సెప్టెంబర్ 5.. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఉపాధ్యాయులందరికీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ శుభాకాంక్షలు తెలిపారు. కరీంనగర్లోని మంత్రి క్యాంప్ కార్యాలయం నుంచి ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. అధ్యాపక వృత్తికి వన్నె తెచ్చిన మహనీయుడు సర్వేపల్లి రాధాకృష్ణ అని మంత్రి గంగుల తెలిపారు.
మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణ స్ఫూర్తితో ఉపాధ్యాయులందరూ విద్యార్థుల భవిష్యత్తు కోసం కృషి చేయాలని మంత్రి కమలాకర్ సూచించారు. విద్యార్థులు సైతం గురువుల పట్ల గౌరవాభిమానాలు కలిగి ఉండాలని కమలాకర్ చెప్పారు. తల్లిదండ్రులు, విద్య నేర్పిన గురువులను ఎప్పుడూ మరిచిపోవద్దని పేర్కొన్నారు. టీచర్ అయిన సర్వేపల్లి రాధాకృష్ణ దేశ రాష్ట్రపతి పదవిని అలంకరించి, ఆ పదవికే వన్నె తెచ్చారని మంత్రి గంగుల కమలాకర్ వివరించారు. ఇకపోతే రాష్ట్రంలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన వారిని ఆయా ప్రాంతాల్లో విద్యార్థులు, అధికారులు సన్మానించారు.
Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…
Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
Breakfast : మనం తీసుకునే ఆహారమే మన శరీరాన్ని కూడా ప్రభావితం చేస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే మనం తీసుకునే అల్పాహారం.…
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
This website uses cookies.