Categories: DevotionalNews

TTD : శ్రీవారి పాదాలకు ఇంతటి విశిష్ట ఉందా… ఈ అద్భుతం గురించి తప్పక తెలుసుకోండి…?

TTD : భారతదేశంలో ఉన్న ప్రముఖ దేవాలయాలలో ఆంధ్రప్రదేశ్ లో ఉన్న తిరుమల తిరుపతి క్షేత్రం కూడా ఒకటి. అయితే ఈ తిరుమల తిరుపతిలో కొలువుదీరిన శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు భక్తులు ప్రతిరోజు వేల సంఖ్యలో వస్తూ ఉంటారు. ఇక్కడ భక్తులు రెండు మార్గాల ద్వారా శ్రీవారి దర్శనానికి వెళుతుంటారు. దానిలో ఒకటి అలిపిరి మార్గం. ఇక ఈ అలిపిరికి మార్గం గుండా వెళ్లేటప్పుడు శ్రీవారి పాదాలను దర్శించుకోవచ్చు. మరి అలిపిరి దగ్గర శ్రీవారి పాదాలు ఎలా వచ్చాయి అనే సందేహం అందరిలోనూ ఉంది. అలిపిరి ప్రదేశంలో గల తలయేరు గుంటు దగ్గర కనిపించే పాదాలని శ్రీపాదములుగా పిలుస్తుంటారు. కొండమీద స్వామి వారి కోసం నిలిచిన మొదటి పౌరుడు తిరుమలనంబి అతను రామానుచార్యులకు రామాయణ రహస్యాలను విప్పి చెప్పింది ఇక్కడే. కొండ నుంచి నంబి గోవిందరాజ పటాల నుంచి శ్రీమద్ రామానుజులు ఈ ప్రదేశానికి చేరుకుని గోఆరాధన చేసేవారట. దీనివల్ల స్వామివారి దర్శనం పొద్దున సాయంత్రం మాత్రమే అవుతుందని బాధపడేవారు. ఇదే సమయంలో వెంకటేశ్వర స్వామి ఆయన కలలో కనిపించి నా పాదాలను అలిపిరి దగ్గర ఉంచుతాను నీవు మధ్యాహ్నం కూడా వచ్చి దర్శనం చేసుకోవచ్చని అన్నారు.

అందుకే అలిపిరిలో శ్రీవారి పాదాలు కనిపిస్తాయి. ఆ పాదాలు తిరుమల నంబి గొప్పతనం వల్లే వచ్చాయి. కాలినడక మార్గంలో వెళ్లే వారికి అలిపిరి ప్రదేశంలో కనిపించే మండపం పరాల మండపం. దీనినే పాదాల మండపం అని కూడా అంటారు.అయితే మన తెలుగువారికి శ్రావణ శనివారం అనేది చాలా ముఖ్యమైనది. అందుకే ఆ రోజున ఉపవాసం ఉండడం, పిండి తాళికలు వేయడం వంటివి సాంప్రదాయంగా వస్తున్నాయి. అలాగే కంచి ప్రాంతంలోని హరిజన ఇంటిలో పాదముద్రలు పడతాయి. ఆ పాదముద్రలని కొలత వేసి శ్రీవారికి చర్మంతో చెప్పులు కుడతారు. శ్రీకాళహస్తి నుంచి ఒకరు నుండి ఒకరు శ్రీవారి చొప్పులను నెత్తిన పెట్టుకొని ఊరేగుతూ వచ్చి అలిపిరిలో పూజ చేసి పాదాల ముద్రలను పూజా మందిరిలో పెడతారు. ఈ మండపంలోని పాదరక్షలు అరిగిపోతాయి కారణం ఏమిటి అంటే తన భక్తులు సమర్పించిన ఈ పాదరక్షలను ధరించి స్వామి వారు కొండ దిగి వస్తారట. అలివేలు మంగమ్మ దగ్గరకు వెళ్లి తిరిగి కొండెక్కే సమయంలో మరల పాదరక్షకలను ఇక్కడే వదిలి వెళ్తారని పురాణాల్లో చెప్పబడుతుంది. శ్రీవారి బంగారు పాదాలు ఎల్లప్పుడూ తులసి పుష్పాలతో నిండి ఉంటాయి.

