Tollywood : టాలీవుడ్ నిర్మాతలు ఒక వైపు ఏపీ ప్రభుత్వం టిక్కెట్ల రేట్లు పెంచాలి అంటూ విజ్ఞప్తి చేస్తుంటే.. మరో వైపు ఏపీ అధికార పార్టీ నాయకులు మాత్రం సినిమా పరిశ్రమ పై విరుచుకు పడుతున్నారు. హైదరాబాద్లో ఉంటున్న తెలుగు సినిమా ప్రముఖులకు ఏపీ అనే ఒక రాష్ట్రం ఉందని… వారికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సీఎం అని తెలియదని అంటున్నారు. వారికి సీఎం జగన్మోహన్ రెడ్డి గురించి చూపించడం కోసమే మేము ఈ పని చేస్తున్నట్లుగా కొందరు అనధికారికంగా వ్యాఖ్యలు చేస్తున్నారు.తాజాగా ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అందుకు నిదర్శనం అన్నట్లుగా ఉన్నాయి. తెలుగు సినిమాకు చెందిన నిర్మాతలు బలిసి కొట్టుకుంటున్నారు. వారు కనీసం సీఎం జగన్ మోహన్ రెడ్డి ని గుర్తించడం లేదు…
వారికి తగిన శాస్తి జరగాల్సిందే అన్నట్లుగా ఆయన వ్యాఖ్యలు చేశాడు. బలిసి కొట్టుకుంటున్న వారు భారీ చిత్రాలు తీస్తున్నారని ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలకు పలువురు నిర్మాతలు స్పందించారు. అయితే ఇప్పటి వరకు స్పందించిన నిర్మాతల్లో పెద్ద నిర్మాతలు లేకపోవడం విశేషం. చిన్న నిర్మాతలు చాలా మంది అలాంటి వ్యాఖ్యలు తగదు అంటూ ఎమ్మెల్యే వ్యాఖ్యలను ఖండిస్తున్నారు.పెద్ద ఎత్తున ఎమ్మెల్యే వ్యాఖ్యల విషయమై దుమారం రేపుతున్న నేపథ్యంలో టాలీవుడ్ లోని ఆ నలుగురు ఐదుగురు పెద్ద నిర్మాతలు ఎందుకు స్పందించడం లేదు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు ప్రశ్నిస్తున్నారు. నిజానికి బలిసి కొట్టుకుంటున్న వాళ్లు మాత్రం ఇప్పటి వరకు స్పందించడం లేదు.
ఎవరి గురించి అయితే ఎమ్మెల్యే వ్యాఖ్యలు చేశాడో ఆ నిర్మాతలు మాట్లాడకపోవడం విడ్డూరంగా ఉందని కొందరు కామెంట్ చేస్తున్నారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలను టాలీవుడ్ సినిమా పరిశ్రమకు చెందిన ప్రతి ఒక్కరు కూడా మూకుమ్మడిగా ఖండించాల్సిన అవసరం ఉంది.ఇలాంటి వ్యాఖ్యలను ముందుముందు చిన్న పెద్ద నాయకులు మరిన్ని చేసే అవకాశాలు ఉన్నాయి. కనుక ఈ విషయంలో వెంటనే ఆ పెద్ద నిర్మాతలు స్పందించాల్సిందిగా మీడియా వర్గాల వారు కూడా చర్చించుకుంటున్నారు. ఇప్పటికే వైకాపా ప్రభుత్వం సినిమా పరిశ్రమ కు వ్యతిరేకంగా ఉందనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు ఆ ఎమ్మెల్యేకు మరియు సీఎంకు వ్యతిరేకంగా మాట్లాడితే ఎక్కడ నష్టపోవాల్సి వస్తుందో అనే భయంతో ఎవరూ మాట్లాడటం లేదు అనేది టాక్ వినిపిస్తుంది.
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
This website uses cookies.