indian Army Soldiers : మ‌న భార‌త సైనికులు గ‌డ్డ‌క‌ట్టే తివ్ర‌మైన చ‌లిలో ఎలా జీవిస్తున్నారో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు !

 Authored By prabhas | The Telugu News | Updated on :24 November 2021,6:15 am

indian Army Soldiers : భార‌త దేశం స‌రిహ‌ద్దుల‌లో భార‌త సైనికులు ఎన్ని క‌ష్టాలు ప‌డ‌తారో మ‌నంద‌రికి తెలియ‌దు . ఈ సైనికులు భార‌త దేశంను కాపాడుట‌కోర‌కు త‌మ ప్రాణాల‌ను ప‌నంగా పెడ‌తారు . శ‌తృవుల‌ను భార‌త స‌రిహ‌ద్దుని దాటి రాన్వివ‌కుండా కాపాడ‌డ‌మే కాదు, త‌మ ఆరోగ్య‌ము గురించి కూడా ప‌టించుకోకుండా మ‌న దేశం కోసం పోరాడుతున్నారు భార‌త సైనికులు . దేశ క్షేమం కోసం త‌మ ప్రాణాల‌ను స‌హితం లెక్క‌చేయ‌కుండా త‌మ ఉద్యోగాల‌ను నిర్వ‌హిస్తున్నారు .మ‌నం మాములుగా చ‌లికాలం వ‌చ్చిన‌ప్పుడు చ‌లికి త‌ట్టుకోలేక పోతాం . చ‌లి తివ్ర‌త మా అంటే 2 నెల‌లు ఎక్కువ‌గా ఉంటుంది . 2 నెల‌లు చ‌లికే మ‌నం చాలా ఇబ్బందిగా పీల‌వుతాం . మ‌రి భార‌త దేశం స‌రిహ‌ద్దుల‌లో ఆ సైనికులు సంవ‌త్స‌రం మొత్తం చ‌లిలోనే జీవించాలి .

indian Army Soldiers : సియాచిన్ లాంటి ప్రాతంలో మ‌న సైనికులు క‌ష్టాలు :

army soldiers probelem they face indion

army soldiers probelem they face indion

వారి ఆరోగ్యం ఎంత దెబ్బ‌తినే ప్ర‌మాధం ఉందో మీకు తెలుసా. ఈ సైనికులు ఉండే ప్ర‌దేశం మైన‌స్ డీగ్రీల‌లో ఉష్టోగ్ర‌త‌ను క‌లిగి ఉంటుంది . సియాచిన్ ప్ర‌దేశంలో మైన‌స్ డీగ్రీల‌లో ఉష్టోగ్ర‌త లో క‌ష్ట‌స‌మ‌యంలో ఉంటూ దేశాన్ని ర‌క్షిస్తున్నారు భార‌త సైనికులు .మ‌రి వారు ఆ చ‌లిలో ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందో తెలుసుకుందాం … సియాచిన్ లాంటి ప్రాతంలో మ‌న సైనికులు 20 వేల అడుగుల ఎత్తులో ప‌గ‌లు రాత్రీ నిల‌బ‌డి ఉంటారు .గ‌త కోన్నేళ్లుగా వాతావ‌ర‌ణం కార‌ణంగా ఎంద‌రో సైనికులు త‌మ ప్రాణాల‌ను బ‌లిగొన్నారు. బేస్ క్యాంప్ నుండి సైనికులు అత్యంత క‌ష్ట‌త‌ర‌మైన‌ దూరాన్ని అదిగ‌మించాల్సి ఉంటుంది . దీనికోసం సైనికులు క‌లిసి న‌డుస్తారు.

అలాగే లోతైన లోయ‌లో ఎవ్వ‌రు జారిప‌డ‌కుండా సైనికులంద‌రి పాదాల‌ను తాడుతో క‌ట్టివేస్తారు . పెట్రోలింగ్ బృందం ఉద‌యం 8-9 గంట‌ల‌కు శిఖ‌రంను చేరుకోవ‌డానికి బేస్ క్యాంప్ నుంచి బ‌య‌లుదెరాల్సి ఉంటుంది. సైనికు కొన్ని కీలోల బ‌రువున్న బ్యాగును మోస్తూ ఎతైన దుర్గ‌మ ప్రాంతంకు చేరుకుంటారు. సైనికుల శ‌రిరంపై అనేక పోర‌ల‌తో కూడిన దుస్తుల‌ను వేసుకుంటారు.ఇలా సైనికులు చేరుకునేస‌రికి వారి చ‌మ‌ట‌తో త‌డిస్సి ముద్దైపోతారు.చ‌లి మైన‌స్ చేరుకోవ‌డంతో శ‌రిరంపై చ‌మ‌ట కూడా పెరుక‌పోయే ప‌రిస్థితి ఉంటుది . మైన‌స్ 60 డిగ్రీల కంటే త‌క్కువ ఉష్టోగ్ర‌తలో తిన‌డం. నీల్లు తాగ‌డం కూడా క‌ష్ట‌త‌ర‌మ‌వుతుంది.

సైనికుల‌కు క్యాన్ల‌లో లేదా టిన్ క్యాన్డ్ కంటైన‌ర్ల‌లో ప్యాక్చేసిన ఆహ‌రాన్ని అందిస్తారు.ఇది ఎక్కువ ద్ర‌వాన్ని క‌లిగి ఉంటుంది. ఇది తిన‌డానికి లేదా గ‌డ్డ‌క‌ట్టక‌ముందు నిప్పుమీద ఆహ‌రంను క‌రిగించుకోని ఆ త‌రువాత తింటారు. ఈ ఇబ్బందుల‌ను ఎదుర్కోనుట‌కు సైనికుల‌కు డ్రై ప్రూట్స్ ఇస్తారు . తాగునీటి స‌మ‌స్య ఉండ‌టంతో ఐస్ ను క‌రిగించి తాగాల్సి ఉంటుంది. మ‌రుగుదోడ్డికి ఉప‌యోగించే నీరు క‌ర‌గ‌కుండా ఎప్పుడు స్ట‌వ్ పైనే ఉంచుతారు .తీవ్ర‌మైన చ‌లి మ‌రియు ఆక్సిజ‌న్ లేక‌పోవ‌డం వ‌ల‌న ఆ ప్ర‌భావం నిద్ర‌పై ప‌డుతుంది.ఆవ‌త‌కు స‌రైన నిద్ర లేక‌పోవ‌డంతో తివ్ర ఇబ్బందుల‌కు గురి అవుతున్నారు.ఇలాంటి ఇబ్బందుల‌ను ఎదుర్కోంటూ దేశం కోసం పాటుప‌డే జ‌వాన్ల‌ను ఎంత పోగినా త‌క్కువే .. జోహ‌ర్ జ‌వాన్ ….

prabhas

Prabhas Gilakathula Content Writer experiened in Digital media field. Iam worked in various Telugu media for about 5 years. Worked in Namasthe Telangana, Telugu Rajyam , as a telugu content writer. I wrote various Latest Breaking News , politics, interesting stories, Andhr Pradesh & Telangana local news, health, technology, entertainment , Devotional, etc. He is also Social Media Expert, Technical Expert . He is present content writer of thetelugunews.com website. Contact details: Prabhas29nov@gmail.com

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి