PM Kisan : హోలీ పండుగ వేళ రైతన్నలకు శుభవార్త .. మీ అకౌంట్లలోకి పీఎం కిసాన్ డబ్బులు జమ ..!
ప్రధానాంశాలు:
PM Kisan : పండుగ వేళ రైతన్నలకు శుభవార్త .. మీ అకౌంట్లలోకి పీఎం కిసాన్ డబ్బులు జమ ..!
PM Kisan : దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులు ఎదురుచూస్తున్న పీఎం కిసాన్ నగదు విడుదలపై కీలక సమాచారం వెలువడుతోంది. కేంద్ర ప్రభుత్వం మరో 10 రోజుల్లోగా 22వ విడత నిధులను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు విశ్వసనీయ వర్గాలు సూచిస్తున్నాయి. ఈ విడతలో భాగంగా అర్హులైన ప్రతి రైతు ఖాతాలో రూ.2,000 చొప్పున జమ చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ నిధులను ప్రధాని నరేంద్ర మోడీ స్వయంగా బటన్ నొక్కి విడుదల చేయనున్నారని తెలుస్తోంది. మార్చి 3న జరగనున్న హోలీ పండుగకు ముందు ఈ మొత్తాన్ని రైతుల ఖాతాల్లో జమ చేయాలని కేంద్రం భావిస్తున్నట్లు సమాచారం. హోలీ కానుకగా ఈ నగదు అందించే అవకాశముందని అధికార వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ విషయంపై అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు. రైతులు గత కొన్ని వారాలుగా ఈ విడత కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పండుగ సమయానికి నగదు అందితే విత్తనాలు, ఎరువులు, ఇతర వ్యవసాయ అవసరాలకు ఉపయోగపడుతుందని వారు భావిస్తున్నారు.
PM Kisan : హోలీ పండుగ వేళ రైతన్నలకు శుభవార్త .. మీ అకౌంట్లలోకి పీఎం కిసాన్ డబ్బులు జమ ..!
PM Kisan : ఈకేవైసీ పూర్తి చేయడం తప్పనిసరి
పీఎం కిసాన్ నిధులు ఖాతాల్లో జమ కావాలంటే ఈకేవైసీ (e-KYC) ప్రక్రియ పూర్తి చేయడం అత్యంత కీలకం. ఈకేవైసీ పూర్తి చేయని రైతుల ఖాతాల్లో నగదు జమ కావడం లేదు. అటువంటి సందర్భాల్లో చెల్లింపులు నిలిపివేయబడే అవకాశం ఉంటుంది. రైతులు సమీపంలోని సీఎస్సీ సెంటర్కు వెళ్లి ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకోవచ్చు. ఇందుకు పట్టాదారు పాస్బుక్, ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా పాస్బుక్ తీసుకెళ్లడం అవసరం. అదేవిధంగా, ఇంటి నుంచే అధికారిక పీఎం కిసాన్ పోర్టల్ లేదా మొబైల్ యాప్ ద్వారా కూడా ఈకేవైసీ పూర్తి చేసుకునే సౌకర్యం ఉంది. కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఈకేవైసీని తప్పనిసరిగా పూర్తి చేసుకోవాలని రైతులకు సూచిస్తోంది. ఒకసారి ఈ ప్రక్రియ పూర్తి అయితే తదుపరి విడతలు ఆటోమేటిక్గా ఖాతాలో జమ అవుతాయి.
PM Kisan : నగదు జమ కాకపోతే ఏం చేయాలి?
పీఎం కిసాన్ నిధులు విడుదలైన తర్వాత కూడా మీ ఖాతాలో నగదు జమ కాకపోతే వెంటనే స్పందించాలి. ముందుగా పీఎం కిసాన్ పోర్టల్ లేదా యాప్లో లాగిన్ అయి మీ చెల్లింపు స్థితిని పరిశీలించాలి. అక్కడ మీ దరఖాస్తులో ఏమైనా లోపాలు ఉన్నాయా, బ్యాంక్ వివరాలు సరైందిగా ఉన్నాయా అనే విషయాలు తెలుసుకోవచ్చు. అలాగే, మీ మండల వ్యవసాయ శాఖ అధికారులను సంప్రదించి సమస్య వివరాలు తెలియజేయాలి. అవసరమైన పత్రాలు సమర్పించి లోపాలను సరిచేసుకుంటే మీరు అర్హులైతే తదుపరి చెల్లింపులో నగదు పొందే అవకాశం ఉంటుంది. రైతులకు ఆర్థిక భరోసా కల్పించడమే లక్ష్యంగా అమలు చేస్తున్న పీఎం కిసాన్ పథకం కింద సంవత్సరానికి రూ.6,000 మూడు విడతలుగా జమ అవుతోంది. అందువల్ల అర్హులైన ప్రతి రైతు తప్పనిసరిగా ఈకేవైసీ పూర్తి చేసి వివరాలు సక్రమంగా ఉన్నాయో లేదో పరిశీలించుకోవడం అవసరం. హోలీ పండుగకు ముందే 22వ విడత జమైతే రైతులకు ఇది నిజమైన పండుగ కానుకగా మారనుంది.