Petrol Prices : పెట్రో ధరల్ని పెంచినవాళ్ళే తగ్గించాలి కదా.!

Advertisement
Advertisement

Petrol Prices : పెట్రో ధరల్ని పెంచేది కేవలం కేంద్ర ప్రభుత్వం మాత్రమే. ఎందుకంటే, ‘చమురు కంపెనీలు పెట్రో ధరల్ని రోజువారీగా సవరించే ల‌వీలు’ కల్పించింది కేంద్రమే. రాష్ట్రాలకు ఈ విషయంలో ఎలాంటి ప్రమేయమూ వుండదు. పెట్రో ఉత్పత్తుల అమ్మకాల ద్వారా కేంద్రానికి, రాష్ట్రానికి నిధులు సమకూరుతుంటాయి. వ్యాట్ సహా అనేక పన్నులు పెట్రో ఉత్పత్తుల మీద విధించబడుతున్న దరిమిలా, కేంద్ర రాష్ట్రాలు తదనుగుణంగా ఖజానా నింపుకుంటాయి. అయితే, పెట్రో ధరలు నరేంద్ర మోడీ హయాంలో అత్యంత దారుణంగా పెరిగిపోవడానికి అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరల ప్రభావమొక్కటే కారణం కాదు. కేంద్రం మోత మోగించిన పన్నుల వల్లనే ఇదంతా జరిగింది. సో, పెంచిన పన్నుల్ని కేంద్రం తగ్గించేస్తే.. రాష్ట్రాల్లో పెట్రో ధరలు సాధారణ స్థితికి వచ్చేస్తాయి.

Advertisement

ఎంత సాధారణ స్థితికి అంటే.. తెలుగు రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ ధర కేవలం 70 నుంచి 75 రూపాయలకే పడిపోతుంది. కానీ, కేంద్రం పెట్రో ఉత్పత్తులపై పిండుకుంటోన్న పన్నుల్ని తగ్గించే ప్రసక్తే లేదు. ఇటీవల 8 రూపాయల మేర లీటర్ పెట్రోలుపై తగ్గించిన కేంద్రం, ఏకంగా లక్ష కోట్ల నష్టం వచ్చేస్తోందంటూ చెబుతోంది. ఆ లక్ష కోట్లను సమకూర్చుకునేందుకు ఏం అమ్మేస్తుందో మోడీ సర్కారుగానీ.. అలాక్కూడా దేశ ప్రజలకు నష్టమేనన్నమాట. మన్మోహన్ సర్కారు దిగిపోయి, మోడీ సర్కారు వచ్చాక.. దేశంలో జరిగిన అభివృద్ధి ఏంటి.? అన్నదానిపై భిన్న వాదనలున్నాయి. ప్రపంచం సాధిస్తున్న ప్రగతిలో కొంత మేర మన భారతదేశం తాలూకు ప్రగతి కూడా వుంది. అంతే తప్ప, దేశం ప్రత్యేకంగా మోడీ హయాంలో సాధించిన ప్రగతి ఏమీ లేదన్నది విశ్లేషకుల మాట.

Advertisement

Petrol Prices Modi’s Biggest Failure

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తే, దాని వల్ల దేశంలో ఏ ఇతర రాష్ట్రానికీ నష్టం వుండదు. పైగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రత్యేక హోదాతో అభివృద్ధి చెందితే, ఆ ఫలాలు దేశమంతటికీ అందుతాయి.. దేశ ప్రగతిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కీలక భూమిక పోషిస్తుంది. ఎందుకంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వున్న సహజ వనరులు అలాంటివి. ఆంధ్రప్రదేశ్ అనే కాదు, తెలంగాణ రాష్ట్రానికి కేంద్రం దన్నుగా నిలిచినా ఇదే పరిస్థితి. చిన్న విషయాలు కావివి.. తెలుగు రాష్ట్రాల మీద కేంద్రం శీతకన్నేయడం దేశ ప్రగతికి కొంత మేర ఇబ్బంది కలిగిందన్న వాదనా లేకపోలేదు. చాలా రాష్ట్రాలు ఇదే తరహా ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి మోడీ సర్కారు మాత్రం, ‘పెట్రో మోత’ అర్థం పర్థం లేకుండా మోగించేస్తూ, ఆర్థిక నష్టాలనీ ఇంకోటనీ కట్టు కథలు చెబుతూనే వుంది.

Advertisement

Recent Posts

Jani Master : నాకు ఈ పిల్ల దొరికింది కన్నీళ్లు పెట్టించిన జాని మాస్టర్..!

Jani Master " గత కొంతకాలంగా లైంగిక వేధింపుల ఆరోపణలతో జైలు శిక్ష అనుభవించి, ఇటీవల బెయిల్‌పై విడుదలైన ప్రముఖ…

28 minutes ago

Ambati Rambabu : కొండంత సింపతీ.. అంబటి రాంబాబుకి బ్రహ్మాండమైన బూస్ట్ ఇచ్చిన చంద్రబాబు..!

Ambati Rambabu : మాజీ మంత్రి అంబటి రాంబాబును ఎలాగైనా జైలులోనే ఉంచాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని,…

1 hour ago

Ration cards : బిగ్‌ బ్రేకింగ్ న్యూస్ .. రేషన్ కార్డులపై శుభవార్త తెలిపిన ప్రభుత్వం…!

Ration cards : రాష్ట్రంలో రేషన్ కార్డుల జారీ ప్రక్రియ ఎటువంటి విరామం లేకుండా నిరంతరం కొనసాగుతోందని ప్రభుత్వం మరోసారి…

2 hours ago

Driving Licence : హైదరాబాద్ వాహనదారులకు అలర్ట్.. డ్రైవింగ్ లైసెన్స్‌లో ఈ మార్పులు తప్పనిసరి .. లేకపోతే ఇబ్బందులే..!

Driving Licence : హైదరాబాద్ మహానగరం తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలకు ప్రధాన…

3 hours ago

Jahnavi Kandula : జాహ్నవి కందుల మృతి కేసులో కీలక పరిణామం .. కుటుంబానికి రూ.262 కోట్ల పరిహారం

Jahnavi Kandula : అమెరికాలో పోలీసు అధికారి నిర్లక్ష్యంతో ప్రాణాలు కోల్పోయిన కర్నూలుకు చెందిన జాహ్నవి కందుల (23) కుటుంబానికి…

4 hours ago

World’s Most Expensive Wood : బంగారం కూడా దీని ముందు దిగదుడుపే.. కేజీ కోటి పైమాటే.. ఈ చెట్టు ముక్క దొరికితే మీ దశ తిరిగినట్టే..!

World's Most Expensive Wood : బంగారమే ప్రపంచంలో అత్యంత విలువైనది అని మీరు అనుకుంటే పొరపాటే. అంతకు మించిన…

5 hours ago

Redmi K100 Review : రెడ్‌మీ నుంచి కొత్త బీస్ట్ ఫోన్.. 200MP కెమెరా, 9000mAh బ్యాటరీ.. ఫీచర్స్ చూస్తే మతిపోతుంది..!

Redmi K100 Review : సాధారణంగా రెడ్‌మీ Redmi అంటే తక్కువ ధరలో మంచి ఫీచర్లు ఇచ్చే బ్రాండ్ అని…

6 hours ago

Rythu Bharosa : తెలంగాణ రైతులకు శుభవార్త .. ‘రైతు భరోసా’డబ్బులకు లైన్‌క్లియర్ మీ ఖాతాల్లో పడేది ఆరోజే.. !

Rythu Bharosa : తెలంగాణ Telangana Farmars  రైతులకు ఊరటనిచ్చే కీలక పరిణామం చోటుచేసుకుంది. యాసంగి సీజన్‌కు సంబంధించిన రైతు…

7 hours ago