వంట గదిలో ఈ వస్తువులు ఉంచితే లక్ష్మీదేవి కటాక్షకం తగ్గి అనారోగ్యం కలుగుతుంది…!

 Authored By aruna | The Telugu News | Updated on :14 July 2023,9:00 am

వంట గదిలో ఈ వస్తువులు ఉంచితే లక్ష్మీదేవి కటాక్షం తగ్గి అనారోగ్యం కలుగుతుంది. లక్ష్మీదేవి యొక్క కటాక్షం కోసం మనం ఇంకేం చేయాలి.. ఈ విషయాలని సవివరంగా తెలుసుకుందాం.. ఇంటి ఇల్లాలు లక్ష్మీ స్వరూపమని పద్మ పురాణంలో పేర్కొనబడింది. వంటగది కూడా లక్ష్మీదేవి నివాస స్థలం కొన్ని తప్పులు చేస్తే లక్ష్మీ కటాక్షం అనేది తగ్గిపోతుంది. లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది తగ్గిపోతుంది. వంట గదిలో ఎట్టి పరిస్థితుల్లోనూ చీపురును ఉంచరాదు. చాలామంది ఇల్లు చిమ్మిన తర్వాత వంట గదిలో చీపురు పెడుతూ ఉంటారు. ఆరోగ్యలక్ష్మి అనుగ్రహం తగ్గిపోతూ ఉంటుంది. లేనిపోని అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. ఆల్రెడీ కొంతమందికి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి చీపురును వంట గదిలో ఉంచటం వల్ల ఇంకా ఎక్కువగా కొత్త కొత్త అనారోగ్య సమస్యల బారిన పడేటటువంటి సూచనలు ఉన్నాయి.

ఈ విషయాన్ని పరిహార శాస్త్రంలో పేర్కొన్నారు. కాబట్టి వంట గదిలో అద్దం కూడా ఎప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఏర్పాటు చేయకూడదు. ఇక అలాగే చాలామంది మహిళలు మందులను వంట గదిలో పెడుతూ ఉంటారు. మందులు మాత్రలు లాంటివి వంటగదిలో ఉంచుకొని సులభంగా వేసుకోవచ్చు అనే భావనతో పెడుతూ ఉంటారు. అయితే మందులు కానీ మాత్రలు కానీ వంటగదిలో ఏర్పాటు చేయడం వల్ల ఆరోగ్యలక్ష్మి అనుగ్రహం అనేది తగ్గిపోతుంది. అలాగే సొట్టపడిన గిన్నెలు కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ వంటగదిలో ఉండకూడదు. అలా ఉండటం వల్ల అన్నపూర్ణాదేవి యొక్క అనుగ్రహం అనేది తగ్గిపోతుంది. కాబట్టి పనికిరాని పాత్రలు ఏవి కూడా వంటగదిలో అస్సలు మనం ఉంచకూడదు.. వాటిని ఎప్పుడూ వాడకూడదు.

Goddess Lakshmi's vision will decrease and she will get sick

Goddess Lakshmi’s vision will decrease and she will get sick

వంటగదిలి దేవుడు ఉండడం వల్ల కూడా అనేక కాలైనటువంటి సమస్యలు ఎదురయ్యేటటువంటి పరిస్థితులు ఉంటాయి. అలాగే ఉప్పు అనేది ఎప్పుడూ కూడా నిండుకూడదు. ఇప్పుడు ఎప్పుడూ ఉప్పు నిండుగా ఉండాలి. అలాగే పసుపు కూడా నిండుకోకూడదు. పసుపు డబ్బాలు ఎప్పుడు పసుపు ఉంటూనే ఉండాలి. ఈ రెండు రెగ్యులర్గా అందరూ పాటించేటటువంటి విషయాలు అయితే కొన్ని విషయాలు మర్చిపోతారు. ఏంటంటే గోధుమ పిండిని మర్చిపోతారు. చాలామంది గోధుమపిండి అయిపోయింది అని అప్పటికప్పుడు తీసుకొచ్చుకుంటూ ఉంటారు. అయితే గోధుమపిండి కూడా నిండుకోకుండా జాగ్రత్త పడాలి. ఎందుకంటే గోధుమలు అంటే అవి సూర్యనారాయణ మూర్తికి ఎంతో ప్రీతిపాత్రమైనది.

ఇంట్లో ధూపం వేయడం వల్ల ఆ ఇంట్లో ధనలక్ష్మి దేవి ఆనందతాండవం చేస్తుంది. అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సిద్ధింప చేసుకోవచ్చు. చాలామందికి మనశ్శాంతి అనేది తక్కువగా ఉంటుంది. ఎప్పుడు ఇంట్లో ఏదో ఒక అశాంతి ఉంటూ ఉంటుంది. మానసిక ప్రశాంతత లేకుండా పని ఒత్తిడి వల్ల ప్రెస్ వల్ల ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాంటివారు విష్ణు సహస్రనామంలో చెప్పబడిన ఒక ప్రత్యేకమైన నామాన్ని ప్రతిరోజు స్నానం చేశాక వీలైనన్ని సార్లు చదువుకోవాలి.

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి