Botsa Satyanarayana : ఏపీలో ప్రస్తుతం రాజధాని తరలింపు అనే అంశం వాడీవేడీగా ఉంది. చంద్రబాబు ప్రభుత్వం ఉన్నప్పుడు అమరావతి అంటూ ఒకే రాజధానిని ప్రకటించారు. ఆ తర్వాత 2019 లో వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చాక…. ఏపీ అభివృద్ధి జరగాలంటే… ఒక్క రాజధాని ఉంటే సరిపోదన్నారు. ఏపీలో మూడు ప్రాంతాలు ఉన్నాయని… రాయలసీమ, కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర.. అన్ని ప్రాంతాలకు న్యాయం జరగాలన్నా… అన్ని ప్రాంతాలు ఒకే విధంగా అభివృద్ధి చెందాలన్నా… ఒక్క అమరావతి రాజధాని వల్ల కాదని… అభివృద్ధి వికేంద్రీకరణ కోసం ఏపీకి మూడు రాజధానులను ఏర్పాటు చేస్తామని వైసీపీ ప్రభుత్వం స్పష్టం చేసింది. దీంతో మరో తలనొప్పి ప్రారంభం అయింది.
ఇలా రాజధానులను మారుస్తూ పోతే.. ఏపీకి భవిష్యత్తు ఉండకుండా పోతుందని… కొందరు ఆరోపించారు. ఏపీకి ఒకటే రాజధాని ముద్దు అంటూ నినాదాలు చేశారు. రాజధానుల తరలింపు వల్ల ఎక్కువ నష్టపోయేది ప్రభుత్వ ఉద్యోగులు మాత్రమే.
ఏది ఏమైనా… వైఎస్ జగన్ ప్రభుత్వం మూడు రాజధానులపై ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేయడంతో ఎవ్వరూ ఏం చేయలేని పరిస్థితి నెలకొన్నది. తాజాగా రాజధాని తరలింపుపై మంత్రి బొత్స సత్యనారాయణ షాకింగ్ కామెంట్స్ చేశారు.
అయితే.. త్వరలోనే విశాఖను పరిపాలన రాజధానిగా మారుస్తామని బొత్స స్పష్టం చేశారు. ఏ ప్రాంతానికి కూడా అన్యాయం చేయకూడదని… ప్రాంతీయ అభిప్రాయ భేదాలు ఉండకూడదని… సీఎం జగన్ ఏపీకి మూడు రాజధానులను ప్రకటించారని బొత్స స్పష్టం చేశారు.
అందుకే… త్వరలోనే విశాఖకు పరిపాలన రాజధానిని మారుస్తున్నామని.. విశాఖలో పరిపాలన భవనాల కోసం… మధురవాడ, పుప్పాలవాడ, భీమిలి ప్రాంతాలను పరిశీలించామని… అక్కడ స్థలాలను కూడా అధికారులు గుర్తించారని ఆయన స్పష్టం చేశారు.
బొత్స చేసిన వ్యాఖ్యలపై ఉద్యోగుల్లో భిన్నాభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇంత తొందర పడటం, అనాలోచిత నిర్ణయం తీసుకోవడం కరెక్ట్ కాదంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఓవైపు కేసు కోర్టులో నడుస్తుంటే… ఇంత త్వరగా విశాఖకు పరిపాలన రాజధానిని తరలించడం ఎందుకు? అంటూ ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా సచివాలయ ఉద్యోగులైతే టెన్షన్ తో భయపడుతున్నారు. ఇప్పటికే.. హైదరాబాద్ నుంచి విజయవాడకు తరలివెళ్లారు. మళ్లీ ఇప్పుడు విజయవాడ నుంచి విశాఖపట్నం అంటే ఎలా? అంటూ ప్రశ్నిస్తున్నారు.
TDP Alliance ఆంధ్రప్రదేశ్లోని కూటమి (టీడీపీ, జనసేన, బీజేపీ) ప్రభుత్వం వంద రోజులు పూర్తి చేసుకుంది. ఈ నెల 20…
Bigg Boss 8 Telugu : బిగ్ బాస్ సీజన్ 8 సక్సెస్ ఫుల్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.…
Bigg Boss 8 Telugu : బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్యక్రమం సక్సెస్ ఫుల్గా సాగుతుంది.…
Tasty Energy Bars : రోజంతా ఎంతో ఎనర్జిటిక్ గా ఉండాలి అంటే దానికి తగ్గ ఆహారం తీసుకోవాలి. అయితే…
Horoscope : హిందూమతంలో వారంలోని ఏడు రోజులు ఒక్కొక్క దేవుడికి అంకితం చేయబడింది. ఇక దీనిలో గురువారాన్ని దేవతలకు అధిపతి…
Diabetes : ప్రస్తుత కాలంలో మధుమేహం అనేది సాధారణ సమస్యగా మారింది. అయితే వృద్ధులు మాత్రమే కాదు యువత కూడా దీని…
Shani Dev : సెప్టెంబర్ చివరి వారంలో అత్యంత శక్తివంతమైన శేష మహాపురుష యోగం ఏర్పడుతుంది. అయితే ఈ యోగం…
TS ITI Admission 2024 : డైరెక్టరేట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అండ్ ట్రైనింగ్, తెలంగాణ TS ITI 2024 రిజిస్ట్రేషన్…
This website uses cookies.