Ganta Srinivasa Rao తెగదు.. సాగదు..అన్నట్లుంది మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు Ganta Srinivasa Rao రాజకీయం.. తాజాగా మళ్లీ తెరపైకి గంటా శ్రీనివాసరావు పేరు వినిపిస్తోంది. దీనికి కారణం.. ఆయన ఫుల్లుగా సైలెంట్ అయిపోవడమే. ఇటీవల విశాఖ స్టీల్ ప్లాంట్ వివాదం నేపథ్యంలో ఎమ్మెల్యే పదవికి రిజైన్ చేసిన గంటా కొంత హడావుడి సృష్టించారు. ఇక, దీనిపై మళ్లీ నోరు విప్పలేదు. తాను చేసిన రాజీనామాకు కట్టుబడి ఉన్నానన్న గంటా శ్రీనివాసరావు Ganta Srinivasa Rao .. తర్వాత పరిణామాలపై మాత్రం మౌనంగా ఉన్నారు. ప్రస్తుతం గంటా అడ్రస్ ఎక్కడ అనే టాక్ విశాఖలో నడుస్తోంది. రాజకీయంగా కూడా గంటా శ్రీనివాసరావు టీడీపీలో ఉన్నట్టా? లేనట్టా? అనే సందేహాలు కూడా రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతున్నాయి. వస్తే.. వైసీపీలో చేర్చుకుంటామని.. కొన్నాళ్ల కిందట.. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ప్రకటించారు.
ఆ ప్రకటనకు ముందే విజయసాయిరెడ్డి గంటా శ్రీనివాసరావును తీవ్రంగా తిట్టిపోశారు. ఆ తర్వాత విశాఖ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో.. గంటా సైలెంట్ అయ్యారు. ఆయన సొంత నియోజకవర్గం నార్త్లో కూడా వైసీపీ తిరుగులేని విధంగా డివిజన్లలో పాగా వేసింది. పైగా కెకె రాజు దూకుడు ముందు గంటా శ్రీనివాసరావు బేజారు అయ్యే పరిస్థితి నెలకొంది. దీంతో కార్పొరేషన్లో గెలుపు కోసమే విజయసాయిరెడ్డి అలా ప్రకటించారంటూ వార్తలు వెల్లువెత్తాయి. గంటా శ్రీనివాసరావు యాక్టీవ్ అయి, టీడీపీ తరఫున పనిచేస్తే, వైసీపీకి ఇబ్బందులు తప్పవన్న యోచనతోనే విజయసాయిరెడ్డి అలా ప్రకటన చేసి, ఉంటారని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ వాదన ఎలా ఉన్నా.. ఆ తర్వాత.. విజయసాయిరెడ్డి సైలెంట్ అయిపోవడం కూడా దీనిని బలపరుస్తోంది. కార్పొరేషన్ ఎన్నికల తర్వాత.. ఇటీవల మళ్లీ మంత్రి.. అవంతి శ్రీనివాస్ దూకుడుగా ఉండడంతో గంటా విషయంలో విజయసాయిరెడ్డి కావాలనే వ్యాఖ్యలు చేశారంటూ కేడర్ చర్చించుకుంటోంది.
ఇలా అన్ని వైపుల నుంచి రాజకీయంగా ఒత్తిళ్లు పెరుగుతున్నా.. గంటా శ్రీనివాసరావు Ganta Srinivasa Rao ఎక్కడా స్పందించకపోవడానికి కారణం.. ఆరోపణలేనని టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారు. గతంలో భూములకు సంబంధించిన కేసుల తోపాటు పూజిత చిట్ఫండ్ కంపెనీపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలోనే గంటా శ్రీనివాసరావు ఏమీ మాట్లాడలేకపోతున్నారని గంటా వర్గం భావిస్తోంది. టీడీపీలోనే ఉన్నా.. గంటా Ganta Srinivasa Rao యాక్టివ్గా లేకపోవడం.. వైసీపీలోకి వచ్చేవారిని ఆహ్వానిస్తామన్నా.. రాకపోవడం వంటి పరిణామాల వెనుక.. ఇదే కారణమని పార్టీలో అంతర్గతంగా చర్చలు సాగుతున్నాయి. అయితే గంటా Ganta Srinivasa Rao కు మునుపున్న ఫాలోయింగ్ .. ఇప్పుడు లేదని పరిశీలకులు కూడా చెబుతున్నారు. అందుకే టీడీపీ కూడా గంటా వ్యవహారాన్ని పట్టించుకోనట్లు వ్యవహరిస్తోందని అంటున్నారు. వైసీపీ మాత్రం గంటా శ్రీనివాసరావును టీడీపీకి దూరం చేయాలని తీవ్ర ప్రయత్నాలు చేస్తోందని అంచనా వేస్తున్నారు. మరి వచ్చే ఎన్నికల నాటికి గంటా .. ఏం చేస్తారన్నదే చర్చనీయాంశంగా మారింది.
ఇది కూడా చదవండి ==> టీడీపీ కంచుకోటపై వైసీపీ కన్ను.. దీన్ని కూడా కోల్పోతే టీడీపీ పరిస్థితి అధోగతే..?
ఇది కూడా చదవండి ==> ఆ ముఖ్య నేతకు భారీ షాక్ ఇవ్వనున్న సీఎం జగన్.. అలా చేస్తే పార్టీకే నష్టమంటున్న విశ్లేషకులు..?
ఇది కూడా చదవండి ==> కొడాలి నానికి జనసేన చుక్కలు చూపిస్తుందా..?
ఇది కూడా చదవండి ==> కేబినెట్ బెర్తుల కోసం భారీ క్యూ.. ఊహించని నేతలకు దక్కనున్న మంత్రి పదవి?
Rythu Bharosa : రైతు భరోసా కింద అర్హులైన రైతులందరికీ ఎకరాకు రూ.15 వేల చొప్పున అందించడమే తెలంగాణ ప్రభుత్వం…
Samantha : గౌతమ్ మీనన్ దర్శకత్వం వహించిన ఏం మాయ చేశావే సినిమాతో టాలీవుడ్ లో అడుగు పెట్టింది సమంత.…
CISF Fireman Recruitment : సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) 1130 పోస్టుల కోసం కానిస్టేబుల్ ఫైర్మెన్ల నియామక…
Farmers : ఆంధ్రప్రదేశ్లో రైతులకు ఆ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యాన పంటల రైతులకు ఇన్పుట్ సబ్సిడీ…
7th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త. డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ని ప్రభుత్వం పెంచబోతోంది. ప్రభుత్వం త్వరలో…
Balineni Srinivas Reddy : గత కొద్ది రోజులుగా బాలినేని వైసీపీని వీడనున్నట్టు అనేక ప్రచారాలు జరిగాయి. ఎట్టకేలకి అది…
Jamili Elections : దేశవ్యాప్తంగా ఒకేసారి పార్లమెంట్ , అసెంబ్లీ ఎన్నికలు నిర్వహించేలా జమిలి ఎన్నికలకు కేంద్ర కేబినెట్ ఆమోదం…
Naga Manikanta : బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ బాస్ ఇప్పుడు తెలుగులో సీజన్ 8 జరుపుకుంటుంది.తాజా సీజన్లోని…
This website uses cookies.