ్యమైనదని చెప్పాలి. అయితే పురాతన కాలంలో మాదిగ కుల వర్ణన గురించి ఎక్కడ లేదు అని తెలిస్తే ఆశ్చర్య పోవాల్సిందే. మరి ఈ మాదిగల చరిత్ర ఎలా మొదలైంది…?చెప్పులు కుట్టే కులం ఎలా వచ్చింది..?ఇలా ఎన్నో రకాలుగా ప్రశ్నలు తలెత్తుతాయి. మరి దీని గురించి ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం….

అయితే ప్రస్తుత కాలంలో డాక్టర్లు లాయర్లు పోలీసులు ఈ విధంగా వివిధ రకాల వర్గాలకు చెందిన వారు ఉన్నట్లుగానే ఆ కాలంలో ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసేవారు. ఇక ఆ రోజుల్లో వారి పని ఆధారంగానే వారికి గుర్తింపు ఉండేది. అయితే మనం చాలా సార్లు బ్రాహ్మణులు ,క్షత్రియులు ,వైశ్యులు అని వినే ఉంటాం. ఈ పేర్లన్నీ కూడా వారి వారి వృత్తిరీత్యా పెట్టిన పేర్లే. అయితే పురాణాల్లో మాదిగ చరిత్ర గురించి ఎక్కడ కనిపించదు కానీ మాదిగ అనే పదాన్ని మొదటిసారిగా 16వ శతాబ్దంలో టర్కిష్ అక్రమదారులు భారతదేశాన్ని ఆక్రమించిన సమయంలో సికిందర్ లోడి అనే రాజు ఈ పదాన్ని ఉపయోగించడం జరిగింది.

Caste History : రవిదాస్ మాదిగ జాతికి చెందిన వాడు…

రవిదాస్ కూడా మాదిగ జాతికి చెందిన వాడే. అయితే చిత్తూరు రాజు రానా సంగ్ , అతని భార్య చాలి రాణి రవిదాస్ గురుజిని ఎంతో గౌరవించేవారు. వీరిద్దరూ కలిసి రవిదాస్ ను చిత్తూర్ కి రమ్మని అక్కడే రాజు గురువుగా ఉండమని కోరారు. రవి దాస్ రాజు కోరిన మేరకు చిత్తూర్ రాజభవన్ లో ఉండటం మొదలుపెట్టారు. ఇక ఇదే సమయంలో రవిదాస్ ఉపన్యాసాలు ప్రజలను ఎంతగానో ప్రభావితం చేసేవి. మరోవైపు ఢిల్లీలో సికిందర్ లోడి పాలన సాగుతోంది. ఈ క్రమంలోనే రవిదాస్ గురూజీ గురించి సికిందర్ కు సమాచారం రావడంతో ప్రజలు రవిదాస్ చెప్తున్నా బోధనలు విని ఇస్లాంకు బదులుగా హిందూమతానికి ఆకర్షితులవుతున్నారని భయపడిపోయేవారు. ఆ సమయంలో అలెగ్జాండర్ కూడా అలాగే భయపడ్డాడు. దీంతో రవిదాస్ ను ఇస్లాం మాత్రం స్వీకరించేలా వారంతా ప్రయత్నాలు చేశారు. అయినా రవిదాస్ దానికి ఒప్పుకోలేదు. ఈ నేపథ్యంలోనే సికిందర్ సధ్నా అనే ఓ వ్యక్తిని రవిదాస్ వద్దకు పంపించి ఇస్లాం మతం స్వీకరించేలా ప్రేరేపించారు. దానికి నిరాకరించిన రవిదాస్ ఒక పోటీ నిర్వహించి దానిలో నువ్వు గెలిస్తే ముస్లిం మారతాన్ని స్వీకరిస్తా… నేను గెలిస్తే నువ్వు హిందూ మతాన్ని స్వీకరించాలంటూ షరతు పెట్టాడు. ఇక వారిద్దరికీ జరిగిన పోటీలో రవిదాసు గెలవడంతో సధ్నా కూడా హిందూ మతాన్ని స్వీకరిస్తాడు. అలా సధ్నా కాస్త రామదాసుగా పేరు మార్చుకున్నాడు. ఆ విధంగా రామదాసు మరియు రవిదాస్ కలిసి ప్రచారం చేయడం మొదలుపెట్టారు.

Caste History మాదిగల చరిత్ర తెలిస్తే చేతులెత్తి దండం పెట్టాల్సిందే క్షత్రియ వంశస్థులు

Caste History : మాదిగల చరిత్ర తెలిస్తే చేతులెత్తి దండం పెట్టాల్సిందే… క్షత్రియ వంశస్థులు…!

Caste History రామదాసుగా మారిన సధ్నా….

అయితే సద్న హిందూ మతాన్ని స్వీకరించడం తెలుసుకున్న సికిందర్ కోపం తెచ్చుకొని రవి దాస్ ను జైల్లో ఉంచాడు.ఇక ఆ జైల్లో రవిదాస్ కు తోలు ఇప్పించి చెప్పులు కుట్టే పనిని అప్పగించారు. అనంతరం హిందువులుగా ఉన్న చాలా మందిని ఇస్లాం మతం మార్చే ప్రయత్నాలు చేశారు. ఒప్పుకొని వారిని చెరసాలలో బంధించి వారితో చెప్పులు కొట్టించడం మొదలుపెట్టారు. ఆ విధంగా చెప్పులు కుట్టే వృత్తి మొదలైంది. ఆ విధంగా చెరసాలలో బంధించి చెప్పులు కుట్టే వారిని మాదిగ అనే పేరుతో పిలుస్తూ అవమానించడం మొదలుపెట్టారు. అలా అవమానిస్తే అయిన వాళ్ళు మతం మారతారని అనుకున్నారు. అయినా కూడా వారు మాత్రం ఇస్లాం మతాన్ని స్వీకరించలేదు. ఇక అప్పటినుండే ఈ కులవృత్తి అనేది మొదలైంది. అంతేకాక ఈ కులానికి చెందిన వారికి చదువు కూడా చెప్పకూడదంటూ రాజు సికిందర్ లోడి ఆదేశాలు ఇవ్వడంతో వారి చరిత్ర అనేది ఎక్కడా రికార్డు అవ్వలేదు. కాబట్టి వారి గురించి ఈ తరం వారికి అసలు ఏమీ తెలియదు. ఈ విధంగా తోలు పనిచేయడం వలన క్షత్రియ సమాజం నుంచి వీరు బలవంతంగా బయటకు రావాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈ విధంగా వారిని తక్కువ కులం వారిగా రాజు సికిందర్ లోడి ముద్ర వేశాడు. అప్పటినుండే వీరి చరిత్ర కొనసాగుతూ వస్తుంది.

Also read

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది