7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎప్పుడెప్పుడా అని డీఏ పెంపు కోసం, డీఏ బకాయిల చెల్లింపుల కోసం, అలాగే ఫిట్ మెంట్ పెంపు కోసం ఎదురు చూస్తున్నారు. ఈ మూడింటి కోసం తెగ ఎదురు చూస్తున్నారు. ఉద్యోగ సంఘాలు కూడా డిమాండ్ చేస్తున్నాయి. ఈనేపథ్యంలో ఏడో వేతన సంఘం సిఫారసు మేరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు త్రిబుల్ ధమాకా ఇచ్చేందుకు కేంద్రం కూడా రెడీ అవుతోంది. అందులో ఒకటి డీఏ పెంపు, రెండోది డీఏ బకాయిల చెల్లింపు,
మూడోది ఫిట్ మెంట్ ఫ్యాక్టర్. నిజానికి ప్రభుత్వ ఉద్యోగులకు సంవత్సరానికి రెండు సార్లు డీఏ పెరగాలి. గత సంవత్సరం సెప్టెంబర్ లో డీఏ పెరిగింది. మళ్లీ జనవరిలో పెరగాలి. ఇప్పటి వరకు పెరగలేదు. దీంతో డీఏ పెంచాలంటూ ఉద్యోగులు ఆందోళన చేస్తున్నారు. అయితే.. డీఏపై త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు డీఏ 4 శాతం పెరగనుందట. అంటే.. ప్రస్తుతం ఉన్న డీఏ 38 శాతం మాత్రమే. అది 42 శాతం కానుంది. 38 నుంచి 42 శాతం పెరగనుంది.
దీంతో డీఏ, డీఆర్ 42 శాతం కానుంది. పెరిగే డీఏ, డీఆర్ వల్ల 48 లక్షల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు, 68 లక్షల పెన్షనర్లకు లాభం చేకూరనుంది. మరోవైపు కరోనా వల్ల రాకుండా ఆగిపోయిన 18 నెలల డీఏ బకాయిలపై కూడా కేంద్రం త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్టు తెలుస్తోంది. అలాగే.. ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ విషయంలోనూ కేంద్రం త్వరలోనే నిర్ణయం తీసుకోనుందట. ఇంకొన్ని రోజుల్లో హోలీ ఉన్న నేపథ్యంలో హోలీ పండుగ నాడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు అందించేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. 2.57 గా ఉన్న ఫిట్ మెంట్ ఫ్యాక్టర్ ను 3.68 గా చేసే అవకాశం ఉంది.
RRB NTPC Recruitment : RRB రైల్వే నాన్-టెక్నికల్ పాపులర్ (NTPC) కేటగిరీల మొత్తం 11,558 పోస్టుల కోసం రిక్రూట్మెంట్ను…
Zodiac Signs : సెప్టెంబర్ నెల 24, 25వ తేదీల్లో చంద్రుడు వృషభ రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. అలాగే అదే రోజు…
Bay Leaf Water : ప్రస్తుత కాలంలో బిర్యానీ నుండి నాన్ వెజ్ వంటకాల వరకు బే ఆకులను ప్రతి…
Pitru Paksha : హిందూ సనాతన ధర్మంలో ఏడాదిలోని ఒక నిర్దిష్ట కాలాన్ని పూర్వికులకు అంకితం చేయబడింది. ఈ కాలాన్ని…
Canara Bank : కెనరా బ్యాంక్ 3,000 అప్రెంటిస్ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్ను విడుదల చేసింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ…
Anjeer Juice : అంజీర్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది అనే సంగతి అందరికీ తెలిసిందే. అయితే సాధారణంగా మనం అంజీర్…
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 లో రోజులు గడుస్తున్నా కొద్దీ టాస్కులు టఫ్…
Tirumala Laddu Prasadam : కలియువ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి ఏడు కొండల పుణ్యక్షేత్రానికి చాలా విశిష్తత ఉంది.…
This website uses cookies.