Health Tips : ఈ లక్షణాలు కనిపిస్తే… కిడ్నీలో స్టోన్స్ వచ్చినట్లే… ఈ విధంగా ముందే జాగ్రత్త వహించండి…

Authored By aruna | The Telugu News | Updated on : 26 August 2022, 7:00 am

Health Tips : ప్రస్తుతం ఉన్న జీవన విధానంలో కొన్ని ఆహార మార్పులు వలన ఎన్నో రోగాలు చుట్టుముడుతున్నాయి. అలాంటి వాటిలో ఒకటి కిడ్నీలో రాళ్ల సమస్య ఒకటి. శరీరంలో ప్రధానమైన అవయవాలలో కిడ్నీ అనేది ఒకటి. ఈ కిడ్నీ బ్లడ్ ని శుభ్రపరచడానికి ప్రధాన పాత్ర పోషిస్తుంది. అదేవిధంగా శరీరంలో ఉండేటువంటి వ్యర్ధాలను బయటికి నెట్టి వేస్తుంది. అయితే ఈ సమస్యతో ప్రస్తుతం చాలామంది బాధపడుతున్నారు. ఈ వ్యాధికి కారణం ఆహారములోని కొన్ని మార్పులు, చాలామంది బయట ఫుడ్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. దీనికి ఇదే ముఖ్య కారణం అవుతుంది. ఎంతోమంది ఈ కిడ్నీలో రాళ్ల సమస్యతో బాధపడుతున్నారు. కిడ్నీలలో స్టోన్స్ సైజును బట్టి చికిత్సను అందజేస్తూ వాటిని తొలగిస్తుంటారు. అయితే ఇప్పుడు కిడ్నీలలో స్టోన్స్ లక్షణాలను కనుక గుర్తిస్తే ఎటువంటి ట్రీట్మెంట్ లేకుండానే ఈ స్టోన్స్ ను నాచురల్ గా తొలగించవచ్చు. మరి అదేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

కడుపులో నొప్పి : కిడ్నీ స్టోన్స్ వలన శరీరంలో కొన్నిచోట్ల నొప్పిని కలిగిస్తుంది. ఈ సమస్యతో బాధపడే వారిలో ఎక్కువగా పొత్తికడుపు వెనుక తీవ్రమైన నొప్పి కలిగి ఉంటుంది. అలాగే మూత్ర విసర్జన జరిగినప్పుడు బ్లడ్ కూడా రావచ్చు. దీనిని హేమాటోరియా అని అంటారు. ఈ బ్లడ్ గోధుమ రంగులో, ఎరుపు, గులాబీ, రంగులలో ఉంటుంది. మూత్ర ఇన్ఫెక్షన్ వలన త్రీ వరమైన మంట వస్తుంది. అదేవిధంగా జ్వరం కూడా రావచ్చు. సడన్గా చెమటలు మొదలవుతాయి. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే అస్సలు ఆలస్యం లేకుండా వైద్యులను కలవాలి.

Health Tips If these Symptoms Appear Like Kidney Stones, Take Care In this way...

Health Tips If these Symptoms Appear Like Kidney Stones, Take Care In this way…

రెమిడి : కిడ్నీలో స్టోన్స్ రాకుండా ఉండాలి అంటే మిమ్మల్ని మీరు హైడ్రేట్ గా ఉంచుకోవాలి. నిత్యము ఐదు, ఆరు గ్లాసుల నీటిని తీసుకోవాలి. ఆహారంలో సోడియం ఎక్కువగా ఉండేలా చూసుకోవాలి. అధికంగా గింజలు ఉన్న కూరగాయలు, పండ్లను వాడకం తగ్గించాలి. అయితే తులసిటి తీసుకోవడం వలన ఈ సమస్య వల్ల వచ్చే నొప్పిని నుంచి ఉపశమనం కలిగిస్తుంది. అదేవిధంగా ఈ తులసి ఆకులలో కొన్ని రకాల వ్యాధులు కూడా దూరమవుతాయి. ఈ తులసిలో విటమిన్ బి పుష్కలంగా ఉంటుంది. ఇది కిడ్నీల స్టోన్ వ్యాధిని దూరం చేస్తుంది. ఆహారంలో పుల్లని, ఉప్పుతోపాటు రుచిని కూడా ఉంచుతుంది. ఈ ఆకులను నిత్యము తీసుకోవచ్చు ఉదయాన్నే పరిగడుపున గోరువెచ్చని నీటిలో తీసుకొని దీని తిన్నట్లయితే ఈ కిడ్నీ లో రాళ్ల సమస్య నుండి కాపాడుతుంది. అదేవిధంగా ఉల్లిపాయను పచ్చిగా తీసుకోవాలి. ఉల్లిపాయ రసాన్ని నిత్యం ఒకటి ,రెండు స్పూన్ల తీసుకున్నట్లయితే కిడ్నీలలో స్టోన్స్ సమస్య నుంచి ఉపశమనం కలుగుతుంది. అలాగే ద్రాక్ష దీనిలో నీరు, పొటాషియం అధికంగా ఉంటాయి. ఈ ద్రాక్ష రసంలో సోడియం క్లోరైడ్ అతి తక్కువగా ఉంటాయి. అదేవిధంగా జామపండు తీసుకోవడం వలన కూడా ఈ కిడ్నీ స్టోన్ సమస్య నుంచి బయటపడవచ్చు.

Advertisement

aruna

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి