
TRS Vs BJP, Congress Enjoying the game
Huzurabad తెలంగాణలో ప్రధాన ప్రతిపక్ష పార్టీలు బిజెపి, కాంగ్రెస్ నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడుతున్నాయి. బండి సంజయ్ వర్సెస్ రేవంత్ దిశగా తెలంగాణ రాజకీయాలు మారుతున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రజాక్షేత్రంలో టీఆర్ఎస్ ను, కేసీఆర్ ను బలహీనపర్చి, తమ బలం పెంచుకోవాలన్నదే బీజేపీ, కాంగ్రెస్ ల వ్యూహం అన్న వాదన సర్వత్రా వినిపిస్తోంది. అందుకే బండి సంజయ్, రేవంత్ లు పాదయాత్ర చేపడుతున్నారని కేడర్ చర్చించుకుంటోంది. ఇప్పటికే తెలంగాణలో బీజేపీ మళ్లీ జోష్ చూపించేందుకు సమాయాత్తం అవుతోంది. బండి సంజయ్ సారధ్యంలో దుబ్బాక ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేసి, ఆ తర్వాత జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సైతం బీజేపీ ముందు వరుసలో నిలిచింది.
all parties new plan on Huzurabad by poll
ఇప్పుడు మరోమారు హుజురాబాద్ ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్న నేపథ్యంలో బిజెపి ప్రజాక్షేత్రంలోకి వెళ్లి దూకుడు ప్రదర్శించాలని నిర్ణయం తీసుకుంది. దీంతో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామే అని చెప్పేందుకే బీజేపీ పాదయాత్ర చేపట్టింది. బండి సంజయ్ ఆగస్టు 9న చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయం నుంచి పాదయాత్ర ప్రారంభించి, నాలుగు, ఐదు విడతలుగా రాష్ట్రం మొత్తాన్ని చుట్టి రానున్నారు. ఆ పాదయాత్రను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ శ్రేణులు సైతం పెద్ద ఎత్తున సన్నాహాలు చేపట్టాయి. తొలి విడతలో పాదయాత్ర .. రంగారెడ్డి, మెదక్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో నుంచి సాగేలా రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. ఈ పాదయాత్రతో పార్టీ శ్రేణుల్లో జోష్ నింపటంతో పాటు రానున్న ఎన్నికల్లో టిఆర్ఎస్ సర్కార్ కు చెక్ పెట్టేందుకేనని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.
BJP
ఇక కాంగ్రెస్ లో కొత్త జోష్ తీసుకువచ్చేందుకు నూతన రధసారథి రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తానని గతంలోనే ప్రకటించారు. ఈ క్రమంలో జులై సెకండ్ వీక్ నుంచి పాదయాత్ర ఉంటుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం తీసుకు రావడం కోసం ప్రయత్నం చేస్తున్న రేవంత్ రెడ్డి పార్టీని ప్రజాక్షేత్రంలోకి తీసుకువెళ్లి, కేసీఆర్ ను ఎండగట్టాలని యోచిస్తున్నారట. రాష్ట్రంలో బలమైన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ అని చెప్పాలని, పనిలో పనిగా బండి సంజయ్ దూకుడుకు చెక్ పెట్టాలని రేవంత్ భావిస్తున్నారట. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి కూడా పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ కు వ్యతిరేకంగా, ప్రజాక్షేత్రంలో బలం పెంపొందించుకోవడానికి బిజెపి, కాంగ్రెస్ లు రంగంలోకి దిగనున్నాయి.
Revanth reddy
ఇరు పార్టీల రథసారథులు పాదయాత్ర చేపట్టి సీఎం కేసీఆర్ కు చెక్ పెట్టాలని, తామే ప్రత్యామ్నాయమని ప్రజలకు నిరూపించుకోవాలని తెగ ఉవ్విళ్లూరుతున్నారు. అయితే బండి పాదయాత్ర రెండురోజుల్లో ప్రారంభం కానుండగా, పీసీసీ ఛీఫ్ రేవంత్ మాత్రం .. రెండోవారం నుంచి చేపట్టాలని భావించడం వెనుక పెద్ద వ్యూహమే ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఓవైపు కేసీఆర్ కు, మరోవైపు బండికి చెక్ పెట్టాలని, ఈలోపు కాంగ్రెస్ లో ఉన్న సమస్యల్ని పరిష్కరించుకోవాలని రేవంత్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీలో అంతర్గతంగా ఉన్న సమస్యల్ని పరిష్కరించుకోవడమే రేవంత్ ముందున్న అసలు సమస్యగా విశ్లేషకులు అంటున్నారు. అయితే బండి సైతం రేవంత్ కు కౌంటర్ ఇచ్చేందుకు .. విడతల వారీగా పాదయాత్రలకు ప్లాన్ చేసినట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఇది కూడా చదవండి ==> పదో తరగతి పాసైన మహిళలకు గుడ్ న్యూస్.. అంగన్ వాడీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చేసింది..!
ఇది కూడా చదవండి ==> ఏమైందమ్మా షర్మిలమ్మ.. ఇదేనా నీ రాజన్న రాజ్యం.. పార్టీ పెట్టకముందే షర్మిలకు భారీ షాక్?
ఇది కూడా చదవండి ==> కేసీఆర్ లో ఇంత మార్పేంటి..? ఈటెల కు భయపడ్డడా..?
Anaganaga Oka Raju Movie Review : సంక్రాంతి సినిమాల పోరు తుది దశకు చేరుకుంది. ఇప్పటికే పండగ బరిలో…
Nari Nari Naduma Murari Movie : ఈ ఏడాది సంక్రాంతి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద పోరు మామూలుగా లేదు.…
Sreeleela : బాలీవుడ్లో ఎలాంటి సినీ నేపథ్యం లేకుండా స్వయంకృషితో స్టార్గా ఎదిగిన కార్తీక్ ఆర్యన్, ఇప్పుడు తన సినిమాల…
Chandrababu : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం తమ భూములను త్యాగం చేసిన రైతులకు కూటమి ప్రభుత్వం భారీ…
Anil Ravipudi: టాలీవుడ్లో అపజయం ఎరుగని 'హిట్ మెషిన్'గా పేరుగాంచిన అనిల్ రావిపూడి, తన కెరీర్లో వరుసగా తొమ్మిది విజయాలను…
Vijay : తమిళనాడు Tamila Nadu Politics రాజకీయ యవనికపై 'తమిళగ వెట్రి కజగం' ( TVK ) పార్టీతో…
Hyundai EV Sector : ఎలక్ట్రిక్ వాహనాల (EV) ప్రపంచంలో ఛార్జింగ్ సమస్యలకు చరమగీతం పాడుతూ హ్యుందాయ్ మోటార్ గ్రూప్…
Indiramma Atmiya Bharosa Scheme : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు అండగా నిలవాలనే…
This website uses cookies.