Janasena : 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ ఏపీలో ఘోరంగా ఓడిపోయింది. ఒక్కటంటే ఒక్కటే ఎమ్మెల్యే సీటును గెలుచుకుంది. రెండు స్థానాల్లో పోటీ చేసిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా రెండు చోట్లా ఓడిపోయారు. జనసేన పార్టీని ఏపీ ప్రజలు ఈ రేంజ్ లో వ్యతిరేకిస్తారని ఎవ్వరూ ఊహించలేదు. 2019 ఎన్నికల్లో జనసేన అధికారంలోకి రాకపోయినా.. కనీసం డిపాజిట్లను అయినా దక్కించుకొని.. కనీసం ఓ 10 నుంచి 20 ఎమ్మెల్యే సీట్లను అయినా గెలుచుకొని.. ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తుందని అంతా భావించారు. పవన్ కూడా ఆ ఉద్దేశంతోనే ఏపీలో ఉన్న దాదాపు అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేశారు. కానీ.. ఫలితం అందరం చూశాం. దీంతో జనసేన పార్టీ ఒక్కసారిగా డీలా పడిపోయింది. పార్టీలో ఉన్న కీలక నేతలు కూడా బయటికి వెళ్లిపోయారు. అయినప్పటికీ.. పవన్ కళ్యాణ్ ఏమాత్రం ధైర్యాన్ని కోల్పోలేదు. తన పని తాను చేసుకుంటూ వెళ్తూనే ఉన్నారు. 2019 ఎన్నికలు ముగిసి రెండు సంవత్సరాలు అయింది.
ఆ తర్వాత మళ్లీ ఏపీలో ఎన్నికలు జరగలేదు. తాజాగా ఏపీలో పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే మూడు విడతల్లో ఎన్నికలు ముగిశాయి. ఈ ఎన్నికల ఫలితాల సరళిని విశ్లేషిస్తే.. గ్రామీణ ప్రాంతాల్లో జనసేన పార్టీ బలంగా ఉంది.. అనే విషయం సుస్పష్టమవుతోంది.
అస్సలు ఎవ్వరూ ఊహించని విధంగా పంచాయతీ ఎన్నికల్లో జనసేన పార్టీ గెలిచి తన సత్తా చాటుతోంది. ఇటీవల జరిగిన మొదటి దశ పంచాయతీ ఎన్నికల్లో జనసేన పార్టీకి 18 శాతానికి పైగా ఓట్లు వచ్చాయి. రెండో విడత ఎన్నికల్లో 22 శాతం ఓట్లు వచ్చాయి.
రెండో దశలో సుమారు 250 సర్పంచ్, ఉపసర్పంచ్ స్థానాలను జనసేన గెలిచింది. 1500 పైగా పంచాయతీల్లో జనసేన రెండో స్థానంలో నిలిచింది. సుమారు 1500 వార్డులను పార్టీ కైవసం చేసుకుంది.
2019 నుంచి 2021 లోనే ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. అప్పుడు జనసేనను ఆదరించని ప్రజలు.. ఇప్పుడు జనసేనను ఆదరిస్తున్నారు. అంటే ఏపీ ప్రజలు.. ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ప్రజలు.. మార్పు కోరుకుంటున్నారు. టీడీపీ పాలన చూశారు… వైసీపీ పాలన చూశారు.. కాంగ్రెస్ పాలన చూశారు. ఈ పార్టీల పాలనలో విసిగిపోయిన ప్రజలు.. ఖచ్చితంగా 2024లో మార్పు కోరుకుంటున్నారు. ఆ మార్పు జనసేనే అని పంచాయతీ ఎన్నికలతో అర్థమయిపోతోంది.
బీజేపీతో జతకట్టినా కూడా జనసేన పార్టీకి ఏమాత్రం కూడా ప్రాముఖ్యత తగ్గలేదు. ఇన్ పాక్ట్ పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో జనసేనకు బ్రహ్మరథం పడుతున్నారు ప్రజలు. ఇది ఇలాగే 2024 వరకు కొనసాగితే.. నో డౌట్.. 2024 ఎన్నికల్లో జనసేన పార్టీ మిగితా పార్టీలకు గట్టి పోటీని ఇవ్వనుంది. ప్రభుత్వ ఏర్పాటులో జనసేన ఖచ్చితంగా ప్రముఖ పాత్ర పోషించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
మొత్తానికి పవన్ కళ్యాణ్ వ్యూహాలు ఫలిస్తున్నాయి. ఇప్పుడిప్పుడే పార్టీని జనాలు ఆదరిస్తున్నారు. ఇలాగే పవన్ కళ్యాణ్ కూడా ప్రజలతో మమేకం అవుతూ.. ప్రజా సమస్యలపై పోరాడితే.. 2024 లో జనసేన అధికారంలోకి వచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదంటున్నారు విశ్లేషకులు.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.