
TRS Vs BJP, Congress Enjoying the game
Huzurabad తెలంగాణలో ప్రధాన ప్రతిపక్ష పార్టీలు బిజెపి, కాంగ్రెస్ నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడుతున్నాయి. బండి సంజయ్ వర్సెస్ రేవంత్ దిశగా తెలంగాణ రాజకీయాలు మారుతున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ప్రజాక్షేత్రంలో టీఆర్ఎస్ ను, కేసీఆర్ ను బలహీనపర్చి, తమ బలం పెంచుకోవాలన్నదే బీజేపీ, కాంగ్రెస్ ల వ్యూహం అన్న వాదన సర్వత్రా వినిపిస్తోంది. అందుకే బండి సంజయ్, రేవంత్ లు పాదయాత్ర చేపడుతున్నారని కేడర్ చర్చించుకుంటోంది. ఇప్పటికే తెలంగాణలో బీజేపీ మళ్లీ జోష్ చూపించేందుకు సమాయాత్తం అవుతోంది. బండి సంజయ్ సారధ్యంలో దుబ్బాక ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేసి, ఆ తర్వాత జరిగిన జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సైతం బీజేపీ ముందు వరుసలో నిలిచింది.
all parties new plan on Huzurabad by poll
ఇప్పుడు మరోమారు హుజురాబాద్ ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్న నేపథ్యంలో బిజెపి ప్రజాక్షేత్రంలోకి వెళ్లి దూకుడు ప్రదర్శించాలని నిర్ణయం తీసుకుంది. దీంతో టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం తామే అని చెప్పేందుకే బీజేపీ పాదయాత్ర చేపట్టింది. బండి సంజయ్ ఆగస్టు 9న చార్మినార్ భాగ్యలక్ష్మి దేవాలయం నుంచి పాదయాత్ర ప్రారంభించి, నాలుగు, ఐదు విడతలుగా రాష్ట్రం మొత్తాన్ని చుట్టి రానున్నారు. ఆ పాదయాత్రను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ శ్రేణులు సైతం పెద్ద ఎత్తున సన్నాహాలు చేపట్టాయి. తొలి విడతలో పాదయాత్ర .. రంగారెడ్డి, మెదక్, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో నుంచి సాగేలా రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. ఈ పాదయాత్రతో పార్టీ శ్రేణుల్లో జోష్ నింపటంతో పాటు రానున్న ఎన్నికల్లో టిఆర్ఎస్ సర్కార్ కు చెక్ పెట్టేందుకేనని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి.
BJP
ఇక కాంగ్రెస్ లో కొత్త జోష్ తీసుకువచ్చేందుకు నూతన రధసారథి రేవంత్ రెడ్డి పాదయాత్ర చేస్తానని గతంలోనే ప్రకటించారు. ఈ క్రమంలో జులై సెకండ్ వీక్ నుంచి పాదయాత్ర ఉంటుందని పార్టీ శ్రేణులు భావిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి పునర్వైభవం తీసుకు రావడం కోసం ప్రయత్నం చేస్తున్న రేవంత్ రెడ్డి పార్టీని ప్రజాక్షేత్రంలోకి తీసుకువెళ్లి, కేసీఆర్ ను ఎండగట్టాలని యోచిస్తున్నారట. రాష్ట్రంలో బలమైన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ అని చెప్పాలని, పనిలో పనిగా బండి సంజయ్ దూకుడుకు చెక్ పెట్టాలని రేవంత్ భావిస్తున్నారట. ఈ క్రమంలోనే రేవంత్ రెడ్డి కూడా పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ కు వ్యతిరేకంగా, ప్రజాక్షేత్రంలో బలం పెంపొందించుకోవడానికి బిజెపి, కాంగ్రెస్ లు రంగంలోకి దిగనున్నాయి.
Revanth reddy
ఇరు పార్టీల రథసారథులు పాదయాత్ర చేపట్టి సీఎం కేసీఆర్ కు చెక్ పెట్టాలని, తామే ప్రత్యామ్నాయమని ప్రజలకు నిరూపించుకోవాలని తెగ ఉవ్విళ్లూరుతున్నారు. అయితే బండి పాదయాత్ర రెండురోజుల్లో ప్రారంభం కానుండగా, పీసీసీ ఛీఫ్ రేవంత్ మాత్రం .. రెండోవారం నుంచి చేపట్టాలని భావించడం వెనుక పెద్ద వ్యూహమే ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఓవైపు కేసీఆర్ కు, మరోవైపు బండికి చెక్ పెట్టాలని, ఈలోపు కాంగ్రెస్ లో ఉన్న సమస్యల్ని పరిష్కరించుకోవాలని రేవంత్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. పార్టీలో అంతర్గతంగా ఉన్న సమస్యల్ని పరిష్కరించుకోవడమే రేవంత్ ముందున్న అసలు సమస్యగా విశ్లేషకులు అంటున్నారు. అయితే బండి సైతం రేవంత్ కు కౌంటర్ ఇచ్చేందుకు .. విడతల వారీగా పాదయాత్రలకు ప్లాన్ చేసినట్లు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
ఇది కూడా చదవండి ==> పదో తరగతి పాసైన మహిళలకు గుడ్ న్యూస్.. అంగన్ వాడీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చేసింది..!
ఇది కూడా చదవండి ==> ఏమైందమ్మా షర్మిలమ్మ.. ఇదేనా నీ రాజన్న రాజ్యం.. పార్టీ పెట్టకముందే షర్మిలకు భారీ షాక్?
ఇది కూడా చదవండి ==> కేసీఆర్ లో ఇంత మార్పేంటి..? ఈటెల కు భయపడ్డడా..?
Blue Berries | ఆకర్షణీయమైన నీలిరంగు, చక్కని రుచితో మనసును దోచుకునే బ్లూబెర్రీస్ కేవలం రుచికరమైనవి మాత్రమే కాదు, ఆరోగ్యానికి…
Remedies | శని గ్రహం జ్యోతిష్యశాస్త్రంలో అత్యంత శక్తివంతమైన గ్రహాల్లో ఒకటి. ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి శని గ్రహం…
Rukmini Vasanth | కన్నడ, తెలుగు, తమిళ భాషల్లో క్రేజ్ పెంచుకుంటున్న నటి రుక్మిణి వసంత్ తన పేరుతో జరుగుతున్న మోసాలపై…
Moringa Powder | తెలుగు వారి వంటింట్లో మునగ పేరు తెలియనివారు ఉండరంటే అతిశయోక్తి కాదు. మునగకాయలతో పులుసులు, కూరలు,…
Sesame Seeds | స్త్రీల ఆరోగ్యం పురుషులతో పోలిస్తే ఎక్కువ సవాళ్లను ఎదుర్కొంటుంది. హార్మోన్ల అసమతుల్యత, రక్తహీనత, ఎముకల బలహీనత,…
Heart Attacks | భారతదేశంలో గుండె సంబంధిత వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయి. అధిక రక్తపోటు, కొలెస్ట్రాల్, ఒత్తిడి, అసమతుల్య ఆహారం, వ్యాయామం…
Triphala Powder | ఆయుర్వేదం ప్రకారం ప్రతి ఋతువుకి అనుకూలంగా ఆహార నియమాలు, మూలికా చిట్కాలు ఉంటాయి. అందులో త్రిఫల చూర్ణం…
Mole | జ్యోతిషశాస్త్రం మన శరీరంలోని చిన్నచిన్న లక్షణాలకూ ప్రత్యేక అర్థం ఇస్తుంది. అందులో ఒకటి పుట్టుమచ్చలు (Moles). పుట్టుమచ్చ…
This website uses cookies.