Upasana : భారీ ప్రాప‌ర్టీ పై రాం చ‌ర‌ణ్ భార్య క‌న్ను…జీవితా రాజ‌శేక‌ర్ ఓప్పు కుంటేనే ? | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Upasana : భారీ ప్రాప‌ర్టీ పై రాం చ‌ర‌ణ్ భార్య క‌న్ను…జీవితా రాజ‌శేక‌ర్ ఓప్పు కుంటేనే ?

Upasana : మెగా కోడలు.. మెగా పవర్ స్టార్ రాం చరణ్ సతీమణి ఉపాసన ఓ భారీ ప్రాపర్టీ కొనబోతుందనే న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాధారణంగా సినిమా సెలబ్రిటీస్ కి, వారి ఫ్యామిలీ మెంబర్స్ కి కొత్త ప్రాపర్టీస్ కొనడం కొత్తేమి కాదు. కమర్షియల్ కాంప్లెక్స్, బిజినెస్ లు కొత్తవి ఎప్పటి కప్పుడు విస్తరించుకునే పనిలో ఉంటారు. హోటల్ జినిసెస్, బొటెక్స్, ప్రొడక్షన్స్ హౌజెస్ ..ఇలా పలు రకాల బిజినెస్ లతో పాటు […]

 Authored By aruna | The Telugu News | Updated on :24 June 2021,4:12 pm

Upasana : మెగా కోడలు.. మెగా పవర్ స్టార్ రాం చరణ్ సతీమణి ఉపాసన ఓ భారీ ప్రాపర్టీ కొనబోతుందనే న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సాధారణంగా సినిమా సెలబ్రిటీస్ కి, వారి ఫ్యామిలీ మెంబర్స్ కి కొత్త ప్రాపర్టీస్ కొనడం కొత్తేమి కాదు. కమర్షియల్ కాంప్లెక్స్, బిజినెస్ లు కొత్తవి ఎప్పటి కప్పుడు విస్తరించుకునే పనిలో ఉంటారు. హోటల్ జినిసెస్, బొటెక్స్, ప్రొడక్షన్స్ హౌజెస్ ..ఇలా పలు రకాల బిజినెస్ లతో పాటు లాండ్స్, వెంచర్స్ కొనుగోలు చేస్తుంటారు. ఖరీదైన విల్లాలు కొనుగోలు చేయడం, అకేషన్స్ జరుపుకోవడానికి ఫాం హౌజెస్ కొనుగోలు చేయడం వీరికి చాలా కామన్.

upasana to buy jeevitha rajasekhars property

upasana to buy jeevitha rajasekhars property

ఇలానే మెగాస్టార్ చిరంజీవి కోడలు ఉపాసన ఇప్పుడు ఒక ఖరీదైన ప్రాపర్టీని కొనబోతున్నారట. టాలీవుడ్ హీరో రాజశేఖర్, ఆయన భార్య జీవితకు ఫిల్మ్ నగర్ లో ఓ ఖరీదైన ఓపెన్ ల్యాండ్ ఉంది. దానిని డెవలప్మెంట్ కి ఇచ్చేశారు. అక్కడ ఓ కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మించారు. దానికి గాను వారికి నెలనెలా భారీ మొత్తంలో అద్దెలు వస్తుంటాయి. అయితే సొంతగా నిర్మాణానికి, వేరే చోట ఇన్వెస్ట్ చేసేందుకు ఇప్పుడు దానిని అమ్మడానికి రెడీ అయ్యారట. చదరపు అడుగు 1.5 లక్షలు వంతున విక్రయానికి పెట్టినట్లు తెలుస్తోంది. దీనిని కొనడానికి హీరో రామ్ చరణ్ భార్య ఉపాసన ఆసక్తి చూపిస్తున్నట్టు లేటెస్ట్ న్యూస్ ఒకటి ఫిల్మ్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది.

upasana to buy jeevitha rajasekhars property

upasana to buy jeevitha rajasekhars property

Upasana : ఎన్టీఆర్ వంటి ప్రముఖులు ప్రాపర్టీలు కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది.

ప్రస్తుతం వీరి మధ్య బేర సారాలు సాగుతున్నాయని సమాచారం. కాగా ఈ బిల్డింగ్ డెవలపర్ గా ఉన్న ఫీనిక్స్ సంస్థ కూడా తమ వాటాను విక్రయించాలని అనుకుంటుందట. ఇందులో జీవిత రాజశేఖర్ వాటా విలువే రూ.200 కోట్ల వరకు ఉంటుందని అంచనా వేస్తున్నారు. కానీ ఈ భవనంలో అద్దెకు ఉన్నవారు ఖాళీ చేస్తే తప్ప అమ్మడం కుదరదట. ఇదే కాక డెవలపర్ అయిన ఫీనిక్స్ సంస్థ దాని పక్కనే మరో బిల్డింగ్ ను డెవలప్ చేసింది. ఇందులోనే దర్శకుడు త్రివిక్రం కి అత్యంత సన్నిహులు, ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన హారిక అండ్ హాసిని నిర్మాత చినబాబు, టాలీవుడ్ హీరో ఎన్టీఆర్ వంటి ప్రముఖులు ప్రాపర్టీలు కొనుగోలు చేసినట్టు తెలుస్తోంది. ఆ బిల్డింగ్ లో ఉన్న వారిని ఖాళీ ఇళ్లల్లోకి ఫీనిక్స్ బిల్డింగ్ లో ఉన్న వారని షిఫ్ట్ చేసి ఆ తర్వాత అమ్మాలని ప్లాన్ చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు.

ఇది కూడా చ‌ద‌వండి ==> జగన్ గారు మీరే నన్ను ఆదుకోవాలి.. డబ్బుల కోసమే ఆ వీడియోలు చేస్తున్నానంటున్న శ్రీరెడ్డి?

ఇది కూడా చ‌ద‌వండి ==> ప్రకాశ్ రాజ్ నుంచి సోనూ సూద్ వ‌ర‌కు టాలీవుడ్ టాప్ 10 విల‌న్స్ రెమ్యున‌రేష‌న్ ఎంతో తెలుసా..?

ఇది కూడా చ‌ద‌వండి ==> నేను 100 శాతం హాలీవుడ్ సినిమా సీన్స్ కాపీ కొడతా.. అసలు నిజం బయటపెట్టిన ఎస్ఎస్ రాజమౌళి?

ఇది కూడా చ‌ద‌వండి ==> రష్మీ ముందు అడ్డంగా బుక్కయిపోయిన సుధీర్.. రష్మీని వదిలేసి జడ్జి పూర్ణతో రొమాన్స్?

aruna

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది