Uppal : ఉప్ప‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో చెరువుల‌కు మ‌హార్ధ‌శ‌.. రూ.102 కోట్ల అభివృద్ధి ప్రణాళిక..! | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Uppal : ఉప్ప‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో చెరువుల‌కు మ‌హార్ధ‌శ‌.. రూ.102 కోట్ల అభివృద్ధి ప్రణాళిక..!

 Authored By prabhas | The Telugu News | Updated on :24 March 2026,5:30 pm

ప్రధానాంశాలు:

  •  Uppal : ఉప్ప‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో చెరువుల‌కు మ‌హార్ధ‌శ‌.. రూ.102 కోట్ల అభివృద్ధి ప్రణాళిక..!

Uppal : ఉప్పల్ నియోజకవర్గంలో చెరువుల అభివృద్ధి, సుందరీకరణకు ప్రభుత్వం భారీగా నిధులు కేటాయించింది. మొత్తం రూ.102 కోట్ల వ్యయంతో చెరువులను పునరుద్ధరించడంతో పాటు ఆధునికంగా తీర్చిదిద్దే పనులు చేపడుతున్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్ మందుముల పరమేశ్వర్ రెడ్డి వెల్లడించారు. చెరువుల శుభ్రత, నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచడం, పర్యావరణ పరిరక్షణకు తోడ్పడే విధంగా ఈ పనులు కొనసాగుతున్నాయని ఆయన పేర్కొన్నారు. ప్రజలకు విశ్రాంతి కేంద్రాలుగా మారేలా చెరువుల చుట్టూ వాకింగ్ ట్రాక్‌లు, లైటింగ్, హరితవనాలు కూడా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్, పరమేశ్వర్ రెడ్డి ఆహ్వానం మేరకు నాచారం (హెచ్‌ఎంటీ నగర్) పెద్ద చెరువును సందర్శించారు. ఈ సందర్భంగా చెరువు అభివృద్ధి పనులను త్వరలో ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు. ముఖ్యంగా నాచారం చెరువు కోసం రూ.30 కోట్ల నిధులు కేటాయించబడినట్లు తెలిపారు. ఈ పనుల ద్వారా చెరువు చుట్టూ ఆకర్షణీయ వాతావరణం సృష్టించడంతో పాటు నీటి కాలుష్యాన్ని తగ్గించే చర్యలు చేపడతామని పేర్కొన్నారు. చెరువులను కేవలం నీటి వనరులుగా కాకుండా, ప్రజలకు ఉపయోగపడే పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయడం లక్ష్యంగా ఉందన్నారు.

Rs 102 crore development plan for ponds in Uppal constituency

Rs. 102 crore development plan for ponds in Uppal constituency..!

నాలుగు చెరువులపై మొదటి దశలో పనులు

ఉప్పల్ నియోజకవర్గంలో మొదటి దశలో నాలుగు ప్రధాన చెరువుల అభివృద్ధికి నిధులు మంజూరు అయ్యాయి. ఉప్పల్ నల్ల చెరువుకు రూ.20 కోట్లు, నాచారం చెరువుకు రూ.30 కోట్లు, కాప్రా చెరువుకు రూ.35 కోట్లు, రామంతాపూర్ పెద్ద చెరువుకు రూ.17 కోట్లు కేటాయించబడ్డాయి. ఇప్పటికే ఉప్పల్ నల్ల చెరువులో పనులు ప్రారంభమై తుది దశకు చేరుకున్నాయని అధికారులు తెలిపారు. మిగతా చెరువుల్లో కూడా త్వరలో పనులు ప్రారంభమవుతాయని చెప్పారు. ఈ ప్రాజెక్టులు పూర్తయ్యాక ప్రాంతంలో భూగర్భ జలాల స్థాయి పెరగడంతో పాటు, వర్షపు నీటిని సమర్థంగా నిల్వ చేయగల సామర్థ్యం పెరుగుతుంది. అలాగే చెరువుల చుట్టూ పచ్చదనం పెరగడం వల్ల స్థానిక ప్రజలకు ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుంది. ఈ కార్యక్రమంలో HMT కాలనీ ప్రధాన కార్యదర్శి రామకోటేశ్వరరావు ,రవీందర్ రెడ్డి సీనియర్ కాంగ్రెస్ నాయకులు కృష్ణారెడ్డి, హెచ్‌ఆర్ మోహన్ ప్రకాష్ రెడ్డి ,అశ్వద్ధామ రెడ్డి, భావన గౌడ్ ,మహేష్ యాదవ్, రమేష్ గౌడ్ ,నూతలకంటి రాజు, సంతోష్ రెడ్డి, రాజి రెడ్డి, కృష్ణ యాదవ్, వెంకట్ రెడ్డి, వెంకట్ గౌడ్, తుంగ తిరుపతి, సూర్య యాదవ్, కేయూం జకీమ్, అబ్రహం, ఇక చిలకనగర్ డివిజన్ కాంగ్రెస్ నాయకులు చెన్ రెడ్డి రఘుపతి రెడ్డి ,బజాజ్ జగన్ గౌడ్,ఆకిటి ఆగం రెడ్డి, చిలకనగర్ డివిజన్ అధ్యక్షులు ముల్కాపల్లి రాజేష్ ముదిరాజ్,కొంపల్లి బాలరాజ్ ,ముదిరాజ్, నల్లవెల్లి మహేందర్ ముదిరాజ్ ,బొట్టు రాజేష్ ,పల్లె రమేష్ గౌడ్, మంచాల రఘు ,రాధాకృష్ణ , శంకర్ ,గణేష్, కిరణ్ ,జగదీష్ ముదిరాజ్ ,తిరుపాటి జంగయ్య ,శ్రీరాములు, శ్రావణ్ ,డేవిడ్ ,రాము గౌడ్, అమరేశ్వరి ,సుశీలమ్మ ,గీత, సమత, సంతోష్, వంశీ, తదితరులు పాల్గొన్నారు. వారు ఈ అభివృద్ధి కార్యక్రమాలను స్వాగతిస్తూ, త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. చెరువుల అభివృద్ధి ద్వారా ఉప్పల్ ప్రాంతం మరింత ఆకర్షణీయంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
 

prabhas

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది