Post Office Schemes : పెట్టుబడి పరంగా మహిళలకు అధిక రాబడి ఇచ్చే పోస్టాఫీస్ పథకాలు ఇవే..!!
Post Office Schemes : మహిళలు ఎక్కువగా పెట్టుబడుల కోసం అధిక రాబడి వచ్చే పథకాల కోసం ఎదురు చూస్తుంటారు. కేంద్ర మహిళలకు మన దేశం పోస్ట్ ఆఫీస్ పథకాలు ఎన్నో అందిస్తుంది. అందులో మహిళలు డబ్బులు సురక్షితంగా పెట్టుబడి చేస్తున్నారు. పోస్ట్ ఆఫీస్ పథకాలు మంచి రాబడిని అందిస్తాయి. పోస్ట్ ఆఫీస్ అందించే ఐదు పథకాల వలన మహిళలు అధిక రాబడిని పొందవచ్చు. అంతేకాకుండా పన్ను మినహాయింపులు కూడా పొందవచ్చు. పోస్ట్ ఆఫీస్ పథకాలలో ఒకటైన […]

Post Office Schemes : మహిళలు ఎక్కువగా పెట్టుబడుల కోసం అధిక రాబడి వచ్చే పథకాల కోసం ఎదురు చూస్తుంటారు. కేంద్ర మహిళలకు మన దేశం పోస్ట్ ఆఫీస్ పథకాలు ఎన్నో అందిస్తుంది. అందులో మహిళలు డబ్బులు సురక్షితంగా పెట్టుబడి చేస్తున్నారు. పోస్ట్ ఆఫీస్ పథకాలు మంచి రాబడిని అందిస్తాయి. పోస్ట్ ఆఫీస్ అందించే ఐదు పథకాల వలన మహిళలు అధిక రాబడిని పొందవచ్చు. అంతేకాకుండా పన్ను మినహాయింపులు కూడా పొందవచ్చు. పోస్ట్ ఆఫీస్ పథకాలలో ఒకటైన సుకన్య సమృద్ధి యోజన పథకం ప్రత్యేకించి బాలికల కోసం ఏర్పాటు చేయబడింది.
ఈ పథకం కింద తల్లిదండ్రులు కూతురు పేరు మీద 10 సంవత్సరాల వయసు వరకు ఖాతా తెరవచ్చు. ఈ పథకంలో గరిష్టంగా 250 నుంచి 1.5 లక్షల వరకు పెట్టుబడి పెట్టవచ్చు. ప్రస్తుతం ప్రభుత్వం ఈ పథకం కింద డిపాజిట్లపై 8% వడ్డీని అందిస్తుంది. మరొక పథకం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ స్కీం లో కూడా మహిళలు సురక్షితంగా పెట్టుబడి పెట్టవచ్చు. ఈ పథకం కింద ప్రభుత్వం ప్రస్తుతం డిపాజిట్లపై 7.1% వడ్డీని అందిస్తుంది. ఎవరైనా 15 ఏళ్ల పాటు ప్రతి ఏడాది లక్ష పెట్టుబడి పెడితే, మెచ్యూరిటీ సమయానికి దాదాపుగా 31 లక్షలు పొందుతారు.
కేంద్ర ప్రభుత్వం మహిళల కోసం ప్రత్యేకంగా రూపొందించిన పథకం మహిళా సమాన్ సముఖి పథకం. ఈ పథకం కింద మహిళలు రెండు లక్షల వరకు పెట్టుబడి పెట్ట పెట్టవచ్చు. డిపాజిట్ చేసిన మొత్తం 7.5 శాతం వరకు వడ్డీ పొందవచ్చు. ఈ పథకం వ్యవధి రెండు సంవత్సరాలు. పోస్ట్ ఆఫీస్ టైమ్ డిపాజిట్ స్కీమ్ కూడా మహిళలకు మంచి పెట్టుబడి ఎంపిక. ఈ పథకం కింద ప్రతి నెలా నిర్ణీత మొత్తాన్ని ఖాతాలో జమ చేయవచ్చు. పోస్టాఫీసు 5 సంవత్సరాల కాలానికి 7.5 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ అనేది మహిళలకు మంచి పెట్టుబడి ఎంపిక. ఈ పథకం కింద రూ.1000 నుంచి ఎంత మొత్తాన్ని అయినా పెట్టుబడి పెట్టవచ్చు. డిపాజిట్లపై వడ్డీ రేటు 7.7 శాతం. ఈ పథకం మొత్తం కాలవ్యవధి 5 సంవత్సరాలు.