Mahesh Babu : ఆ దర్శకుడి స్టోరీ లైన్స్ విని మహేశ్ బాబు ఛీ కొట్టాడంట.. ఆయన ఎవరంటే?
Mahesh babu : తెలుగు చిత్ర పరిశ్రమలో సూపర్ స్టార్ మహేశ్ బాబు క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంట. బాల నటుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి సూపర్ స్టార్ రేంజ్కు ఎదిగారు. ఎన్నో బ్లాక్ బ్లాస్టర్స్ ఇండస్ట్రీకి అందించారు. ఆయన నటనకు గాను ప్రభుత్వం తరఫున ఎన్నో అవార్డులను అందుకున్నారు. అయితే, సూపర్ స్టార్ మహేశ్ బాబు చూసేందుకు మిల్క్ బాయ్లా ఉన్నా ఆయన ఇండస్ట్రీలోకి వచ్చి 30ఏళ్లకు పైగా అవుతుంది. నలుగు పదుల వయస్సు ఉన్నా చూసేందుకు నేటికి యంగ్ అండ్ ఎనర్జిటిక్గా ఉంటారు.
అందకే ఇండస్ట్రీలతో సంబంధం లేకుండా హీరోయిన్స్ మహేశ్ బాబు అంటే పడిచచ్చిపోతారు.సినిమా ఆడియో ఫంక్షన్లు, ఈవెంట్స్లో ప్రిన్స్కు పబ్లిక్ గానే ప్రపోజ్ చేస్తుంటారు కుర్ర హీరోయిన్లు.. మహేశ్ బాబు వంశీ సినిమాలో తన కోస్టార్ నమ్రత శిరోద్కర్ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. గౌతమ్ మరియు సితార..ఇకపోతే మహేశ్ బాబు సినిమాల విషయంలో, స్టోరీల విషయంలో చాలా కేర్ ఫుల్గా ఉంటాడని ఇండస్ట్రీలో టాక్..హిట్ ట్రాక్ ఉన్న డైరక్టర్లతోనే సినిమాలు చేస్తాడని.. ప్లాపులు వస్తే దగ్గరకు రానివ్వడని టాలీవుడ్ ఇండస్ట్రీ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ సంచలన కామెంట్స్ చేశారు.

mahesh babu was shocked to hear the story lines of the director
Mahesh babu : ఒకసారి కాదు.. చాలా సార్లు..
వాస్తవానికి పూరి మహేశ్కు బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ హిట్స్ ఇచ్చాడు. ‘పోకిరి’, ‘బిజినెస్ మెన్’ వంటి కమర్షియల్ హిట్స్ తర్వాత మహేశ్ పూరితో మళ్లీ సినిమా చాన్స్ ఇవ్వలేదు. ఎందుకంటే హిట్ ట్రాక్ పొగొట్టుకున్నాడు పూరి. అదేవిధంగా దర్శకుడు మెహర్ రమేశ్ పేరు వింటారు.. ఆయన తీసిన సినిమాల్లో ప్రభాస్ హీరోగా చేసిన ‘బిల్లా’ మినహా ప్రతీ సినిమా ప్లాప్.. ఆయన ఓసారి మహేశ్కు స్టోరీ లైన్ చెప్పడానికి వెళితే ఛీ కొట్టాడట.. ఒక్కసారే కాదు ఇలా చాలా సార్లు జరిగిందట.. ఈ విషయాన్ని మెహర్ రమేశ్ స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. దీనిపై నెటిజన్లు తమకు తోచినట్టు కామెంట్స్ చేస్తున్నారు.