
Nag ashwin : నాగ్ అశ్విన్ దర్శకత్వలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఒక సైన్స్ ఫిక్షన్ జోనర్ లో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వినీ దత్ ఈ సినిమాని దాదాపు 500 కోట్ల భారీ బడ్జెట్ తో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మించనున్నారు. అందుకు కారణం ఈ సినిమా వైజయంతీ మూవీస్ బ్యానర్ లో నిర్మించే 50 వ సినిమా కావడమే. అందుకే నిర్మాత అశ్వనీదత్ ఖర్చు కి వెనకాడకుండా నిర్మిస్తున్నాడు. ఈ సినిమాకి ప్రముఖ సీనియర్ దర్శకులు సింగీతం శ్రీనివాస్ రావు గారు క్రియేటివ్ హెడ్ గా వ్యవహరిస్తున్నారు.
prabhas fans are afraid of movie with nag ashwin
ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపిక పదుకొణె ప్రభాస్ కి జంటగా నటిస్తోంది. బాలీవుడ్ మెగాస్టార్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో కనిపిస్తున్నారు. కాగా ఈ సినిమాకి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్స్ వర్క్ జరుగుతోంది. ఇక ఈ ఏడాదే ఈ ప్రాజెక్ట్ సెట్స్ మీదకి రానుందని ప్రచారం జరుగుతోంది. మహానటి సినిమాతో నాగ్ అశ్విన్ దేశ వ్యాప్తంగా పాపులారిటీని తెచ్చుకున్నాడు. దాంతో ప్రభాస్ తో సినిమా అనగానే అందరిలో భారీ ఆసక్తి నెలకొంది. కాని తాజాగా రిలీజైన పిట్ట కథలు అన్న తెలుగు వెబ్ సిరీస్ తో ప్రభాస్ అభిమానుల్లో అంచనాలు తారుమారయ్యాయని చెప్పుకుంటున్నారు.
రీసెంట్ గా తెలుగు లస్ట్ స్టోరీస్ అంటూ నాలుగు ఎపిసోడ్స్ గా పిట్ట కథలు అన్న వెబ్ సిరీస్ ప్రముఖ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా టెలికాస్ట్ అవుతున్న పిట్టకథలు లో ‘ఎక్స్-లైఫ్’ కి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించాడు. అయితే ‘ఎక్స్-లైఫ్’ కి నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. దాంతో ప్రభాస్ ఫ్యాన్స్ లో టెన్షన్ మొదలైందని అంటున్నారు. ఒక చిన్న షార్ట్ ఫిల్మ్ ని డీల్ చేయలేకపోయాడు.. అలాంటిది ప్రభాస్ తో సైన్స్ ఫిక్షన్ సినిమా ఎలా తీయగలడు అంటూ మాట్లాడుకుంటున్నారట. మరి నాగ్ అశ్విన్ సినిమా ని నిజంగా ఎలా తీసాడో చూడాలి. ఇక ప్రభాస్ ప్రస్తుతం సలార్ .. ఆదిపురుష్ సినిమాలని చేస్తున్నాడు.
Indiramma Houses : ఈ రోజు జీహెచ్ఎంసీ పరిధిలోని ఘట్కేసర్ సర్కిల్లో పేద ప్రజలకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను…
Hyderabad : హైదరాబాద్ నగరంలో దోమల సమస్య రోజురోజుకు తీవ్రమవుతుండటానికి ఆశ్చర్యకరమైన కారణం బయటపడింది. నగర ప్రజల ఆరోగ్య రక్షణ…
Ys Jagan : తిరుమల లడ్డూ Thirupathi Laddu వ్యవహారం ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.…
Mahesh Babu vs Rajamouli : సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు ఎక్కడ చూసినా AI ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గోలే వినిపిస్తోంది. తాజాగా…
YSRCP : ఆంధ్రప్రదేశ్ Andhra pradesh రాజకీయాల్లో చిత్తూరు జిల్లా అంటేనే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి Peddireddy Ramachandra Reddy కుటుంబం…
Uppal : ఉప్పల్ నియోజకవర్గంలో రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా…
Pawan Kalyan Vijay : తమిళనాడు Tamil Nadu Politics రాజకీయాల్లో ఇప్పుడు దళపతి విజయ్ పేరు Vijay మార్మోగిపోతోంది.…
Sara Tendulkar : సోషల్ మీడియా విస్తరణతో ప్రతి చిన్న విషయం కూడా పెద్ద చర్చగా మారుతోంది. ఇటీవల ప్రముఖ…
Annamaya District : అన్నమయ్య జిల్లా పుంగనూరు మండలం మేళందొడ్డి గ్రామంలో హృదయ విదారక ఘటన చోటుచేసుకుంది. తీవ్ర అనారోగ్యానికి…
KCR : తెలంగాణ Telangana రాజకీయాల్లో ఇప్పుడు అందరి చూపు గులాబీ బాస్ కేసీఆర్ వైపే ఉంది. అసెంబ్లీ ఎన్నికల…
Good News : ఆంధ్రప్రదేశ్లో సొంతిల్లు లేని పేద కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. త్వరలోనే ప్రధాన్ మంత్రి…
Ys Jagan : తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ Andhpra pradesh రాజకీయాల్లో ఒక పెను తుపానును…
This website uses cookies.