7th Pay Commission : గుడ్ న్యూస్.. త్వరలో కనీస వేతనాలు పెరిగే ఛాన్స్
7th Pay Commission : గత కొన్నాళ్లుగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. పలు మీడియాలలో అనేక రకాల వార్తలు వినిపిస్తున్నాయి.ఇక ప్రభుత్వం ఇటీవల డీఏను 31 శాతం నుంచి 34 శాతానికి పెంచింది. ఆ తర్వాత కనీస మూల వేతనాన్ని కూడా పెంచుతుందనే అంచనాలు పెరిగాయి. కనీస వేతనం వచ్చేసి రూ.18 వేల నుంచి రూ.26 వేలకు పెంచాలని ఇంకా ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ 2.57 రెట్ల నుంచి 3.68 రెట్లు పెంచాలని కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘాలు చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నాయి. ప్రస్తుతం ఈ ఉద్యోగులకు ఫిట్మెంట్ ఫ్యాక్టర్ కింద 2.57 శాతం జీతం లభిస్తుండగా అది మొత్తం 3.68 శాతానికి పెరుగుతుంది. ఇప్పుడు ఉద్యోగుల కనీస వేతనం వచ్చేసి దాదాపు రూ.8,000 పెరుగుతుంది.
అంటే ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతనం రూ.18,000 నుంచి రూ.26,000కి పెరగనుంది. ప్రస్తుతం కనీస మూల వేతనం వచ్చేసి మొత్తం రూ.18,000 ఉండగా దానిని రూ.26000కు పెంచాల్సి ఉంటుంది.ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగుల కనీస వేతనం రూ. 18,000 అయితే అలవెన్సులు మినహాయించి ఇక వారి 2.57 ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ప్రకారం రూ. 46,260 (18,000 X 2.57 = 46,260) ని పొందుతారు. కేంద్ర మంత్రివర్గం జూన్ 2017 వ సంవత్సరంలో 34 సవరణలతో ఏడో వేతన సంఘం సిఫార్సులను కూడా ఆమోదించింది. ఈ ఎంట్రీ లెవల్ బేసిక్ పేని నెలకు రూ.7,000 నుంచి రూ.18,000కు పెంచగా, తరువాత అత్యున్నత స్థాయి అంటే సెక్రటరీకి రూ.90,000 నుంచి రూ.2.5 లక్షలకు పెంచడం జరిగింది.

7th pay commission increase the fitment factor of central government employees
7th Pay Commission : భారీగా పెరగనుందా?
ఇంకా అలాగే క్లాస్ 1 అధికారులకు ప్రారంభ వేతనం వచ్చేసి మొత్తం రూ.56,100గా ఉంది. ఈ ఏడాది జనవరిలో ప్రభుత్వం ఉద్యోగుల కరువు భత్యాన్ని 31 శాతం నుంచి 34 శాతానికి పెంచింది. డీఏ పెంపుతో దాదాపు 50 లక్షల మంది ఉద్యోగులు లబ్ధి పొందనున్నారు. జనవరిలో కేంద్ర ప్రభుత్వం కరువు భత్యాన్ని 3 శాతం పెంచింది. డీఏ పెంపు ఆల్ ఇండియా కన్స్యూమర్ ప్రైస్ ఇండెక్స్ (ఏఐసీపీఐ) డేటాపై ఆధారపడి ఉంటుంది. డీఏ పెంపుపై ప్రభుత్వం త్వరలో నిర్ణయం తీసుకోవచ్చని సమాచారం. జూలై 1 నుంచి ఉద్యోగులు, పెన్షనర్ల డీఏ పెంపుదల ఉండవచ్చని భావిస్తున్నారు