Dussehra : దసరా రోజు ఈ చర్యలు పాటిస్తే మీరు అనుకున్నది సాధిస్తారు…!

Authored By Ramu Tandu Ramalingaiah | The Telugu News | Updated on : 12 October 2024, 4:00 pm
  •  Dussehra : దసరా రోజు ఈ చర్యలు పాటిస్తే మీరు అనుకున్నది సాధిస్తారు...!

Dussehra : హిందూమతంలో విజయదశమి పండగను ప్రతీ ఏడాది అశ్వయుజ మాసం శుక్లపక్షం దశమి రోజున వైభవంగా జరుపుకుంటారు. అయితే ఈ ఏడాది దశమి అక్టోబర్ 12వ తేదీ ఉదయం 10: 59 గంటలకు ప్రారంభమయ్యే మరుసటి రోజు అక్టోబర్ 13 ఉదయం 09:08 నిమిషాలకు ముగుస్తుంది. అయితే ఈ రోజున దుర్గాదేవికి రాముడికి అంకితం చేయబడింది. ఈ రోజున వారిని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. అయితే పురాణాల ప్రకారం శ్రీరాముడు లంక రాజు దశకంఠుడు రావణుడిని ఈ రోజున సంహరించాడు. కనుక ప్రతి ఏడాది ఈ రోజున దసరా పండుగ జరుపుకుంటారు. అంతేకాకుండా దసరా పండుగ రోజు దానం చేసే సాంప్రదాయం కూడా ఉంటుంది.

Dussehra : దసరా రోజున ఈ ఆరు చర్యలు చేయండి

-దసరా రోజు వ్యాధుల నుంచి ఉపశమనం పొందడం కోసం సుందరకాండ పారాయణాన్ని పాటించండి. అలాగే చేతిలో కొబ్బరికాయను పట్టుకుని హనుమాన్ చాలీసాలోని ” నాసై రోగ్ హరే సబ్ పీడా..జపత్ నిరంతర్ హనుమంత్ బీరా ” అనే ద్విపదను చదివి రోగి తలపై ఏడుసార్లు తిప్పండి. తరువాత ఆ కొబ్బరికాయను రావణ దహనంలో వేయండి. ఇలా చేయడం వలన అనేక రకాల వ్యాధులు దూరమవుతాయి.

– వ్యాపారంలో పురోగతి పొందడం కోసం విజయదశమి రోజున కొబ్బరికాయ మిఠాయిలు మరియు పసుపు వస్త్రాలతో పవిత్రధారాన్ని బ్రాహ్మణుడికిి దానంగా ఇవ్వండి. దీనివల్ల జీవితంలో ఆర్థిక ప్రయోజనాలు పొందుతారు. అలాగే వ్యాపారంలో పురోగతినీ పొందుతారు.

– చాలామందికి జాతకంలో శనీశ్వరుడి ఏలినాటి శని ఉన్నవారు దసరా రోజు జమ్మి చెట్టు కింద 11 దీపాలలో నువ్వుల నూనె వేసి వెలిగించి ప్రార్థన చేయడం ద్వారా ఏలి నాటి శని ప్రభావాలు నుండి ఉపశమనం పొందవచ్చు.

– హిందూమతంలో దానానికి విశిష్టమైన స్థానం ఉంటుంది. కాబట్టి విజయదశమి రోజున పేదలకు మరియు బ్రాహ్మణుడికి ఆహారం బట్టలు లేదా వస్తువులను దానంగా ఇవ్వండి. దీనివల్ల ఇంట్లో ఇబ్బందులు తొలిగి పేదరికం దూరమవుతుంది.

– దసరా పండగ రోజు రావణుడి దిష్టిబొమ్మను దహనం చేయడం అనేది ముఖ్య ఘట్టం. ఈరోజు చెడుపై మంచి సాధించిన రోజు కాబట్టి ఒక ప్రదేశంలో రావణ దహనం నిర్వహించి అందులో పాల్గొనండి. దీని ద్వారా జీవితంలో చెడు అంతమవుతుంది.

Dussehra : దసరా రోజు ఈ చర్యలు పాటిస్తే మీరు అనుకున్నది సాధిస్తారు...!

Dussehra : దసరా రోజు ఈ చర్యలు పాటిస్తే మీరు అనుకున్నది సాధిస్తారు…!

– దసరా రోజున ఆలయంలో చీపురుని దానంగా ఇవ్వడం ద్వారా ఆర్థిక నష్టాల నుండి బయటపడతారు. ఈ పరిహారాన్ని సాయంత్రం పూట చేయాలి. అలాగే ఈ పరిహారం చేసే సమయంలో లక్ష్మీదేవి కచ్చితంగా ధ్యానం చెయ్యండి.

Dussehra : దసరా ప్రాముఖ్యత

దసరా పండుగ రోజు రాముడిని మరియు దుర్గాదేవిని పూజిస్తారు. అదేవిధంగా కొంతమంది కుబేరుడు మరియు లక్ష్మీదేవిని కూడా పూజిస్తారు. లక్ష్మీదేవిని మరియు కుబేరుని పూజించడం వలన ఇంట్లో డబ్బుకు లోటు ఉండదు. అలాగే ఆర్థికప్రయోజనాలు ఉంటాయి.

Advertisement

Ramu Tandu Ramalingaiah

Author Bio Info : Ramu Tandu Ramalingaiah is experienced in Media field. He worked in various Telugu media houses for about 15+ years. Iam worked as a Prajasakti Daily Newspaper , Surya Daily Newspaper , Namasthe Telangana Daily Newspaper News Reporter, Chief Editor, Digital Media Expert , Social Media Expert, Technical Expert and Digital Marketing Expert. As a News reporter, he wrote various articles on Human angle, Local news live reporting, special stories. He is also expert in news analyzing, proof editing and best title editing. He is the present Editor of thetelugunews.com | Contact Details : ramu@thetelugunews.com

Tags :
Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి