Dussehra 2025 | దసరా నాడు దానం చేయాల్సిన పవిత్ర వస్తువులు ..శ్రేయస్సు, ఆనందం కోసం ప్రత్యేక ప్రాధాన్యం | The Telugu News | Breaking News Telugu | తెలుగు వార్త‌లు

Dussehra 2025 | దసరా నాడు దానం చేయాల్సిన పవిత్ర వస్తువులు ..శ్రేయస్సు, ఆనందం కోసం ప్రత్యేక ప్రాధాన్యం

 Authored By sandeep | The Telugu News | Updated on :1 October 2025,6:00 am

Dussehra 2025 | నవరాత్రి ముగిసిన మరుసటి రోజు జరిగే దసరా లేదా విజయదశమి పండుగ చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక. శ్రీరాముడు రావణుడిపై సాధించిన విజయం గుర్తు చేసుకుంటూ ఈ పండుగను ఘనంగా జరుపుకుంటారు. అయితే ఈ శుభ సందర్భంలో దానం చేయడం అత్యంత పవిత్రమైనదిగా హిందూ సనాతన ధర్మంలో చెప్పబడింది.

#image_title

ఇవి దానం చేయాలి..

ధర్మశాస్త్రాల ప్రకారం విజయదశమి రోజున చేసే విరాళాలు బహుముఖ ఫలితాలను అందిస్తాయని, కుటుంబానికి శాంతి, ఆనందం, వృత్తిలో పురోగతిని కలిగిస్తాయని విశ్వాసం. ఈ రోజు పేదవారికి లేదా బ్రాహ్మణులకు ఆహారం, ధాన్యాలు, వస్త్రాలు దానం చేయడం అత్యంత శ్రేయస్కరం. ముఖ్యంగా గుప్త దానాలు చేయడం వలన పేదరికం తొలగిపోతుందని, ఇంట్లో సుఖశాంతులు నెలకొంటాయని నమ్మకం.

అదేవిధంగా జ్యోతిషశాస్త్రం ప్రకారం పసుపు రంగు దుస్తులను దానం చేయడం అత్యంత శుభప్రదం. పసుపు రంగు శ్రేయస్సు, అదృష్టానికి చిహ్నంగా భావించబడుతుంది. వీటితో పాటు కొబ్బరికాయ, స్వీట్లు, పవిత్ర దారాన్ని దానం చేస్తే వ్యాపారంలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయని, కొత్త అవకాశాలు లభిస్తాయని నమ్మకం ఉంది. భారతీయ సంప్రదాయం ప్రకారం చీపురును లక్ష్మీదేవి చిహ్నంగా భావిస్తారు. విజయదశమి రోజున గుడిలో లేదా పేదవారికి కొత్త చీపురు దానం చేస్తే ఇంటి నుంచి ప్రతికూల శక్తులు తొలగిపోతాయని విశ్వసిస్తారు. తెల్లని వస్త్రాలను (ధోతీ, చీర, కుర్తా-పైజామా) దానం చేయడం వల్ల జీవితంలో శాంతి, కరుణ భావన పెరుగుతుందని, మానసిక ఒత్తిడి తగ్గుతుందని చెబుతారు.

sandeep

ది తెలుగు న్యూస్‌లో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ , ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, జాతీయ, అంతర్జాతీయ వ్యవహారాలకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్ర‌త్యేక క‌థ‌నాలు, క్రీడా, హైల్త్‌, ఆధ్యాత్మికం, విద్యా ఉద్యోగం, సినిమా, బిజినెస్ సంబంధించిన వార్త‌లు రాస్తారు. గ‌తంలో ప్ర‌ముఖ తెలుగు మీడియా సంస్థ‌లో అనుభ‌వం కూడా ఉంది