Father : తండ్రి అనేపదానికి మచ్చ తెచ్చిన నీచుడు.. ఛీ.. ఏడాదిగా కూతురిపై..!
ప్రధానాంశాలు:
Father : తండ్రి అనేపదానికి మచ్చ తెచ్చిన నీచుడు.. ఛీ.. ఏడాదిగా కూతురిపై..!
Father : ఉత్తరప్రదేశ్లోని uttar pradesh మొరాదాబాద్ రైల్వే స్టేషన్లోని బాత్రూమ్ వద్ద ఓ చిన్న బ్యాగ్ కనిపించడం, అందులో పసికందు ఉండటం అక్కడ ఉన్న ప్రయాణికులను, పోలీసులను షాక్కు గురి చేసింది. రద్దీగా ఉండే ప్రదేశంలో బ్యాగ్ కనిపించడం చూసి మొదట బాంబు ఉందేమో అని భయపడ్డారు. కానీ అందులో అప్పుడే పుట్టిన శిశువు ఉండటం అందరినీ కలచివేసింది. ప్రయాణికుల సమాచారం మేరకు పోలీసులు అక్కడికి చేరుకొని చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. అదే బ్యాగ్లో లభించిన సిమ్కార్డ్ ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు, ఈ ఘోరమైన ఘటన వెనకున్న నిజాన్ని బయటకు తీసుకొచ్చారు.

Father : తండ్రి అనేపదానికి మచ్చ తెచ్చిన నీచుడు.. ఛీ.. ఏడాదిగా కూతురిపై..!
Father మృగంగా మారి కన్న కూతురి జీవితాన్ని నాశనం చేసిన తండ్రి
బీహార్కు చెందిన తొమ్మిదో తరగతి చదువుతున్న బాలిక ఈ చిన్నారి తల్లి అని పోలీసులు వెల్లడించారు. ఆ బాలిక తన తండ్రి చేతిలో గత సంవత్సరం నుంచే లై-గిక వేధింపులకు గురవుతోందని, పలుమార్లు అతడి దురాగతాల వల్ల ఆమె గర్భం దాల్చిందని విచారణలో వెల్లడైంది. ఈ విషయం తెలిసిన కుటుంబ సభ్యులు పరువు పోతుందనే భయంతో మౌనంగా ఉన్నారు. బాలికను ఢిల్లీలో వైద్యం కోసం తీసుకువెళ్తున్న సమయంలో రైలు ప్రయాణంలోనే ఆమె బాత్రూంలో పసిబిడ్డకు జన్మనిచ్చింది. అనంతరం ఎవరికీ తెలియకుండా ఆ చిన్నారిని మరో రైలు బాత్రూంలోని చెత్తబుట్టలో పడేసి పరారయ్యారు.
ప్రస్తుతం ఆ బాలికను కేంద్ర మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధీనంలోని రక్షిత కేంద్రానికి తరలించగా, శిశువును మొరాదాబాద్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించారు. బాధిత కుటుంబం తమకు శిశువును పెంచుకునే పరిస్థితి లేదని చెప్పడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. తండ్రే మృగంగా మారి తన కూతురి జీవితాన్ని బుగ్గిపాలు చేసిన ఈ దారుణం దేశంలో మహిళా భద్రతపై ఎన్నో ప్రశ్నలు లేవనెత్తుతోంది.