Rashmi Gautam : బుల్లితెర రష్మి గౌతమ్ కెరీర్ చాలా కాలం క్రితమే తెలుగు సినీ ఇండస్ట్రీలోకి నటిగా ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే చాలా చిత్రాల్లో చిన్న చిన్న పాత్రలను పోషించింది. అలా ఎంతో కాలంగా సినీ రంగంలో కొనసాగుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో ‘జబర్ధస్త్’ అనే కామెడీ షోతో ఆమె యాంకర్గా బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో అద్భుతమైన హోస్టింగ్తో ఆకట్టుకుని ఫుల్ ఫేమస్ అయింది. ఆమె ఆర్టిస్ట్గానే కాకుండా సామాజిక సేవల విషయంలో అందరి మన్ననలు పొందింది. మూగ జీవాల గురించి రష్మీ చేసే పోస్ట్లు అందరినీ కదిలిస్తుంటాయి. మూగ జీవాలను హింసించడం, వాటిని మనుషులు ఎంతలా వినియోగించుకుంటున్నారో అంటూ రష్మీ ఆవేదన చెందుతుంది.
కుక్క, ఆవు, గేదె, గుర్రాలు ఇలా ప్రతీ ఒక్క జీవరాశి గురించి రష్మీ స్పందిస్తుంటుంది.ఆ మధ్య గేదె, ఆవు పాల మీద స్పందించింది. గేదెలు, ఆవులు తమ పిల్లల కోసం పాలను ఉత్పత్తి చేస్తుంటే.. మనుషులు వాటిని అవసరానికి మించి తీసుకుంటున్నారు. అవి మనషుల కోసం పాలను ఉత్పత్తి చేస్తోన్నట్టు అయింది. వాటిని మనం హింసిస్తున్నామంటూ రష్మీ చెప్పుకొచ్చింది. అందుకే తాను పాలు, పాల ఉత్పత్తులను కూడా వాడను అని తెలిపింది. ఇక తాజాగా మూగజీవిని మాంసం కోసం మార్కెట్లో అమ్మేయగా కన్నీరు పెట్టుకుంది.ఈ వీడియోని చూసి రష్మీ గౌతమ్ చాలా ఆవేదన చెందింది. అలానే డస్ట్ బిన్లో బ్లేడ్స్ వంటివి వేయోద్దని కోరింది.
వాటి వలన చాలా జీవులు మరణిస్తున్నాయని పేర్కొంది. రష్మీ గౌతమ్ మరీ ముఖ్యంగా వీధి కుక్కలను గాయపరిచే ఘటనలపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తుంటుంది. ఇక నాన్ వెజ్ తినడాన్ని రష్మీ వ్యతిరేకిస్తుంటుంది. వీధి కుక్కలు గాయాలతో కనిపిస్తే రష్మీ వెంటనే వాటిని చేరదీస్తుంది. తీవ్రంగా గాయపడి ఉంటే చేతనైనంతలో ఆపరేషన్ కూడా చేయిస్తుంటుంది. ఓ సారి అలానే ఓ పెట్కు గాయాలయ్యాయి. ఆపరేషన్ డబ్బుల కోసం రష్మీ తన అభిమానులను రిక్వెస్ట్ చేసింది. ఒక్కొక్కరు ఒక్కో రూపాయి ఇచ్చినా చాలంటూ వేడుకుంది. అలా రష్మీ మూగ జీవాల మీద ప్రేమను కురిపిస్తుంటుంది.
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
This website uses cookies.