Actress Rajani : అలనాటి హీరోయిన్ రజనీ ఇంత నరకం అనుభవించిందా..? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Actress Rajani : అలనాటి హీరోయిన్ రజనీ ఇంత నరకం అనుభవించిందా..?

Actress Rajani : తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది గొప్ప యాక్టర్స్ ఉన్నారు. ఎన్టీఆర్ తర్వాత చిరంజీవి ఎప్పుడైతే ఇండస్ట్రీని ఒక రేంజ్‌కు తీసుకెళ్లారో అదే విధంగా శ్రీదేవి, జయప్రదల తర్వాత అలనాటి యాక్టర్ రజినీ కూడా తన అందంతో తెలుగు సినిమాల్లో ఒక వెలుగు వెలిగింది. అప్పట్లో బాలకృష్ణ, నాగార్జున వంటి సీనియర్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్న రజినీ ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక మజ్ను, అహ నా […]

 Authored By aruna | The Telugu News | Updated on :19 August 2022,9:20 pm

Actress Rajani : తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది గొప్ప యాక్టర్స్ ఉన్నారు. ఎన్టీఆర్ తర్వాత చిరంజీవి ఎప్పుడైతే ఇండస్ట్రీని ఒక రేంజ్‌కు తీసుకెళ్లారో అదే విధంగా శ్రీదేవి, జయప్రదల తర్వాత అలనాటి యాక్టర్ రజినీ కూడా తన అందంతో తెలుగు సినిమాల్లో ఒక వెలుగు వెలిగింది. అప్పట్లో బాలకృష్ణ, నాగార్జున వంటి సీనియర్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకున్న రజినీ ఎన్నో సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక మజ్ను, అహ నా పెళ్ళంట వంటి సినిమాలతో తెలుగు సినిమా పరిశ్రమలో తనదైన ముద్ర వేసింది. నాగార్జున సరసన నటించిన మజ్ను సినిమాకు మంచి గుర్తింపు దక్కింది. అలాగే కన్న‌డ‌ సినీ పరిశ్రమలో విష్ణు,మమ్ముట్టి లాంటి స్టార్ హీరోలతో నటించిన రజినీ అక్కడ కూడా స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది.

రాజేంద్రప్రసాద్‌తో అనేక సినిమాల్లో కలిసి నటించిన రజిని 1985లో బ్రహ్మముడి అనే సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైంది. ఆ తర్వాత ఏకంగా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో 150కు పైగా సినిమాలు చేసింది. అప్పట్లో రాజేంద్రప్రసాద్ , రజనీ కాంబినేషన్ సూపర్ హిట్. వీరిద్దరి కలయికలో వచ్చిన సినిమాలు నవ్వులు పూయించేవి.ఇక రజినీ చివరిగా 1983లో సినిమాలకు ముగింపు పలికిన విషయం తెలిసిందే. బెంగుళూరులో జన్మించిన రజిని 1998లో వివాహం చేసుకుని సినిమాలకు దూరమైంది.ఈమెకు ముగ్గురు పిల్లలు.

Did Actress Rajani the heroine of those days experience such hell

Did Actress Rajani, the heroine of those days, experience such hell?

ముల్లగిరి ప్రవీణ్ అనే ఎన్నారై డాక్టర్‌ను పెళ్లి చేసుకున్న రజిని తన వివాహ జీవితంలో ఎంతో నరకం అనుభవించిదట.. భర్తతో పాటు అత్త కూడా డబ్బుల కోసం రజినిని టార్చర్ చేసే వారని తెలిసింది. అదనపు కట్నం కోసం చిత్రహింసలు పెట్టేవారట.. ఆమె కష్టపడి కొనుకున్న అపార్ట్మెంట్‌ను భర్త తన తల్లిపై రాయించడంతో చేతిలో చిల్లి గవ్వ లేక రజినీ బయటకు వచ్చేసిందట. అంతేకాకుండా తనపై తప్పుడు కేసులు పెట్టి వదిలించుకోవాలని చూస్తున్నారని రజిని కోర్టులో పిటిషన్ వేసింది. ప్రస్తుతం తన పిల్లలతో కలిసి రజిని ఒంటరిగా జీవిస్తోంది.

Also read

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది