Men : కేవలం పురుషులకే ఈ పండు… వీరు తింటే మస్తు మంచిదట… నిపుణులు ఏమంటున్నారో తెలుసా…? | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Men : కేవలం పురుషులకే ఈ పండు… వీరు తింటే మస్తు మంచిదట… నిపుణులు ఏమంటున్నారో తెలుసా…?

 Authored By ramu | The Telugu News | Updated on :20 June 2025,9:00 pm

ప్రధానాంశాలు:

  •  Men : కేవలం పురుషులకే ఈ పండు... వీరు తింటే మస్తు మంచిదట... నిపుణులు ఏమంటున్నారో తెలుసా...?

Men: ఈ పండుకు ఎంతో ప్రత్యేకత ఉంది. ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.ఈ పండు పేరు అంజీర్. ఈ పండు ప్రత్యేకమైనది కూడా. ఇది చూడడానికి మామూలుగా కనిపించిన ఇందులో ఔషధ గుణాలు ఊహించలేనంత ఉన్నాయి. ముఖ్యంగా ఈ అంజీర్ పండు మహిళల కంటే కూడా పురుషుల్లోనే ఎక్కువ ఆరోగ్యానికి కావలసిన పోషకాలు బలోపేతం చేయటానికి ఈ పండు చాలా సహకరిస్తుంది అని నిపుణులు తెలియజేస్తున్నారు.

Men కేవలం పురుషులకే ఈ పండు వీరు తింటే మస్తు మంచిదట నిపుణులు ఏమంటున్నారో తెలుసా

Men : కేవలం పురుషులకే ఈ పండు… వీరు తింటే మస్తు మంచిదట… నిపుణులు ఏమంటున్నారో తెలుసా…?

Men అంజీర పండు పురుషులకు ఆరోగ్యం

అంజీర్ పండులో సహజంగానే శక్తినిచ్చే విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్లు ఉంటాయి. శరీర శక్తిని పెంచడమే కాకుండా, శరీరంలో అన్ని వ్యవస్థలకు సమతుల్యం చేయగలదు.ఇందులో జింక్ అనే ఖనిజం పురుషుల్లో టెస్టోస్టిరాన్ హార్మోన్ ను ఉత్తేజపరుస్తుంది. ఇది ముఖ్యంగా పురుషుల సంతానోత్పత్తి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ముఖ్యపాత్రను పోషిస్తుంది అంటున్నారు వైద్య నిపుణులు. జీరా పండులో యాంటీ ఆక్సిడెంట్లు ఉండుట చేత రక్తనాళాలలో కొవ్వు గడ్డలు ఏర్పడకుండా నిరోధిస్తుంది దీనివల్ల గుండె సంబంధిత సమస్యలు రాకుంటా ఉంటాయి ఇందులో ఉండే పొటాషియం రక్తపోటును అదుపులో ఉంచుతుంది. గుండెను ఆరోగ్యంగా ఉంచుతుంది. విటమిన్ b6,ఎక్కువగా ఉంటుంది. మెదడును హార్మోన్ల సమతుల్యతను మెరుగుపరిచి, మెదడు పనితీరును చురుగ్గా ఉంచేలా చేస్తుంది. దానివల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుంది. మంచి ఏకాగ్రత కూడా పెరుగుతుంది.

జీరా పండులో నెమ్మదిగా జీర్ణమయ్యే ఫైబర్ ఉంటుంది. కడుపును శుభ్రం చేస్తుంది. మలబద్ధకం రాకుండా నివారిస్తుంది. గ్యాస్,అసిటిటీ వంటి సమస్యలను తగ్గించడానికి సహజ చికిత్సగా పనిచేస్తుంది.
నిద్ర లేని సమస్యతో బాధపడే వారికి,అంజీర పండు ఒక సహాయకారి అని చెప్పవచ్చు. ఇందులో, మెగ్నీషియం,ట్రీప్టో ఫామ్ శరీరాన్ని విశ్రాంతి స్థితికి తీసుకెళ్లి నిద్రను మెరుగుపరుస్తుంది. జీరా పండులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల హిమోగ్లోబిన్ స్టైల్ పెరుగుతాయి. రక్తహీనత నివారించబడుతుంది. శరీరానికి కావలసిన శక్తి సమకూరుస్తుంది. అలసట నీరసం లాంటి లక్షణాలు తగ్గిపోతాయి.
రాత్రి సమయంలో 2 లేదా 3 ఎండిన అంజీర్ పండ్లను,ఒక గ్లాస్ పాలలో నానబెట్టి.ఉదయం ఖాళీ పొట్టతో తీసుకోవాలి.ఇలా తీసుకుంటే శరీరానికి పూర్తిగా శక్తి అందుతుంది.చలికాలంలో వేడిపాలలో వేసుకొని తింటే మంచిది.బాదం వాల్ నట్స్ తో కలిపి తింటే మరీ మంచిది. అని చెబుతున్నారు నిపుణులు.

ramu

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది