Times Now Survey : అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నగారా మ్రోగిన నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. మొత్తం అయిదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నా కూడా దేశం మొత్తం కూడా పశ్చిమ బెంగాల్ మరియు తమిళనాడు రాష్ట్రాల వైపు చూస్తున్నాయి. ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల సరళి ఎలా ఉండబోతుంది. ఓటర్లు ఎలా తీర్పు ఇవ్వబోతున్నారు అనేది అందరు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సమయంలోనే అయిదు రాష్ట్రాల్లో బీజేపీ జెండా పాతేందుకు తీవ్ర కసరత్తు అయితే చేస్తోంది. ముఖ్యంగా పశ్చిమబెంగాల్ పై ప్రధాని మరియు హోమ్ ఇద్దరు కూడా చాలా ఫోకస్ పెట్టిన విషయం తెల్సిందే. ఈ అయిదు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగబోతున్న నేపథ్యంలో ఏ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి రాబోతుంది అనే విషయమై ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేని ఒక ప్రైవేట్ మీడియా సంస్థ సర్వే చేసింది. ఆ సర్వే రిపోర్ట్ సారాంశంను మీ ముందుకు తీసుకు వచ్చాం.
వరుసగా రెండు సార్లు అధికారం దక్కించుకున్న దీదీ మమత బెనర్జీపై జనాల్లో కాస్త వ్యతిరేకత అయితే ఉంది. కాని ఆమెను ఓడించేంత వ్యతిరేకత లేదు అనేది సర్వే రిపోర్ట్. అక్కడ బీజేపీ అధికారం దక్కించుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు అయితే చేస్తోంది. కాని ఆ ప్రయత్నాలు రెండవ స్థానంతో సరిపెట్టుకోవాల్సి రావచ్చు. ఇక బెంగాల్ లో దీదీ మూడవ సారి అధికార పగ్గాలు దక్కించుకోవడం ఖాయం అయ్యింది అంటూ సర్వేలో పేర్కొన్నారు.
తమిళనాట ఇప్పటి వరకు అమ్మ పార్టీ అయ్య పార్టీలు మాత్రమే అధికారం దక్కించుకుంటూ వచ్చాయి. ఈసారి కూడా ఆ రెండు పార్టీల మద్యే పోటీ ఉంది. బీజేపీ మరియు అన్నాడీఎంకే పార్టీలు కలిసి అధికారం దక్కించుకునే ప్రయత్నం చేస్తున్నా కూడా ఆ ప్రయత్నాలు ఏమీ సఫలం అయ్యేలా కనిపించడం లేదు. కమల్ హాసన్ కూడా ఏదో ప్రయత్నం అయితే చేస్తున్నాడు కాని ఆయన్ను జనాలు పట్టించుకోవడం లేదు. కరుణానిధి తనయుడు స్టాలిన్ సీఎంగా ఈసారి మొదటి సారి ప్రమాణ స్వీకారం చేయడం ఖాయం అంటూ సర్వే రిపోర్ట్ వచ్చింది.
కేరళ రాష్ట్రంలో కాంగ్రెస్ మరియు బీజేపీలకు కాకుండా వామపక్షంకు మళ్లీ అధికారం దక్కబోతుంది. సీపీఎం నేతృత్వంలోని కూటమి ఎన్నికల్లో విజయాన్ని సొంతం చేసుకుంటుందని సర్వే ఫలితాలను బట్టి అర్థం అవుతుంది.
126 అసెంబ్లీ స్థానాలు ఉన్న అస్సోంలో బీజేపీ మరియు కాంగ్రెస్ లు హోరా హోరీగా పోరాడే అవకాశం కనిపిస్తుంది. కాస్త అటు ఇటుగా ఎన్డీయేకు మెజార్టీ సీట్లు వచ్చినా అధికారం దక్కించుకునే స్థాయిలో వస్తాయా అంటే అనుమానమే అన్నట్లుగా ఉంది.
30 అసెంబ్లీ సీట్లు ఉన్న పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే కూటమి విజయాన్ని సొంతం చేసుకుంటుందని అంటున్నారు. కాంగ్రెస్ పార్టీపై ఉన్న వ్యతిరేకత కారణంగా అక్కడ అసెంబ్లీలో ఎన్డీయేకు బాధ్యతలు ఇవ్వాలని ప్రజలు నిర్ణయించుకున్నట్లుగా సర్వేలో వెళ్లడయ్యింది.
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.