Karimnagar..రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తే చర్యలు: డీసీపీ శ్రీనివాస్ | The Telugu News : Latest Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు | బ్రేకింగ్ న్యూస్ తెలుగు

Karimnagar..రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తే చర్యలు: డీసీపీ శ్రీనివాస్

తెలంగాణలో హుజురాబాద్ ఉప ఎన్నిక గురించి తెలంగాణ ప్రజానీకం అంతా వెయిట్ చేస్తున్న సంగతి అందరికీ విదితమే. మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో హుజురాబాద్ బై పోల్ అనివార్యమైంది. కాగా ఈ ఉప ఎన్నికను అధికార టీఆర్ఎస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. ఈ క్రమంలోనే హుజురాబాద్ నియోజకవర్గంలో నేతలు రెచ్చగొట్టే ప్రసంగాలు చేయొద్దని డీసీపీ శ్రీనివాస్ శనివారం తెలిపారు. పార్టీల నాయకులు సామరస్యంగా ప్రచారం నిర్వహించుకోవాలని సూచించారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎవరు చేసినా సెక్షన్ […]

 Authored By praveen | The Telugu News | Updated on :11 September 2021,6:30 pm

తెలంగాణలో హుజురాబాద్ ఉప ఎన్నిక గురించి తెలంగాణ ప్రజానీకం అంతా వెయిట్ చేస్తున్న సంగతి అందరికీ విదితమే. మాజీ మంత్రి ఈటల రాజేందర్ రాజీనామాతో హుజురాబాద్ బై పోల్ అనివార్యమైంది. కాగా ఈ ఉప ఎన్నికను అధికార టీఆర్ఎస్ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నది. ఈ క్రమంలోనే హుజురాబాద్ నియోజకవర్గంలో నేతలు రెచ్చగొట్టే ప్రసంగాలు చేయొద్దని డీసీపీ శ్రీనివాస్ శనివారం తెలిపారు. పార్టీల నాయకులు సామరస్యంగా ప్రచారం నిర్వహించుకోవాలని సూచించారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎవరు చేసినా సెక్షన్ 107 కింద కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఎన్నికల సమయంలో ఈ కేసునమోదు అయితే ఎప్పుడు ఎలక్షన్ వచ్చినా జీవిత కాలం బైండోవర్ కావలసి ఉంటుందని వివరించారు.

హుజురాబాద్ ఉప ఎన్నిక ఇప్పట్లో ఉండే చాన్స్ లేదని తెలుస్తోంది. అధికార టీఆర్ఎస్ పార్టీ తరఫున విద్యార్థి నేత గెల్లు శ్రీనివాస్ యాదవ్ బరిలో ఉండగా, బీజేపీ తరఫున మాజీ మంత్రి ఈటల రాజేందర్ నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తున్నారు.

 

praveen

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది