Diwali 2025 | ఈ రంగు దుస్తులు ధరించండి .. లక్ష్మీ కటాక్షం మీవైపు తిరుగుతుంది!

Authored By Sam C | The Telugu News | Published on: October 18, 2025, 6:00 am

Diwali 2025 |దీపాల పండుగ దీపావళి సమీపిస్తోంది. అక్టోబర్ 20 సోమవారం రోజున దేశవ్యాప్తంగా ప్రజలు ఆనందంగా దీపావళిని జరుపుకోబోతున్నారు. ఈ పండుగలో ఇళ్లను శుభ్రం చేయడం, దీపాలతో అలంకరించడం, లక్ష్మీదేవిని పూజించడం వంటి సాంప్రదాయాలు ముఖ్యమైనవి. అయితే పూజ సమయంలో ధరించే దుస్తుల రంగులు కూడా ప్రత్యేక ప్రాముఖ్యత కలిగినవని పండితులు చెబుతున్నారు. సరైన రంగు దుస్తులు ధరిస్తే అదృష్టం, ఐశ్వర్యం లభిస్తాయని విశ్వాసం ఉంది.

#image_title

పసుపు రంగు — సంపదకు ప్రతీక

పండితుల ప్రకారం, దీపావళి రోజున మహిళలు పసుపు రంగు దుస్తులు ధరించడం అత్యంత శుభప్రదం. పసుపు రంగు బృహస్పతి గ్రహాన్ని సూచిస్తుంది. ఇది శాంతి, సంపద, సానుకూల శక్తికి ప్రతీక. కాబట్టి ఈ రంగు దుస్తులు ధరించి లక్ష్మీదేవిని పూజిస్తే ఆమెలోక అనుగ్రహం లభిస్తుందని నమ్మకం.

ఎరుపు రంగు — ధైర్యం, ధనప్రాప్తి సంకేతం

దీపావళి పూజ సమయంలో ఎరుపు రంగు దుస్తులు ధరించడం కూడా శ్రేయస్కరమని అంటున్నారు పండితులు. ఎరుపు రంగు శక్తి, ధైర్యం, ప్రేమకు ప్రతీక. ఇది కుజ గ్రహంకు సంబంధించినది. ఈ రంగు ధరిస్తే ధనప్రాప్తి, విజయాలు లభిస్తాయని జ్యోతిష్య నిపుణుల అభిప్రాయం.

తెలుపు రంగు — శాంతి, లక్ష్మీ కటాక్షం

తెలుపు రంగు శాంతి, పవిత్రతకు సూచకం. దీపావళి రోజున తెలుపు దుస్తులు ధరించి పూజ చేయడం వల్ల లక్ష్మీదేవి కటాక్షం లభిస్తుందని చెబుతున్నారు పండితులు.

నీలం రంగు — దూరంగా ఉంచండి

దీపావళి పండుగ రోజున నీలం రంగు దుస్తులు ధరించడం నివారించాలి. ఈ రంగు పాజిటివ్ ఎనర్జీని తగ్గించి, ఇంట్లో గందరగోళం లేదా వాదనలు రావచ్చని నమ్మకం.

Sam C

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp