Blind Woman : ఆ మహిళకు కంటి చూపు లేదు. ఏం చూడలేదు. చుట్టూ చీకటి. కానీ.. తన జీవితంలో ఆ చీకటి ఉండకూడదని ధైర్యం తెచ్చుకొని ఆ మహిళ జీవితంలో ఒక స్థానంలో నిలబడింది. అందుకే ఇప్పుడు మనం ఆ మహిళ గురించి మాట్లాడుకుంటున్నాం. చిన్న సమస్య వస్తేనే ఇక తమ జీవితం అయిపోయిందని అనుకుంటారు. తమ జీవితం ముగిసిపోయిందని అనుకుంటారు. అన్నీ సరిగ్గా ఉన్నా కూడా జీవితంలో ఏం చేయలేక జీవితంలో సక్సెస్ కాలేకపోతారు. కానీ.. ఈ మహిళ మాత్రం కంటి చూపు లేకపోయినా కూడా బ్రెయిలీ నేర్చుకొని జూనియర్ లెక్చరర్ గా ఉద్యోగం సాధించింది. అందరికీ ఆదర్శంగా నిలిచింది ఆ మహిళ.
అనంతపురానికి చెందిన అనిత ఐదో తరగతి వరకు కంటి చూపుతోనే ఉండేది. తను 5 వ తరగతిలో ఉన్నప్పుడు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో తను కంటి చూపు కోల్పోవడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కంటి చూపు రాలేదు. అయినా కూడా తన ధైర్యాన్ని కోల్పోలేదు. జీవితంలో సక్సెస్ సాధించడానికి ఏదీ అడ్డు కాదు అని చాటి చెప్పారు అనిత.తనకు నరాలు వీక్ అవడంతో పూర్తిగా కంటి చూపు కోల్పోయింది అనిత. తనకు సర్జరీ చేసినా కూడా కంటి చూపు రాలేదు. ఆ తర్వాత తనకు ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ తర్వాత బ్రెయిలీ లిపి గురించి తెలుసుకొని హిందూపురంలో ప్రత్యేకంగా బ్రెయిలీ లిపీ నేర్పించే పాఠశాలలో చేరి బ్రెయిలీ లిపీ నేర్చుకుంది అనిత.
అలా డిగ్రీ ఫస్టియర్ చదువుతున్నప్పుడే తనకు చాలా ఉద్యోగాలు వచ్చాయి. చివరకు తను జూనియర్ లెక్చరర్ గా ప్రస్తుతం ప్రభుత్వ కాలేజీలో చదువు చెబుతూ అందరికీ ఆదర్శంగా నిలుస్తోంది అనిత. అన్నీ ఉన్నా ఏం చేయలేక కుంటి సాకులు చెప్పే వాళ్లు అనితను చూసి కాస్తో కూస్తో స్ఫూర్తి పొందాలి. కష్టపడితే ఏదైనా సాధ్యం అని అనిత నిరూపించింది.
Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం సక్సెస్ ఫుల్గా సాగుతుంది.…
Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…
Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
This website uses cookies.