
Interesting Topics About Kings Who Ruled India
Kings Ruled India : మన అఖండ భారతదేశాన్ని ఎంతో మంది రాజులు పరిపాలించారు.. వివిధ కాలాలలో వివిధ రాజులు మన దేశానికి ఎంతో గొప్పగా పరిపాలించారు.. వీరి పరిపాలనలోనే ఎన్నో మతాలు, సంస్కృతులు ఏర్పడ్డాయి.. ఎన్నో కొత్త రాజ్యాలు విస్తరించాయి. మన భారతదేశం పై ఎందరో రాజులు దండయాత్ర చేస్తూనే వుండేవారు, కాని ప్రతికాలంలో ఒక్కొక్క శక్తివంతమైన రాజు వారిని తరిమి కొట్టేవారు. ఇలా భారతదేశాన్ని శక్తివంతమైన రాజులు పరిపాలించారు.. వారిలో ఒక 5 మంది రాజులు గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం.. ఆ రాజుల పరిపాలించిన కలాల్ని ఏ యుగమని అభివర్ణిస్తారు..! వంటి ఆసక్తికర విషయాలను ఇపుడు తెలుసుకుందాం..
1. చంద్ర గుప్తా మౌర్య : మౌర్య సామ్రాజ్యం వ్యవస్థాపకుడు. తన గురువైన చానిక్యుని అడుగు జాడల్లో 20 సంవత్సరాల వయస్సులోనే మొదటిగా యుద్ధం చేసి విజయం సాధించి తన ప్రచారాన్ని ప్రారంభించాడు. భారతదేశంపై గ్రేట్ అలెగ్జాండర్ నీ సైతం అపగలిగాడు, ఇంకా తన గురువైన చానుక్యుని సహాయంతో 2 లక్షల పదాతి దళాలను దాదాపు 80 వేల అశ్వ దళాలతో కూడిన సైన్యాన్ని వేలాది రథాలను, ఏనుగులను తన సైన్యంలో సమీకరించాడు.వివిధ సామ్రాజ్యాలు గా వున్న దేశాలను ఒకే దేశంగా చేయాలని చూసాడు. దానిలో భాగంగా నంద సామ్రాజ్యాన్ని, మగధ సామ్రాజ్యాన్ని ఆక్రమించుకున్నాడు.
Interesting Topics About Kings Who Ruled India
2. అశోక్ చక్రవర్తి: ఈయన భారతదేశ చక్రవర్తులలో ఒకడు. చంద్రగుప్తుని మనవడు. వీరి రాజ్యం ఆఫ్ఘనిస్తాన్ నుంచి బర్మా వరకు మరియు కాశ్మీర్ నుంచి తమిళనాడు వరకు విస్తరించి వుండేది వీరి రాజధాని పాటలిపుత్ర. వాల రాజ్యాన్ని విస్తరించడానికి దొరికిన వారిని చాలా చిత్రహింసలు పెట్టేవాడు. వీరు చేసిన కళింగ యుద్ధం అతి క్రూరమైనదిగా చెప్పవచ్చు ఈ యుద్ధం లో దాదాపుగా 2 లక్షల 50 వేల మంది ప్రాణాలు విడిచారు. చనిపోయిన వారి రక్తంతో దయ నది ఏరు గా ప్రవహించింది. ఇది చూసి అశోకుడు బౌద్ధమతాన్ని స్వీకరించాడు. ఈ మతాన్ని వేరే దేశాలకు విస్తరించాడు. ఈ మతం లో వుండగా వేరే వారి ప్రాణాన్ని బలి తీసుకోనని ప్రతిజ్ఞ చేశాడు. జీవితాంతం దానికే కట్టుబడి ఉన్నారు, అందుకే నేటి భారతదేశం జెండా యొక్క చిహ్నంలోని చక్రం స్థుపాలనుంచి తిసుకొనబడింది. 3. సముద్ర గుప్తా: ఇతను 4 శతాబ్దానికి చెందిన వాడు. గుప్తా రాజ్యం వంశానికి గల రాజు. ఇతను మరణించె నాటికి 20 కంటే ఎక్కవ రాజ్యాలను జయించి స్వాధీనం చేసుకున్నారు. ఇతను తన కుమారుడు విక్రమ ఆదిత్య తో కలిసి భారతదేశాన్ని స్వర్ణ యుగం చేశాడు. ఇతని పాలనలోనే కరెన్సీ అనేది ప్రారంభమైనది, బంగారు కరెన్సీలని తయారుచేశాడు. ఇతని కాలంలో సంగీతం, విజ్ఞానం మత స్వేచ్చ అనేది పెరిగింది. అందుకే ఇతని పాలన భారతదేశంలో ఒక స్వర్ణ యుగంగా చెప్పబడింది.
4. ఆజాత శత్రుడు: మహారాజ బింబిసార కుమారుడు. ఇతడు మగద రాజ్యాధిపతి, అరియంక రాజవంశానికి చెందిన వాడు. మగద రాజ్యాన్ని తన తండ్రి వద్ద నుండి స్వాధీనం చేసుకున్నారు ఇంకా నేపాల్ లోని వజ్జిని ఓడించి వైశాలి వంటి పెద్ద సంస్థానాన్ని మరియు కోసాల రాజ్యాన్ని పాలించిన తన సోదరుడిని ఓడించి కొసాల రాజ్యంపై ఆధిపత్యం సాధించాడు. వీరి పాలనలోనే గౌతమ బుద్ధునికి మహా వీరునికి పూర్తి ఆదరణ లభించింది. పొరుగు రాజ్యాలపై దండ యాత్రకు వెళ్ళేపుడు కొత్త ఆయుధాలు తయారు చేసేవారు. 5. రాజ రాజ చోళ : 10వ శతాబ్దానికి చెందిన చోళ వంశానికి చెందిన వాడు. ఇతడు దక్షిణాన ఉన్న రాజులందరిలో చాలా శక్తివంతుడు. ఇతడు దక్షిణ భారతదేశాన్ని పరిపాలించాడు. అలాగే ఇతని పాలనని శ్రీలంక వరకు విస్తరించాడు. హిందుమహాసముద్రంపై పట్టు సాధించాడు.సముద్రంలో జరిగే వ్యాపార వాణిజ్యాలు ఇతని అనుమతి లేకుండా జరిగేవి కావు.100 కంటే ఎక్కవ దేవాలయాలు నిర్మించారు.ఇతను నిర్మించిన దేవాలయాలలో తంజావూరు దేవాలయం ఒకటి, ప్రస్తుతం ఇది యునెస్కో గుర్తింపు పొందినది.
Supreme Court : ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సరళిపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెద్ద చర్చ జరుగుతోంది. ముఖ్యంగా ఎన్నికల ప్రక్రియలో ప్రజాస్వామ్యం…
Dhurandar-2 : ధురంధర్ ది రివేంజ్ చిత్రం విడుదలైన నాలుగు వారాలు పూర్తవుతున్నా కూడా బాక్సాఫీస్ వద్ద అదే జోష్…
Ys Jagan Modi : ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడూ ఏదో ఒక సంచలనం జరుగుతూనే ఉంటుంది. ముఖ్యంగా కేంద్రంలో ఉన్న…
El Nino Summer : ప్రస్తుతం ఎండలు మండిపోతున్నాయి. సాధారణంగా వచ్చే వేసవి కాలం వేరు, కానీ ఇప్పుడు మనం…
Chanikiya Niti : హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియం వేదికగా ఈరోజు రాత్రి జరగబోయే సన్రైజర్స్ హైదరాబాద్ మరియు రాజస్థాన్ రాయల్స్…
Getup Srinu : తెలుగు ప్రేక్షకులకు నవ్వులు పంచిన ప్రముఖ కామెడీ షో “జబర్దస్త్” ద్వారా గెటప్ శ్రీను అపారమైన…
IPL 2026 : ఐపీఎల్ 2026 టోర్నీలో భాగంగా హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో జరిగిన ఉత్కంఠభరిత మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్…
Farming Tips : వ్యవసాయం అంటే కేవలం శ్రమతో కూడిన పని మాత్రమే కాకుండా సరైన ప్రణాళికతో లాభాలను అందించే…
Cardamom : మన రోజువారీ జీవితంలో చిన్న చిన్న అలవాట్లు పెద్ద ఆరోగ్య మార్పులకు దారి తీస్తాయి. అలాంటి ఒక…
Mobile : నేటి డిజిటల్ ప్రపంచంలో ఫోన్ నోటిఫికేషన్లు మన రోజువారీ జీవితంలో భాగమైపోయాయి. ఒక్క నిమిషం కూడా రింగ్టోన్…
Bullet Coffee : ప్రస్తుతం సోషల్ మీడియాలో హెల్త్ ట్రెండ్స్ గురించి వెతికే వారికి ఎక్కువగా వినిపిస్తున్న పేరు ‘బుల్లెట్…
YS Suneetha : వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. దాదాపు ఏడేళ్లుగా సిబిఐ…
This website uses cookies.