Rashmi Gautam : సుజాత మాట‌ల‌కు క‌న్నీరు పెట్టుకున్న రష్మీ గౌతమ్.. వైర‌ల్ అవుతున్న వీడియో | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | Today Telugu News

Rashmi Gautam : సుజాత మాట‌ల‌కు క‌న్నీరు పెట్టుకున్న రష్మీ గౌతమ్.. వైర‌ల్ అవుతున్న వీడియో

Rashmi Gautam : బుల్లితెర కామెడీ షో జ‌బ‌ర్ధ‌స్త్ కార్య‌క్ర‌మం ఎంత పాపుల‌ర్ అయిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ షోలో ప‌లు జంట‌లు చేసే సంద‌డి ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదాన్ని పంచుతున్నాయి. కామెడీ షో సాక్షిగా రష్మీ-సుధీర్ అనే బుల్లితెర ప్రేమ జంట మంచి వినోదాన్ని పంచుతుంది. క్రేజీ లవ్ బర్డ్స్ గా వాళ్ళు బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇమ్మాన్యుయేల్- వర్ష‌ అదే స్థాయిలో లవ్ బర్డ్స్ గా ఫేమస్ అయ్యారు. గత రెండేళ్లుగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు. […]

 Authored By sandeep | The Telugu News | Updated on :29 March 2022,6:30 pm

Rashmi Gautam : బుల్లితెర కామెడీ షో జ‌బ‌ర్ధ‌స్త్ కార్య‌క్ర‌మం ఎంత పాపుల‌ర్ అయిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. ఈ షోలో ప‌లు జంట‌లు చేసే సంద‌డి ప్రేక్ష‌కుల‌కి మంచి వినోదాన్ని పంచుతున్నాయి. కామెడీ షో సాక్షిగా రష్మీ-సుధీర్ అనే బుల్లితెర ప్రేమ జంట మంచి వినోదాన్ని పంచుతుంది. క్రేజీ లవ్ బర్డ్స్ గా వాళ్ళు బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇమ్మాన్యుయేల్- వర్ష‌ అదే స్థాయిలో లవ్ బర్డ్స్ గా ఫేమస్ అయ్యారు. గత రెండేళ్లుగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు. ఇక ఇప్పుడు మూడో జంట‌గా జోర్దార్ సుజాత-రాకింగ్ రాకేష్ అవ‌త‌రించారు. వారి మధ్య కొన్నాళ్లుగా లవ్ ట్రాక్ నడుస్తుంది. అనేక బుల్లితెర షోలలో వీరిద్దరూ ప్రేమికులుగా షోలు చేస్తున్నారు.

తాజా ఎపిసోడ్ లో సుజాత రాకేష్‌ల‌కి సంబంధించి రోజా ఆస‌క్తిక‌ర ప్ర‌శ్న‌లు సంధించింది. మీ ఇద్దరికీ చిన్న గొడవొచ్చి రాకేష్ నిన్ను వదిలి వేరే అమ్మాయితో వెళ్ళిపోతే పరిస్థితి ఏంటి?.. అని అడిగారు. ఈ ప్రశ్నకు సమాధానంగా సుజాత.. రాకేష్ వేరే అమ్మాయితో వెళితే నా ప్రాబ్లం లేదు. ఆయనతో వెళ్లిన అమ్మాయి రాంగ్ పర్సన్ కాకూడదు. ఒకవేళ రాకేష్ తన సంతోషం కోసం వేరే అమ్మాయితో వెళ్లినా నాకు ఓకె. తన సంతోషం కోసం రాకేష్ ని వదిలేస్తా అంటూ ఎమోషనల్ అయ్యింది.

Rashmi Gautam emotional in the show

Rashmi Gautam emotional in the show

Rashmi Gautam : అంత‌గా ఏడ‌వ‌డానికి కార‌ణం ఏంటి?

సుజాత మాటలకు రాకేష్ కన్నీరు పెట్టుకున్నారు. జడ్జెస్ తో పాటు సెట్ లో ఉన్న కమెడియన్స్ షాక్ అయ్యారు. రష్మీ మాత్రం ఎమోషనల్ గా ఫీల్ అయ్యారు. కాగా కారణం ఏమిటో తెలియదు కానీ రష్మీ కన్నీటి పర్యంతం అయ్యారు. లేటెస్ట్ ఎక్ట్రా జబర్దస్త్ ప్రోమో చివర్లో రష్మీ నిరవధికంగా ఏడవడం చూపించారు. దీంతో రష్మీ అంతలా ఏడవడానికి కారణం ఏమిటో ఎవరికీ అర్థం కాలేదు. మరి ఈ శుక్రవారం ప్రసారం కానున్న ఎపిసోడ్ త‌ర్వాత పూర్తి క్లారిటీ రానుంది. ఏది ఎలా ఉన్నా కూడా ప్రోమోకి సంబంధించి విష‌యం హాట్ టాపిక్‌గా మారింది. పూర్తి క్లారిటీ రావాలంటేఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యే వ‌ర‌కు ఆగాల్సిందే.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది