Khammam : అద్భుత కట్టడం.. కూసుమంచి గణపేశ్వరాలయం

Authored By Varun G | The Telugu News | Updated on : 9 August 2021, 2:00 pm

Khammam : ఇటీవలే కాకతీయ కాలంలో నిర్మించిన రామప్ప గుడికి యునెస్కో గుర్తింపు లభించింది. నిజంగా రామప్ప కట్టడం అనేది ఒక అద్భుతం. ఇప్పటికీ.. ఆ కట్టడాన్ని ఎలా నిర్మించారా? అని మేధావులే ఆశ్చర్యపోతున్నారు. అలాంటి అద్భుత కట్టడాలు.. తెలంగాణలో చాలా ఉన్నాయి. ఖమ్మం జిల్లాలోని కూసుమంచిలో ఉన్న గణపేశ్వరాలయం కూడా అటువంటిదే.

kusumanchi ganapeswaralayam in khammam dist

kusumanchi ganapeswaralayam in khammam dist

కాకతీయుల కాలంలో నిర్మించిన కూసుమంచి గణపేశ్వరాలయం.. పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. కూసుమంచిలో నిర్మించిన ఈ గణపేశ్వరాలయంలో… గణపతి దేవుడు.. పెద్ద శివలింగాన్ని ప్రతిష్ఠించారు. ఈ గుడిని కాకతీయుల కాలంటో.. గణపతిదేవుడు నిర్మించారు.

ఈ ఆలయంలో ఉన్న ప్రతి స్తంభం, ప్రతి శిల్పానికి ఒక ప్రాధాన్యత ఉంటుంది. వాటిని చూస్తేనే మైమరిచిపోతాం. అందుకే.. పర్యాటకులను ఈ దేవాలయం ప్రత్యేకంగా ఆకర్షిస్తోంది. ఈ దేవాలయాన్ని కూడా గణపతి దేవుడు నక్షత్రాకారంలో నిర్మించారు. ఆ గుడిలో ఉండే శివలింగం సుమారు మూడున్నర అడుగులు ఉంటుంది. ఈ కట్టడం కింద కూడా ఇసుక ఉంటుంది. ఇసుక మీద ఈ కట్టడాన్ని నిర్మించారు. భూకంపాలను తట్టుకునేలా.. కాకతీయలు ఆ టెక్నాలజీని వాడి కట్టడాలు నిర్మించేవారు.

Varun G

No bio available for this author.

Google The Telugu News మీకు నచ్చిన సైటుగా ఎంచుకోండి
WhatsApp