TTD : శ్రీవారి పాదాలకు ఇంతటి విశిష్ట ఉందా… ఈ అద్భుతం గురించి తప్పక తెలుసుకోండి…?

ఉదయం పూట సుప్రభాత దర్శనంలో మాత్రమే ఎలాంటి పూలు తులసి లేకుండా శ్రీవారి బంగారు పాదాలను దర్శించుకోవచ్చు. శుక్రవారం అభిషేకానికి ముందు బంగారు పాదాల కవచాలను పక్కకు తీసి స్నాన పీఠంపై ఉంచి ఆకాశగంగ తీర్థాలతో అభిషేకం చేయిస్తారు. అభిషేక అనంతరం నిజపాద దర్శనం పేరిట భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. అది శ్రీవారి పాదాలకు ఉన్న విలువ. అందుకే శ్రీనివాసుడు తన చరములే భక్తులకు శరణులు అంటూ కుడిచేతిని పాదాల వైపు చూపి దర్శించుకోని తరించమంటారు. ఆయన తను ఉన్నాను అని గుర్తించడానికి పాదాలను విశేషంగా చూపిస్తాడు. శ్రీవారి పాదాలకు ఇంతటి విశిష్టం ఉంది.

Recent Posts

Anitha : జగన్ పరువు తీసిన హోమ్ మంత్రి.. లేని జనాల్ని చూపించటానికి బంగారుపాళ్యం విజువల్స్ వాడార‌ని విమ‌ర్శ‌లు..!

Anitha : ఆంధ్రప్రదేశ్ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పర్యటనపై…

8 hours ago

Samantha : ఒకే కారులో సమంత – రాజ్ నిడిమోరు.. డేటింగ్ రూమర్స్‌కు ఊత‌మిచ్చిన వీడియో

Samantha : టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తాజాగా మరోసారి దర్శకుడు రాజ్ నిడిమోరుతో కలిసి కనిపించడం ప్రస్తుతం సోషల్…

9 hours ago

Buddha Venkanna : వైసీపీకి వచ్చిన సీట్లు 11, లిక్కర్ స్కాంలో దొరికిన డబ్బు రూ.11 కోట్లు.. బుద్ధా వెంకన్న సెటైర్లు

Buddha Venkanna : తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు బుద్ధా వెంకన్న వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర విమర్శలు…

10 hours ago

Chamala Kiran Kumar Reddy : బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు విషయంలో ఉప ఎన్నికలు వస్తే కాంగ్రెస్ పార్టీదే విజయం.. ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి

Chamala Kiran Kumar Reddy : తెలంగాణలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు విషయంలో సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు…

11 hours ago

3 Jobs AI : ఏఐ ప్రభావం.. మూడు కీలక రంగాలకు గండం, కొత్త అవకాశాలకు మార్గం

3 Jobs AI : కృత్రిమ మేధస్సు (AI) విస్తృతంగా ప్రవేశించడంతో భారతీయ ఉద్యోగ రంగంలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయి.…

12 hours ago

Kingdom : విజ‌య్ దేవ‌ర‌కొండ సినిమాకి కేటీఆర్ కొడుకు రివ్యూ.. సినిమా చాలా న‌చ్చింది అంటూ కామెంట్

Kingdom : యంగ్ హీరో విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ ‘కింగ్‌డమ్’ జూలై 31న భారీ…

13 hours ago

Lingad Vegetable : ఈ విచిత్రమైన ఆకుకూరగాయను మీరు ఎప్పుడైనా చూశారా… ఇది చేపలు, మాంసం కంటే బలమైనది..?

Linguda Vegetable : ప్రకృతి ఇచ్చే ప్రతి ఒక్క కూరగాయ అయినా పనులైన ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరం. అందులో ఆకుపచ్చని…

14 hours ago

Supreme Court : ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..!!

Supreme Court : తెలంగాణలో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్‌పై సుప్రీంకోర్టు నేడు కీలక తీర్పును వెలువరించింది. ఈ…

15 hours ago