BalaKrishna : బాలకృష్ణ అభిమానులు గ‌ర్వ‌ప‌డే రోజు వ‌చ్చేసింది.. ఏంటో తెలుసా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

BalaKrishna : బాలకృష్ణ అభిమానులు గ‌ర్వ‌ప‌డే రోజు వ‌చ్చేసింది.. ఏంటో తెలుసా?

BalaKrishna : విశ్య‌విశ్యాత న‌ట‌సార్వ‌భౌమ నంద‌మూరి తార‌క‌రామారావు త‌న‌యుడిగా ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన బాల‌కృష్ణ ఆన‌తి కాలంలోనే మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదించాడు. ఆయ‌న‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. నందమూరి బాలకృష్ణ గతంలో అభిమానుల మీద చేయి చేసుకున్న కొన్ని వీడియోలు వైరల్ కావడంతో ఆయనను ఇతర హీరోలలో అభిమానులు ఆ విషయంలో ట్రోల్ చేస్తూ ఉంటారు. కానీ బాలకృష్ణ అభిమానులు పెట్టినా కొట్టినా మా బాలయ్యే అంటూ కవర్ చేసుకుంటూ ఉంటారు. బాల‌కృష్ణ‌కు […]

 Authored By sandeep | The Telugu News | Updated on :28 July 2022,5:40 pm

BalaKrishna : విశ్య‌విశ్యాత న‌ట‌సార్వ‌భౌమ నంద‌మూరి తార‌క‌రామారావు త‌న‌యుడిగా ఇండ‌స్ట్రీలోకి వ‌చ్చిన బాల‌కృష్ణ ఆన‌తి కాలంలోనే మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదించాడు. ఆయ‌న‌కు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. నందమూరి బాలకృష్ణ గతంలో అభిమానుల మీద చేయి చేసుకున్న కొన్ని వీడియోలు వైరల్ కావడంతో ఆయనను ఇతర హీరోలలో అభిమానులు ఆ విషయంలో ట్రోల్ చేస్తూ ఉంటారు. కానీ బాలకృష్ణ అభిమానులు పెట్టినా కొట్టినా మా బాలయ్యే అంటూ కవర్ చేసుకుంటూ ఉంటారు. బాల‌కృష్ణ‌కు తాజాగా అరుదైన గౌర‌వం ద‌క్కింది.

దీంతో ఫ్యాన్స్ అంతా సంబురాలు చేసుకుంటున్నారు. సినారే జీవన సాఫల్య జాతీయ స్వర్ణకంకణ పురస్కారంను బాల‌య్య‌కు అందజేస్తున్నారని అధికారక ప్రకటన వెలువడింది.జులై నెల 30వ తేదీన రవీంద్ర భారతిలో ఈ పురస్కారంను అందజేయనున్నారని సమాచారం అందుతోంది.మహారాష్ట్ర మాజీ గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు ఈ కార్యక్రమానికి గెస్ట్ గా హాజరు కానున్నారని సమాచారం అందుతోంది. స్టార్ హీరో బాలకృష్ణకు అరుదైన గౌరవం దక్కడంతో అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ‘అఖండ’ వంటి బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత గోపిచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో బాల‌య్య‌ యాక్ష‌న్ సినిమా తెర‌కెక్క‌నుండ‌టంతో ప్రేక్ష‌కుల‌లో భారీ అంచ‌నాలు ఉన్నాయి.

BalaKrishna rare achievement award

BalaKrishna rare achievement award

BalaKrishna : అభిమానుల ఆనందం..

పైగా ఇటీవ‌లే విడులైన బాల‌య్య పోస్ట‌ర్‌లు ప్రేక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ట్టుకున్నాయి. ఈ చిత్రంలో బాల‌కృష్ణ‌కు జోడీగా శృతిహాస‌న్ హీరోయిన్‌గా న‌టిస్తుంది. మైత్రీ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి థ‌మ‌న్ స్వ‌ర కర్త‌గా పనిచేస్తున్నాడు. దునియా విజయ్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. మలయాళ నటుడు లాల్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. నిజ జీవిత ఘటనలను ఆధారంగా చేసుకుని ఈ సినిమా తెరకెక్కిస్తున్నారంటూ ప్రచారం జరుగుతుంది .మరోవైపు బాలయ్య అనిల్ రావిపూడి కాంబో మూవీ రెగ్యులర్ షూటింగ్ సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో మొదలయ్యే ఛాన్స్ ఉంది. ఈ చిత్రం అనీల్ రావిపూడి స్టైల్‌లో ఉంటుందని తెలుస్తుండ‌గా, ఇది బాల‌య్య అబిమానుల‌కి మంచి ఫీస్ట్ అందించ‌డం ఖాయంగా క‌నిపిస్తుంది.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది