Anasuya : మ‌ళ్లీ సోషల్ మీడియాలో పచ్చి బూతులతో రెచ్చిపోయిన అనసూయ.. వీడియో !!

Authored By Jyothi Marikanti | The Telugu News | Updated on : 1 January 2024, 7:00 pm

Anasuya : బుల్లితెర యాంకర్ అనసూయ గురించి ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు.. సెలబ్రిటీగా ఆమె చేసే వాటికన్నా వివాదాలతో ఎక్కువగా వార్తలలో వస్తుంది. జబర్దస్త్ షో ద్వారా మంచి పాపులారిటీని దక్కించుకొని ఆ తర్వాత సినిమాలలో ముఖ్య పాత్రలు పోషిస్తూ.. ఇప్పుడు పుష్ప సినిమాతో పాన్ ఇండియా రేంజ్ కి ఎదిగి సెలబ్రిటీ అయింది. యాంకరింగ్ కి స్వస్తి చెప్పిన ఈ అమ్మడు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ ను పెంచుకోవడం మాత్రమే కాదు..

నోటికొచ్చిన బూతులతో రెచ్చిపోతూ ఇమేజ్ ను డామేజ్ చేసుకుంటూ వస్తుంది. బూతులు మాట్లాడుతూ అడ్డంగా దొరుకుతుంది. ఇప్పుడు మరోసారి పచ్చి బూతులు మాట్లాడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఎప్పటికప్పుడు వరుస ఫోటో షూటింగ్ చేస్తు బిజీగా ఉంటున్న ఈమె కాంట్రవర్సీలకు కూడా కేరాఫ్ గా మారుతుంది. సోషల్ మీడియాలో కొంతమంది నేటిజన్స్ ఆమెని ఆంటీ అని వెక్కిరిస్తూ ఉంటారు. అలా ఆంటీ అన్న వాళ్ల మీద కూడా ఆమె విరుచుకుపడుతుంది.

నాపై ట్రోల్ చేసిన వారు పైన కేసు పెడతా అని బెదిరించిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు తాజాగా తన ఇనిస్టాలో మరో వీడియోను పోస్ట్ చేసింది. ఆడవాళ్లు ఎలా ఉండాలో ఎలా బ్రతకాలో కూడా కొంతమంది మగవాళ్లు డిసైడ్ చేస్తున్నారు. ఇదెక్కడి దుర్మార్గం అంటూ తీవ్రమైన అసహనంతో ఈ పోస్ట్ చేసింది. అలాగే చివర్లో ఇంగ్లీషులో కొన్ని బూతులు మాట్లాడింది. అంటే “నా జోలికి వస్తే దూల తీర్చి ధూపం వేస్తా” అంటూ ఒక రేంజ్ లో రెచ్చిపోయింది.ఒక సెలబ్రిటీ హోదాలో ఉండి ఏ అమ్మాయి పబ్లిక్ గా వినకూడని మాటలు అంటున్నారని ఆమెను నేటిజన్స్ చాలా తీవ్రంగా విమర్శిస్తున్నారు. ఇలాంటి మాటలు అనే ముందు కొద్దిగా ఆలోచించండి. పచ్చి బూతులతో రెచ్చిపోకండి.. అంటూ నేటిజన్లు కామెంట్ చేస్తున్నారు.

Jyothi Marikanti

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp