Rashmika Mandanna : రష్మిక మందన్నకి సంబంధించిన ఆ పార్ట్ ఆకర్షణీయంగా చూపించేందుకు అన్ని ల‌క్షలు ఖర్చు చేశారా..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Rashmika Mandanna : రష్మిక మందన్నకి సంబంధించిన ఆ పార్ట్ ఆకర్షణీయంగా చూపించేందుకు అన్ని ల‌క్షలు ఖర్చు చేశారా..!

Rashmika Mandanna : కూర్గ్ భామ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఈ అమ్మ‌డు ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చి కుర్రకారు హృదయాలను దోచుకున్నారు. అంతేకాదు తన నటనతో పాటు అందచందాలతో తెలుగు వారి మ‌న‌సుల్లో చెర‌గ‌ని ముద్ర వేసుకుంది. ఈ అమ్మ‌డు పుష్ప‌తో నేష‌న‌ల్ క్ర‌ష్‌గా మారింది స‌రిలేరు నీకెవ్వరు చిత్రంతోను అద‌ర‌గొట్టింది. లేటెస్ట్ సినిమా సీతారామంలో నటించారు. మంచి అంచనాల నడుమ ఈ సినిమా ఆగస్టు 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలై […]

 Authored By sandeep | The Telugu News | Updated on :22 October 2022,7:30 pm

Rashmika Mandanna : కూర్గ్ భామ రష్మిక మందన్న గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఈ అమ్మ‌డు ఛలో సినిమాతో ఎంట్రీ ఇచ్చి కుర్రకారు హృదయాలను దోచుకున్నారు. అంతేకాదు తన నటనతో పాటు అందచందాలతో తెలుగు వారి మ‌న‌సుల్లో చెర‌గ‌ని ముద్ర వేసుకుంది. ఈ అమ్మ‌డు పుష్ప‌తో నేష‌న‌ల్ క్ర‌ష్‌గా మారింది స‌రిలేరు నీకెవ్వరు చిత్రంతోను అద‌ర‌గొట్టింది. లేటెస్ట్ సినిమా సీతారామంలో నటించారు. మంచి అంచనాల నడుమ ఈ సినిమా ఆగస్టు 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. బిగ్ బి అమితాబ్ బచ్చన్‌తో గుడ్‌బై అనే చిత్రంలో నటించింది.

వీటితో పాటు ప‌లు బాలీవుడ్ చిత్రాల‌లో న‌టిస్తుంది. కన్నడ చిత్రాలతో హీరోయిన్‌గా పరిచయం అయిన రష్మిక మందన్నా అనతి కాలంలోనే స్టార్‌ హీరోయిన్‌ అయిపోయింది. అంతే వేగంగా బాలీవుడ్‌ వరకు వెళ్లింది. `పుష్ప2` చిత్రంతో పాన్‌ ఇండియా హీరోయిన్‌ గా పేరుతెచ్చుకుంది. ఇందులో `శ్రీవల్లి`గా ఆమె చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. దేశ వ్యాప్తంగా రష్మిక పాపులర్‌ అయిపోయింది.`పుష్ప 2`తో మరోసారి రచ్చ చేసేందుకు వస్తుంది. మరోవైపు హిందీలో `యానిమల్‌` అనే మరో పాన్‌ ఇండియా మూవీ చేసింది. రణ్‌బీర్‌ కపూర్‌ హీరోగా నటించే ఈ చిత్రానికి సందీప్‌రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్నారు.

makers 30 lakhs invest for Rashmika Mandanna Pics

makers 30 lakhs invest for Rashmika Mandanna Pics

Rashmika Mandanna : బాగానే ఖ‌ర్చు చేశారుగా..

ఇంకోవైపు విజయ్‌ తో `వారసుడు` చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. మొత్తానికి దీపం ఉండ‌గానే ఇల్లు చ‌క్క‌బెట్టుకుంటున్న ర‌ష్మికకి సంబంధించిన ఓ వార్త హ‌ల్చల్ చేస్తుంది.ఈ అమ్మ‌డు స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రంలో మ‌హేష్ బాబు స‌ర‌స‌న నటించి మెప్పించింది. ఇందులో మైండ్ బ్లాక్ అనే సాంగ్‌లో అద‌ర‌గొట్టింది. ఈ పాటలో రష్మిక పొట్ట భాగం బాగా ఎత్తుగా కనిపించిందట. దాన్ని ఆక‌ర్షణీయంగా మార్చేందుకు దాదాపు రు. 30 లక్షల వరకు ఖర్చు చేశారట. గ్రాఫిక్స్ కోస‌మే ఇంత ఖ‌ర్చు చేశార‌ని వినికిడి. ఈ అమ్మ‌డి న‌డుముని నాజూకుగా చూపించేందుకు మేక‌ర్స్ ఇంత ఖ‌ర్చు పెట్టార‌ని తెలుస్తుంది.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది