Venu Swamy : ఏంది.. వేణు స్వామి ఇలా జరిగింది..!
Venu Swamy : హైదరాబాద్ : ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామికి సమస్యలు కొత్త కాదు. సెలబ్రిటీలపై తన అంచనాల విషయంలో అతను చాలాసార్లు ఇబ్బందులను ఎదుర్కోవడం మనం చూశాం. అతని రాజకీయ అంచనాలు చాలా సమయాల్లో తప్పుగా నిరూపించబడ్డాయి. దీని వల్ల అతను సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోలింగ్ను ఎదుర్కొంటుంటాడు. అయితే, వేణుస్వామి తాజా అంచనా ఆయనను పెద్ద చిక్కుల్లో పడేసింది. వేణు స్వామి తన తాజా ఇంటర్వ్యూలో నాగ చైతన్య – శోభిత ధూళిపాళ నిశ్చితార్థం తర్వాత వారిపై అంచనాలు వేసిన సంగతి తెలిసిందే. ఈ జంట కలిసి ఉండకపోవచ్చని, మూడేళ్లలో విడిపోతారని చెప్పారు. ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
దాంతో తెలుగు ఫిల్మ్ జర్నలిస్ట్ అసోసియేషన్ (TFJA) మరియు తెలుగు ఫిల్మ్ డిజిటల్ మీడియా అసోసియేషన్ (TFDMA) సభ్యులు తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్ నేరెళ్ల శారదను కలిసి ఫిర్యాదు చేశారు. వేణు స్వామి అవాంఛనీయ వ్యాఖ్యలు చేశారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో ఇరు వర్గాలు పేర్కొన్నాయి. దాంతో తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఈ నెల 22న తమ ముందు హాజరు కావాలని వేణుస్వామికి నోటీసులు పంపింది.
Venu Swamy : ఏంది.. వేణు స్వామి ఇలా జరిగింది..!
గతంలో వేణు స్వామి చెప్పిన జ్యోతిష్యాలు కొన్నిసార్లు కరెక్ట్ కాగా.. చాలాసార్లు బెడిసి కొట్టాయి. కేసీఆర్, జగన్ జాతకాలు బాగున్నాయని ఈసారి వాళ్లే అధికారంలోకి మళ్లీ వస్తారని చెప్పుకొచ్చాడు. కానీ తీరా చూస్తే వారిద్దరూ ఓడిపోయారు. ఇక ప్రభాస్ సినిమాలు అయితే ఆడవని, ఆయన ఆరోగ్యం కూడా బాగుండందంటూ పదే పదే చెబుతుంటాడు. కానీ చివరకు కల్కి వెయ్యి కోట్లు కొల్లగొట్టింది. ఇలా వేణు స్వామి చేసిన విశ్లేషణ, జాతకాలు చెప్పడంపై అందరూ భగ్గుమన్నారు.
Esha Gupta : బాలీవుడ్ బ్యూటీ ఇషా గుప్తా తాజాగా తన వ్యక్తిగత జీవితంపై ఓపెన్ అయ్యింది. గతంలో టీమిండియా…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాజీ సీఎం వైఎస్ జగన్పై తీవ్రంగా మండిపడ్డారు. పాలన ఎలా ఉండకూడదో తెలుసుకోవాలంటే…
Manchu Vishnu : టాలీవుడ్ లో భారీ అంచనాల మధ్య విడుదలకు సిద్ధమవుతున్న మంచు విష్ణు నటించిన పౌరాణిక చిత్రం…
రైలు ప్రయాణికులకు పిడుగులాంటి వార్త. జులై నెల నుంచి రైలు టికెట్ ఛార్జీలు పెరగనున్నాయి. చాలా సంవత్సరాల తర్వాత రైల్వే…
Team India :ఇండియన్ క్రికెట్ జట్టు టెస్ట్ ఫార్మాట్లో ఈ మధ్య నిరాశాజనక ప్రదర్శనతో అభిమానులను నిరాశకు గురి చేస్తుంది.…
RK Roja : ఏపీ రాజకీయ పరిణామాలపై మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వం…
Wife : ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ప్రయాగ్రాజ్ జిల్లాలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. నిషాద్ అనే వ్యక్తి తాజాగా సితార అనే…
Three Sisters : ముగ్గురు అక్కాచెల్లెళ్ళతో రొమాన్స్ చేసిన ఏకైక హీరో చిరంజీవి అని చెప్పొచ్చు. ఆ ముగ్గురితో కలిసి…
This website uses cookies.