PM Viksit Bharat Rojgar Yojana : 3.5 కోట్ల కొత్త ఉద్యోగాలు ..నిరుద్యోగులకు పండగే !!
PM Viksit Bharat Rojgar Yojana : భారత ప్రభుత్వం యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు, కొత్తగా ఉద్యోగాల్లో చేరేవారికి ప్రోత్సాహకాలు అందించేందుకు ప్రధాన మంత్రి విక్షిత్ భారత్ రోజ్గార్ యోజన (PMVBRY) ను ప్రారంభించింది. జూలై 1, 2025న కేబినెట్ ఆమోదం పొందిన ఈ పథకం ఆగస్టు 1, 2025 నుంచి అమల్లోకి వచ్చింది. రూ. 1 లక్ష కోట్ల భారీ బడ్జెట్తో ప్రారంభమైన ఈ పథకం రెండు సంవత్సరాలు కొనసాగనుంది. ఈ కాలంలో సుమారు 3.5 కోట్ల కొత్త ఉద్యోగాల సృష్టి లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రి మన్సుఖ్ ఎల్. మాండవియా తెలిపారు.

#image_title
ఈ పథకం రెండు భాగాలుగా ఉంటుంది – పార్ట్ A మరియు పార్ట్ B. పార్ట్ A కింద మొదటిసారి ఉద్యోగంలో చేరుతున్న వారికి ఆర్థిక మద్దతు ఇవ్వబడుతుంది. ప్రతి కొత్త ఉద్యోగికి ఒక నెల ప్రాథమిక వేతనం + DAకి సమానమైన వన్-టైమ్ ప్రోత్సాహకం లభిస్తుంది, గరిష్టంగా రూ.15,000 వరకు. ఈ మొత్తం రెండు విడతలుగా చెల్లించబడుతుంది. మరోవైపు, పార్ట్ B కింద యజమానులకు కొత్తగా నియమించిన ప్రతి ఉద్యోగి కోసం నెలకు రూ.1,000 నుంచి రూ. 3,000 వరకు ప్రోత్సాహకాలు లభిస్తాయి. ఉద్యోగి వేతనానికి అనుగుణంగా ఈ ప్రోత్సాహకాలను మూడు స్లాబ్లుగా విభజించారు.
ఈ పథకం కింద 50 మందికి తక్కువ ఉద్యోగులు ఉన్న సంస్థలు కనీసం 2 మందిని, 50 మందికి పైగా ఉద్యోగులు ఉన్న సంస్థలు కనీసం 5 మందిని అదనంగా నియమించాలి. కొత్తగా నియమితులైన ఉద్యోగులు కనీసం ఆరు నెలలు కొనసాగాలి. ఉద్యోగులు అధికారిక వెబ్సైట్ pmviksitbharatrozgaryojana.com లేదా UMANG యాప్ ద్వారా నమోదు చేసుకోవచ్చు. సంస్థలు తమ ఉద్యోగుల కోసం ఎలక్ట్రానిక్ చలాన్-కమ్-రిటర్న్ (ECR) ఫైల్ చేసి, UANలను సృష్టించాలి. ఈ పథకం విజయవంతమైతే దేశంలో ఉపాధి అవకాశాలు పెరిగి, యువతకు కొత్త భవిష్యత్ మార్గాలు ఉండనున్నాయి.