Jammi Plant | దసరా రోజున జమ్మి చెట్టు పూజకు ప్రాముఖ్యత ఏంటో మీకెవ‌రికైన తెలుసా?

Authored By Sam C | The Telugu News | Updated on : 30 September 2025, 6:00 am

Jammi Plant దసరా లేదా విజయదశమి పండుగను హిందూ ప్రజలు అత్యంత భక్తితో జరుపుకుంటారు. ఇది చెడుపై మంచి గెలిచిన రోజుగా భావిస్తారు. ఈ రోజున శ్రీరాముడు రావణుని సంహరించి ధర్మాన్ని స్థాపించాడు. అలాగే దుర్గాదేవి మహిషాసురుని వధించి భూమిని రక్షించిందని పురాణాలు చెబుతున్నాయి.దసరా రోజున పాటించే ప్రత్యేక సంప్రదాయాల్లో ఒకటి జమ్మి చెట్టును పూజించడం. ఈ చెట్టుకు భక్తులు గౌరవంతో నమస్కరిస్తారు. ఈ చెట్టుకు పురాణాల్లో, జ్యోతిషంలో, ఆధ్యాత్మికంగా చాలా ప్రాముఖ్యత ఉంది.

#image_title

పాండవులతో సంబంధం ఉన్న జమ్మి చెట్టు

మహాభారతం ప్రకారం, పాండవులు అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు తాము వాడే ఆయుధాలను జమ్మి చెట్టులో దాచారు. ఏడాది తర్వాత వారు తిరిగి వచ్చి ఆయుధాలు తీసుకున్నారు. అవి ఏ మాత్రం చెడిపోలేదు. దీంతో ఈ చెట్టును విజయానికి చిహ్నంగా పరిగణించసాగారు. అప్పటి నుంచీ దసరా రోజున జమ్మి చెట్టును, ఆయుధాలను పూజించే ఆచారం మొదలైంది.

ఈ రోజున జనం ఒకరికి ఒకరు జమ్మి ఆకులు ఇచ్చుకుంటారు. దీనిని “బంగారం పంచుకోవడం” అంటారు. జమ్మి ఆకులను లక్ష్మీదేవి అనుగ్రహానికి చిహ్నంగా చూస్తారు. ఇంట్లో పెట్టుకుంటే ధన సమృద్ధి, శాంతి, శుభఫలితాలు వస్తాయని నమ్మకం.జ్యోతిష శాస్త్రం ప్రకారం జమ్మి చెట్టు శనీశ్వరునికి ఎంతో ఇష్టమైనది. దసరా రోజున దీనిని పూజిస్తే శని దోషం తగ్గుతుందనీ, వ్యాపారంలో, ఉద్యోగంలో ఎదురయ్యే అడ్డంకులు తొలగుతాయని చెబుతారు. శత్రువులపై విజయం కలుగుతుందని విశ్వాసం.

Advertisement

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి