KCR Hits Hard At Narendra Modi Govt
KCR : తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు తాజాగా మీడియా ముందుకొచ్చారు. ఈసారి నీతి అయోగ్ మీద విమర్శలు చేయడానికే ప్రెస్ మీట్ మొత్తాన్నీ వాడేశారు కేసీయార్. నీతి అయోగ్ సమావేశానికి హాజరు కాకూడదని నిర్ణయించుకున్నట్లు మీడియా ద్వారా రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు తెలిపిన కేసీయార్, నరేంద్ర మోడీ సర్కారు ప్రతిష్టాత్మకంగా నీతి అయోగ్ తెచ్చిందనీ, ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి.. నీతి అయోగ్ తెస్తే మంచి జరుగుతుందని తామూ అనుకున్నామనీ, కానీ.. మంచి జరగలేదు సరికదా చెడు ఎక్కువ జరిగిందనీ కేసీయార్ చెప్పుకొచ్చారు.
ప్రణాళికా సంఘం దగ్గర సరైన ప్రణాళిక వుండేదనీ, నీతి అయోగ్ దగ్గర ప్రణాళిక వుండదనీ, రాష్ట్రాల అభిప్రాయాలు కోరడం వరకే తప్ప, ఆ అభిప్రాయాలకు అక్కడ విలువ వుండదని కేసీయార్ చెప్పుకొచ్చారు. నీతి అయోగ్ సమావేశం కోసం ఢిల్లీకి వెళ్ళడం ఖర్చు దండగ వ్యవహారమని కేసీయార్ విమర్శించడం గమనార్హం. ‘వేరే రాష్ట్రాల ముఖ్యమంత్రులకు ఏ సమస్యలు వున్నాయో నాకు తెలియదు. నా రాష్ట్రానికి వున్న సమస్యల్ని నేను మాట్లాడతాను. దేశ పౌరుడిగా, దేశానికి జరుగుతున్న అన్యాయం గురించి కూడా మాట్లాడతాను..’ అంటూ కేసీయార్ ఈసారి ఒకింత భిన్నంగా వ్యాఖ్యానించారు.
KCR Hits Hard At Narendra Modi Govt
రాష్ట్రాల హక్కుల్ని కేంద్రం హరిస్తోందనీ, అప్పులు చేసుకోవడానికి అవకాశం లేకుండా చేస్తోందనీ కేసీయార్ విమర్శించారు. వృద్ధులకు పెన్షన్లు ఇస్తోంటే, ఉచితాలెందుకని కేంద్రం ఆక్షేపిస్తోందన్న కేసీయార్, వృద్ధులకు, వికలాంగులకు పెన్షన్లు ఇవ్వడాన్ని గౌరవంగా భావిస్తున్నామని చెప్పారు. 5జి స్పెక్ట్రమ్ వేలంలో లక్షల కోట్ల కుంభకోణం జరిగిందని కేసీయార్ సంచలన ఆరోపణలు చేయడం ఈ ప్రెస్ మీట్ మొత్తానికీ హైలైట్ అంశంగా చెప్పుకోవచ్చు. రాష్ట్రాల్లో అధికారంలో వున్న బీజేపీయేతర పార్టీలపై రాజకీయ కుట్రలు చేస్తోన్న కేంద్రం, దేశంలో ఒకే ఒక్క పార్టీ అధికారంలో వుండాలనే దిశగా వేధింపులకు పాల్పడుతోందని అసహనం వ్యక్తం చేశారు.
Shubman Gill : పాతిక సంవత్సరాల వయసులో టీమిండియా సుదీర్ఘ ఫార్మాట్ సారధి శుభమన్ గిల్ Shubman Gill ఇప్పుడు…
Mahesh Babu : టాలీవుడ్లో Tollywood ఆదర్శవంతమైన దంపతులుగా గుర్తింపు పొందిన మహేష్ బాబు Mahesh Babu –నమ్రత జంటపై…
Pawan Kalyan : ప్రకాశం జిల్లాలో రూ.1,290 కోట్లతో చేపట్టనున్న రక్షిత తాగునీటి పథకానికి ఆంధ్రప్రదేశ్ Andhra pradesh ఉప…
Fish Venkat Prabhas : టాలీవుడ్ ప్రముఖ నటుడు ఫిష్ వెంకట్ గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ప్రస్తుతం, ఆయన…
Janasena : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ TDP ఆధ్వర్యంలో 'సుపరిపాలనలో తొలి…
Thammudu Movie : ఒకప్పుడు హీరోయిన్గా ప్రేక్షకులను మెప్పించిన లయ, ఇప్పుడు సీనియర్ హీరోయిన్గా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది.…
Chandrababu : రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన కూటమి ప్రభుత్వం "సుపరిపాలనలో తొలి అడుగు" అనే కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించింది. ఈ…
Pakiza : హాస్య నటిగా పాకీజా అలియాస్ వాసుకీ ఎన్నో చిత్రాలతో ప్రేక్షకల్ని మెప్పించారు. కొంతకాలంగా అవకాశాలు లేక తీవ్ర…
This website uses cookies.