Samantha Yashoda : సెకండ్ హాఫ్ లో ఆ డైలాగ్ తో నాగ చైతన్య కి పంచ్ వేసిందా ? సమంత యశోద లో ఈ సీన్ వైరల్ అవుతోంది!

Authored By Prahbas Gilakathula | The Telugu News | Updated on : 11 November 2022, 7:40 pm

Samantha Yashoda : సమంత హీరోయిన్ గా నటించిన యశోద సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. సినిమా కు మిశ్రమ స్పందన దక్కింది. సినిమా లో ఇన్ డైరెక్ట్ గా సమంత తన మాజీ భర్త నాగ చైతన్య మరియు తన అత్తగారు అక్కినేని కుటుంబానికి కౌంటర్ ఇచ్చింది అంటూ కొందరు మాట్లాడుకుంటున్నా రు. విషయానికి వస్తే యశోద సినిమాలోని సెకండాఫ్ లోని ఒక డైలాగ్ అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఆ డైలాగ్ తో తన విడాకులకు కారణం ఏంటీ అనే విషయమై సమంత క్లారిటీ ఇచ్చింది అంటూ కొందరు అంటూ ఉంటే మరి కొందరు సమంత అసలు విషయాన్ని చెప్పేసిందని మాట్లాడుకుంటూ ఉన్నారు.

ఇంతకు ఆ డైలాగ్‌ ఏంటీ అంటే… పెళ్లి అయిన వెంటనే అత్తారింటి వారు మరియు అమ్మ గారి ఇంటి వారు అంతా కూడా పిల్లలను కనాలీ అంటూ అమ్మాయిలపై ఒత్తిడి చేస్తున్నారు. అలా పెళ్లయిన వెంటనే ఒక అమ్మాయి జీవితం ఆగి పోయినట్లు అవుతుంది అంటూ సమంత డైలాగ్ సినిమాలో అందరి దృష్టిని ఆకర్షిస్తుంది. ఈ డైలాగ్ కచ్చితంగా సమంత పర్సనల్ ఫీలింగ్ అని, ఆమె నాగ చైతన్య ను వివాహం చేసుకున్న వెంటనే అక్కినేని ఫ్యామిలీ వారితో పాటు నాగ చైతన్య కూడా తల్లి కావాలంటూ ఒత్తిడి చేశాడని అందుకే ఆమె ఈ డైలాగ్ ని సినిమాలో కావాలని పెట్టించింది అంటూ కొందరు మాట్లాడుకుంటున్నారు.

Samantha Yashoda movie Dialogue counter for Naga Chaitanya

Samantha Yashoda movie Dialogue counter for Naga Chaitanya

నాగ చైతన్య మరియు సమంత విడి పోవడానికి కారణం ఏంటి అనే విషయమై ఇప్పటి వరకు క్లారిటీ లేదు. కానీ జనాలు ఎవరికి తోచిన విధంగా వారు ఊహించేసుకుంటున్నారు. తాజాగా యశోద సినిమా చూసిన వారు నాగ చైతన్య కు వెంటనే తండ్రి అయిపోవాలని ఆశ ఉండేది.. కానీ సమంత మాత్రం సినిమాలు చేయాలని కోరిక ఉండేది. అందుకనే ప్రెగ్నెంట్ వద్దు అన్నందుకు నాగ చైతన్య మరియు సమంత విడి పోయారు అనేది చాలామంది అభిప్రాయం. రంగస్థలం సినిమాలో నటిస్తున్న సమయం లోనే సమంత ప్రెగ్నెంట్ అవ్వాలంటూ నాగ చైతన్య ఒత్తిడి చేశాడని ప్రచారం జరుగుతోంది. ఇందులో నిజమెంతో తెలియాల్సి ఉంది.

Advertisement

Prahbas Gilakathula

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి