Intinti Gruhalakshmi 30 March Today Episode : అనాథాశ్రమంలో పరందామయ్య, అనసూయ.. ప్రేమ్ వాళ్లను చూస్తాడా? తులసి, మాధవికి పరందామయ్య కనపిస్తాడా? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Intinti Gruhalakshmi 30 March Today Episode : అనాథాశ్రమంలో పరందామయ్య, అనసూయ.. ప్రేమ్ వాళ్లను చూస్తాడా? తులసి, మాధవికి పరందామయ్య కనపిస్తాడా?

Intinti Gruhalakshmi 30 March Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 30 మార్చి 2022, బుధవారం ఎపిసోడ్ 593 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ముందు వాళ్లు ఎక్కడ ఉన్నారో కనుక్కుందాం అంటుంది తులసి. దీంతో వాళ్లు దొరకరు ఎందుకంటే.. వాళ్లను నువ్వే దాచావు అంటుంది లాస్య. నేనెందుకు దాస్తాను అంటుంది తులసి. ఎందుకంటే మాతో పంపించడం ఇష్టం లేదు కాబట్టి అంటాడు నందు. మొత్తానికి పరందామయ్య, […]

 Authored By gatla | The Telugu News | Updated on :30 March 2022,9:30 am

Intinti Gruhalakshmi 30 March Today Episode : ఇంటింటి గృహలక్ష్మి సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ తాజాగా విడుదలైంది. ఈరోజు 30 మార్చి 2022, బుధవారం ఎపిసోడ్ 593 హైలైట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ముందు వాళ్లు ఎక్కడ ఉన్నారో కనుక్కుందాం అంటుంది తులసి. దీంతో వాళ్లు దొరకరు ఎందుకంటే.. వాళ్లను నువ్వే దాచావు అంటుంది లాస్య. నేనెందుకు దాస్తాను అంటుంది తులసి. ఎందుకంటే మాతో పంపించడం ఇష్టం లేదు కాబట్టి అంటాడు నందు. మొత్తానికి పరందామయ్య, అనసూయ విషయంలో కూడా తులసిని కార్నర్ చేస్తారు నందు, లాస్య. నాకు మా అమ్మానాన్నలు కావాలి… అని అరుస్తాడు నందు. పిచ్చోడిలా తులసి మాటలు నమ్మావు కదా. ఇప్పుడు ఏమంటావు.. రోగం కుదిరిందా.. ఎవరేంటో అర్థం అయిందా అని నందును రెచ్చగొడుతుంది లాస్య.

intinti gruhalakshmi 30 march 2022 full episode

intinti gruhalakshmi 30 march 2022 full episode

ఎవరు ఏం చెప్పినా నేను నమ్మను. ఇది తులసి కుట్ర. ఇక్కడి నుంచి నేను మా అమ్మానాన్నలతోనే కదులుతాను.. అంటాడు నందు. దీంతో అత్తయ్య, మామయ్య ఎక్కడున్నా నేను వెతికి తీసుకొస్తాను అంటుంది తులసి. మరోవైపు ప్రేమ్.. జరిగిన విషయం తన ఫ్రెండ్స్ కు చెబుతాడు. ఎందుకురా నాకు ఇలా జరుగుతోంది అని అంటాడు. దీంతో మొన్ననే కదా ఆటో నడపడం స్టార్ట్ చేశావు అంటారు ఫ్రెండ్స్. దీంతో తన తల్లి చెప్పిన విషయాలను చెబుతాడు ప్రేమ్. ఇంతలో ప్రేమ్ కు ఫోన్ వస్తుంది. దివ్య ఫోన్ చేస్తుంది. నాన్నమ్మ, తాతయ్య వాళ్లు లెటర్ రాసిపెట్టి ఎక్కడికో వెళ్లిపోయారు అని చెబుతుంది దివ్య.

దీంతో నువ్వేం టెన్షన్ పడకు.. నేను వెతికి తీసుకొస్తా అని చెబుతాడు. తన ఫ్రెండ్స్ తో సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వెతికించమని చెబుతాడు. మరోవైపు మాధవికి ఫోన్ చేసి.. అక్కడికి అత్తయ్య, మామయ్య వచ్చారా అని అడుగుతుంది. దీంతో రాలేదు అని చెబుతుంది.

నేనూ వస్తాను.. వాళ్లను కలిసి వెతుకుదాం అంటుంది మాధవి. ఇద్దరూ కలిసి రోడ్డు మీద వెతుకుతూ ఉంటారు. మరోవైపు పరందామయ్య, తులసి.. ఇద్దరూ బ్యాగు పట్టుకొని రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటారు. వాళ్లు ఏడుస్తూ వెళ్తుంటారు.

నడవడం కష్టంగా ఉంది అంటుంది అనసూయ. ఆ నందు గాడితో వెళ్లడం కంటే ఈ కష్టాన్ని భరించడమే నయం అంటుంది అనసూయ. తులసికి కూడా రోడ్డు మీద తిరిగి తిరిగి కళ్లు తిరుగుతాయి. దీంతో ఒక చోట కూర్చుంటారు. వాళ్లను పరందామయ్య, అనసూయ చూస్తారు.

Intinti Gruhalakshmi 30 March Today Episode : పరందామయ్య, అనసూయను చూసిన తులసి

తులసి కూడా వాళ్లను చూసి పరిగెడుతుంది. కానీ.. వాళ్లు దొరక్కుండా తప్పించుకుంటారు. తులసి మనల్ని చూసిందంటే.. మళ్లీ నందు దగ్గరికి పంపిస్తారు అనుకొని వెళ్లి దాచుకుంటారు. దీంతో మామయ్య, అత్తయ్య.. నేను మిమ్మల్ని చూశాను అంటుంది తులసి.

ఖచ్చితంగా ఇక్కడే ఎక్కడో దాక్కున్నారు నాకు తెలుసు. దయచేసి బయటికి రండి మామయ్య అంటుంది తులసి. మీకు దండం పెడతాను.. బయటికి రండి మామయ్య. మీరు మీ అబ్బాయితో వెళ్లక్కర్లేదు. మాతోనే ఉందురు కానీ.. నా మాట విని బయటికి రండి అత్తయ్య అంటుంది తులసి.

పాపం ఏడుస్తుంది వెళ్దాం పదండి అంటుంది అనసూయ కానీ.. వద్దు అంటాడు పరందామయ్య. మరోవైపు ప్రేమ్ కూడా తన తాతయ్య, నానమ్మ కోసం వెతుకుతూ ఉంటాడు. ఓ వృద్ధాశ్రమానికి వెళ్తాడు. అప్పుడే అదే సమయానికి అక్కడికి పరందామయ్య, అనసూయ వస్తారు.

కానీ.. ప్రేమ్ వాళ్లను చూడడు. మరోవైపు పరందామయ్య ఆశ్రమానికి వెళ్లి మేము అనాథలం అని చెబుతాడు. కానీ.. ప్రేమ్ వాళ్ల ఫోటోను చూపించేసరికి.. మీరు అనాథలు కాదు.. అబద్ధాలు చెబుతున్నారు అంటాడు. ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలియాలంటే తరువాయిభాగంలో చూడాల్సిందే.

gatla

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది